లైగర్, డబుల్ ఇస్మార్ట్ రూపంలో వరస డిజాస్టర్లు అందుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్ ఈసారి తన కంబ్యాక్ కోసం మాములు స్కెచ్ వేయడం లేదు. విజయ్ సేతుపతితో సినిమా ఓకే అయ్యాక క్యాస్టింగ్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు సూపర్ అనిపిస్తున్నాయి. సాధారణంగా పెద్ద ఫ్లాపులు వచ్చినప్పుడు ఎంత స్టార్ డైరెక్టర్ అయినా సరే కాంబోలు సెట్ చేసుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ పూరి ఆ సమస్య లేకుండా అన్ని మార్కెట్లను రీచ్ అయ్యేలా తారాగణం ఎంచుకుంటున్నాడు. చాలా సెలెక్టివ్ గా ఉండే సీనియర్ నటి టబుని ఓకే చేయించాడు. వీరసింహారెడ్డి విలన్ దునియా విజయ్ ని ఒప్పించాడు.
తాజాగా సంయుక్త మీనన్ ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇవాళ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నిజానికి ఈ పాత్రకు ముందు నివేదా థామస్, రాధికా ఆప్టే పేర్లు వినిపించాయి. పలు వర్గాలు విశ్వసనీయంగా ఇవే ఉంటాయని కూడా చెప్పాయి. కానీ తీరా చూస్తే పూరి ప్లాన్ వేరే లెవెల్ లో ఉంది. సంయుక్త మీనన్ ని తీసుకోవడం ద్వారా మంచి గ్లామర్ టచ్ ఇచ్చినట్టు అవుతుంది. తనేమి భీకరమైన ఫామ్ లో లేకపోయినా కెరీర్ లో మంచి హిట్లే ఉన్నాయి. స్వయంభు, అఖండ 2, హైందవ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ లో నటిస్తోంది. ఇలాంటి టైంలో పూరికి ఎస్ చెప్పడం చూస్తే క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉన్నట్టే.
ముందు బెగ్గర్ టైటిల్ ప్రచారంలోకి వచ్చినా ఫైనల్ గా భిక్షామ్ దేహిని లాక్ చేస్తారని లేటెస్ట్ అప్డేట్. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే పదం కనక దీనికే లాకవ్వొచ్చని అంటున్నారు. బెగ్గర్ లో లైగర్ తరహా సౌండింగ్ ఉండటంతో సన్నిహితులు వద్దని వారించారట. ఇటీవలే విజయేంద్ర ప్రసాద్ ని కలిసి పలు సూచనలు తీసుకుని పూరి ఏ విషయంలో రాజీ పడటం లేదు. సాంకేతిక వర్గం, ఇతర నటీనటులను త్వరలోనే ప్రకటించబోతున్నారు. తెలుగు తమిళ భాషల్లో సమాంతరంగా విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లొచ్చని తెలిసింది.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…