టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీస్ లో ఒకటిగా ఉన్న కన్నప్ప ఈ నెలాఖరు జూన్ 27 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో మంచు విష్ణు నిర్మించిన ఈ డివోషనల్ డ్రామాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన కన్నప్పలో ప్రభాస్ క్యామియో చేయడం వల్ల అంచనాలు ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ట్రైలర్ మీద ఉంది. బిజినెస్, ఓపెనింగ్స్ తేవడంలో దీని పాత్ర చాలా కీలకం కావడంతో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2 నిమిషాల 54 సెకండ్ల ట్రైలర్ లాంచ్ జరిగిపోయింది.
చిన్నప్పటి నుంచే తిన్నడు (మంచు విష్ణు) పరమ నాస్తికుడు. గూడెం అంతా శివభక్తిలో ఉంటే తాను మాత్రం దేవుడిని తిడుతూ ఉంటాడు. అక్కడ ఉండే మహిమ గల వాయు లింగం మీద శత్రువులు కన్నేస్తారు. కారణజన్ముడైన తిన్నడిలో మార్పు తెచ్చేందుకు సాక్ష్యాత్తు పరమశివుడు (అక్షయ్ కుమార్) తన బంటైన రుద్ర (ప్రభాస్) ని ఆ గూడెంకు పంపిస్తాడు. ఇద్దరి మధ్య స్నేహంతో పాటు మాటా మాటా పెరుగుతాయి. ఎన్నో అనూహ్య పరిణామాల తర్వాత తిన్నడు కన్నప్పగా మారి శివ భక్తిలోని గొప్పదనం తెలుసుకుంటాడు. అది ఎలా, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడమే అపరభక్తుడైన కన్నప్ప కథ.
అందరూ విపరీతమైన దృష్టి పెట్టిన ప్రభాస్ ని హైలైట్ చేయడం కన్నప్పకు అది పెద్ద ప్లస్ కానుంది. మాస్ కటవుట్ గానే కాక ఆధ్యాత్మికత నిండిన పాత్రల్లోనూ డార్లింగ్ ఎంతగా ఒదిగిపోగలడో ఇందులో శాంపిల్ చూపించారు. పెర్ఫార్మన్స్ పరంగా పెద్ద ఛాలెంజ్ తీసుకున్న మంచు విష్ణు దానికి తగ్గట్టే చాలా వేరియేషన్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ క్వాలిటీ మీద తీసుకున్న శ్రద్ధ మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. టెక్నికల్ టీమ్ పనితనం బాగుంది. ఇప్పటిదాకా అండర్ కవర్ గా ఉన్న కన్నప్ప అంచనాలు పెంచడంలో సక్సెసయ్యింది. అసలు కంటెంట్ ఇలాగే ఉంటే విష్ణుకి బ్లాక్ బస్టర్ ఖాయం.
This post was last modified on June 14, 2025 6:56 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…