నిన్న విడుదలైన కన్నప్ప ట్రైలర్ కు రెస్పాన్స్ బాగుంది. కానీ ఇంకా ఎక్కువ ఆశించిన అభిమానులు మరో వెర్షన్ ని డిమాండ్ చేస్తున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ప్రభాస్ ఉన్న సీన్లను బాగానే చూపించారు కానీ డార్క్ టోన్ లో సెట్ చేసిన విఎఫ్ఎక్స్ పట్ల కొంత మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అంతే కాదు వీడియో మొదట్లో బాల కన్నప్పగా నటించిన మంచు విష్ణు అబ్బాయి అవ్రమ్ ఇంగ్లీష్ స్లాంగ్ లో డైలాగులు చెప్పడం స్పష్టంగా వినిపించింది. ఆర్టిస్టులందరినీ రివీల్ చేయడం వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా ట్రోలింగ్ కి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎడిట్ చేయడం అన్నిటికన్నా పెద్ద సానుకూలాంశం.
ఇప్పుడు కన్నప్ప బృందంపై ఇంకో బాధ్యత ఉంది. అంచనాలను మరింత పెంచేలా కొత్త వెర్షన్ ట్రైలర్ చిన్నదైనా సరే మరొకటి రెడీ చేయాలి. రిలీజ్ ట్రైలర్ వేరే రావొచ్చని మంచు విష్ణు చూచాయగా చెప్పాడు కానీ ఎంత వరకు నిజమో ఇంకో వారంలో తెలిసిపోతుంది. గత నెల రోజులుగా స్తబ్దుగా ఉన్న థియేటర్లకు జీవం పోయాల్సిన బాధ్యత కుబేరతో పాటు కన్నప్ప మీద ఉంది. సరైన ఫీడింగ్ లేక దాదాపు బంద్ వాతావరణాన్ని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాల సినిమా హాళ్లు వీటి కోసమే ఎదురు చూస్తున్నాయి. హరిహర వీరమల్లు వాయిదా లేకపోయి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేది. పోస్ట్ పోన్ వల్ల అంతా రివర్స్ అయ్యింది.
ప్రమోషన్ల వరకు విష్ణు ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. ట్రైలర్ లాంచ్ కి కేరళని ఎంచుకోవడం మంచి ఎత్తుగడ. మోహన్ లాల్ ని గెస్టుగా తేవడం, సరదాగా ఈవెంట్ గడిచిపోవడం అక్కడి మీడియాలో బజ్ వచ్చేలా చేసింది. లాలెట్టాన్ ఇందులో చేసింది చిన్న పాత్రే అయినా స్వయంగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం చూస్తే కంటెంట్ లో విషయం ఉందని అర్థమవుతోంది. ముంబైలో అక్షయ్ కుమార్ దగ్గరుండి మరీ అన్ని చూసుకున్నాడు. గుంటూరులో ఒక ఈవెంట్ అయిపోయింది. హైదరాబాద్ ది ప్లానింగ్ ఉంది కానీ ప్రభాస్ ని గెస్టుగా తీసుకొచ్చి గ్రాండ్ గా చేస్తే కన్నప్పకు సంబంధించిన పబ్లిసిటీకి మంచి ఫినిషింగ్ టచ్ అవుతుంది.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…