ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలికి టాలీవుడ్ వరకు రజినీకాంత్ కన్నా ఎక్కువగా నాగార్జున ఇమేజ్ మార్కెట్ చేసేలా ఉందని సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఆ మధ్య వదిలిన ప్రీ టీజర్ లో రజినీ లుక్స్ కన్నా ఎక్కువ నాగ్ వెనుక నుంచి జుత్తు సరిచేసుకునే షాట్ విపరీతంగా వైరలయ్యింది. అయితే తన పాత్ర ఎలా ఉంటుందనే విషయం ఇప్పటిదాకా స్పష్టంగా రాకపోవడంతో ఫ్యాన్స్ లో కొంత అనుమానం లేకపోలేదు. దానికి నాగార్జునే స్వయంగా చెక్ పెట్టేశారు. కూలిలో విలన్ తానేనని, అది ఎలా జరిగింది, ఎందుకు ఒప్పుకున్నాననే విషయం ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ మొదటిసారి నాగార్జునని కలిసినప్పుడు ఒకటే ప్రశ్న అడిగాడు. మీరు విలన్ గా చేయడానికి ఆసక్తిగా ఉన్నారా, ఒకవేళ లేకపోతే ఒక కప్పు టీ తాగేసి ఇద్దరం సెలవు తీసుకుందామని అన్నాడు. దానికి నాగ్ సమాధానమిస్తూ అలాంటి హద్దులేమి లేవని, ముందు స్క్రిప్ట్ విన్నాక డిసైడ్ అవుతానని చెప్పారు. మొదటి నెరేషన్ లోనే కథ విపరీతంగా నచ్చేసింది. అలా అయిదారుసార్లు ఇద్దరు డిస్కస్ చేసుకున్నాక క్యారెక్టర్ బెస్ట్ గా కుదిరిందని కింగ్ కు నమ్మకం వచ్చాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా రజినీకాంత్, నాగార్జున కలయికకు లోకేష్ కనగరాజ్ శ్రీకారం చుట్టాడన్న మాట.
ఇలా ఫుల్ లెన్త్ విలన్ గా చేయడం నాగార్జునకి ఇది మొదటిసారని చెప్పాలి. కొంత నెగటివ్ షేడ్ ఉన్న రోల్స్ గతంలో కిల్లర్, అంతం లాంటి వాటిలో చేసినప్పటికీ వాటిలో హీరోయిజం ఫ్లేవర్ పుష్కలంగా ఉంటుంది. కానీ కూలిలో అలా కాదు. మెయిన్ హీరో రజినీకాంత్ డామినేషన్ ఎంతలేదన్నా బలంగా ఉంటుంది. దాన్ని తట్టుకుని నాగార్జున తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎలా డామినేట్ చేశాడనేది కీలకం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం విక్రమ్ లో రోలెక్స్ ని మించి నాగ్ ఉంటారని, బెస్ట్ కాంబోగా ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయమని అంటున్నారు. జూన్ 20 రిలీజ్ కాబోతున్న కుబేర ప్రమోషన్లలో భాగంగా నాగార్జున ఈ సంగతులు పంచుకున్నారు.
This post was last modified on June 16, 2025 10:25 pm
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను సంతృప్తి పరచడం లేదని బాహాటంగానే…
వ్యూస్ వస్తే డబ్బులొస్తాయి. ఆ పైసల కోసం చేసే పాడు పనులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పే ఒక…
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరూ నాలుగు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నారు. కానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ కలిసి సినిమా చేసింది…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం వల్ల గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి ఈసారి…