Movie News

పూరి జగన్నాధ్ స్కెచ్ ఆషామాషీగా లేదే

లైగర్, డబుల్ ఇస్మార్ట్ రూపంలో వరస డిజాస్టర్లు అందుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్ ఈసారి తన కంబ్యాక్ కోసం మాములు స్కెచ్ వేయడం లేదు. విజయ్ సేతుపతితో సినిమా ఓకే అయ్యాక క్యాస్టింగ్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు సూపర్ అనిపిస్తున్నాయి. సాధారణంగా పెద్ద ఫ్లాపులు వచ్చినప్పుడు ఎంత స్టార్ డైరెక్టర్ అయినా సరే కాంబోలు సెట్ చేసుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ పూరి ఆ సమస్య లేకుండా అన్ని మార్కెట్లను రీచ్ అయ్యేలా తారాగణం ఎంచుకుంటున్నాడు. చాలా సెలెక్టివ్ గా ఉండే సీనియర్ నటి టబుని ఓకే చేయించాడు. వీరసింహారెడ్డి విలన్ దునియా విజయ్ ని ఒప్పించాడు.

తాజాగా సంయుక్త మీనన్ ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇవాళ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నిజానికి ఈ పాత్రకు ముందు నివేదా థామస్, రాధికా ఆప్టే పేర్లు వినిపించాయి. పలు వర్గాలు విశ్వసనీయంగా ఇవే ఉంటాయని కూడా చెప్పాయి. కానీ తీరా చూస్తే పూరి ప్లాన్ వేరే లెవెల్ లో ఉంది. సంయుక్త మీనన్ ని తీసుకోవడం ద్వారా మంచి గ్లామర్ టచ్ ఇచ్చినట్టు అవుతుంది. తనేమి భీకరమైన ఫామ్ లో లేకపోయినా కెరీర్ లో మంచి హిట్లే ఉన్నాయి. స్వయంభు, అఖండ 2, హైందవ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ లో నటిస్తోంది. ఇలాంటి టైంలో పూరికి ఎస్ చెప్పడం చూస్తే క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉన్నట్టే.

ముందు బెగ్గర్ టైటిల్ ప్రచారంలోకి వచ్చినా ఫైనల్ గా భిక్షామ్ దేహిని లాక్ చేస్తారని లేటెస్ట్ అప్డేట్. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే పదం కనక దీనికే లాకవ్వొచ్చని అంటున్నారు. బెగ్గర్ లో లైగర్ తరహా సౌండింగ్ ఉండటంతో సన్నిహితులు వద్దని వారించారట. ఇటీవలే విజయేంద్ర ప్రసాద్ ని కలిసి పలు సూచనలు తీసుకుని పూరి ఏ విషయంలో రాజీ పడటం లేదు. సాంకేతిక వర్గం, ఇతర నటీనటులను త్వరలోనే ప్రకటించబోతున్నారు. తెలుగు తమిళ భాషల్లో సమాంతరంగా విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లొచ్చని తెలిసింది.

Kumar

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

28 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

10 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago