ఓటీటీ సినిమాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి తలెత్తుతోంది. ఈ సినిమాలను నిర్మాతలు అమ్మేసుకుని సేఫ్ అయిపోతున్నారు. ఓటీటీలకు వాటి వల్ల దక్కాల్సిన ప్రయోజనం దక్కుతున్నట్లే ఉంది. కానీ థియేటర్ వినోదం లేని ఈ రోజుల్లో ఓటీటీల్లో అయినా కొత్త సినిమాలను ఎంజాయ్ చేద్దామని ఆశగా చూస్తున్న ప్రేక్షకులకే తల బొప్పి కడుతోంది. ఒకటీ అరా మినహాయిస్తే ఓటీటీ సినిమాలన్నీ ప్రేక్షకులకు తల బొప్పి కట్టించినవే.
ఈ మధ్యే తెలుగులో మిస్ ఇండియా అనే సినిమా రిలీజైంది. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. హిందీలో భారీ అంచనాలతో విడుదలైన లక్ష్మి కూడా చెత్త సినిమా అని తేల్చేశారు. ఇలాంటి తరుణంలో అందరి ఆశలూ సూర్య సినిమా ఆకాశం నీ హద్దురా (తమిళంలో సూరారై పొట్రు) మీదే నిలిచాయి.
ఇప్పటిదాకా దక్షిణాదిన రిలీజైన సినిమాల్లోకెల్లా ఇది పెద్దది. సూర్య లాంటి హీరో సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో నేరుగా విడుదల కావడం అన్నది నమ్మశక్యం కాని విషయం. ఐతే ఎప్పటికప్పుడు ట్రెండుకు తగ్గట్లుగా మారుతూ ఉండే సూర్య తన సినిమాను ఓటీటీ రిలీజ్కు రెడీ చేసేశాడు. ఇది సౌత్లో ఓటీటీలో వస్తున్న అతి పెద్ద సినిమా మాత్రమే కాదు.. మోస్ట్ ప్రామిసింగ్ మూవీ కూడా. అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెలుగమ్మాయి సుధ కొంగర ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ సినిమా ప్రోమోలన్నీ చాలా ప్రామిసింగ్గా అనిపించాయి. అవి చూస్తే ఒక పాజిటివ్ ఫీల్ కలిగింది. విషయమున్న కథ, సరైన ప్రెజెంటేషన్, గొప్ప నటుడు.. ఇలా అన్నీ బాగా అమరిన సినిమాలా కనిపిస్తున్న ఈ చిత్రం బుధవారం అర్ధరాత్రి నుంచి అమేజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కానుంది. మరి ఓటీటీ సినిమాలంటే బెంబేలెత్తిపోయే ట్రెండును మార్చి ఈ చిత్రం గేమ్ చేంజర్ అవుతుందేమో చూడాలి.
This post was last modified on November 12, 2020 8:19 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…