ప్రముఖ జానపద, సినీ గాయని మంగ్లీ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆమె పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి దొరకడం కలకలం రేసింది. హైదరాబాద్ శివార్లలోని ఈర్లపల్లి వద్ద ఒక రిసార్టులో మంగ్లీ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా.. పోలీసులు రైడ్ చేసి అనుమతి లేని విదేశీ మద్యం, గంజాయిని పట్టుకోవడం.. ఆ పార్టీలో ఉన్న కొందరు గంజాయి సేవించినట్లు పరీక్షల్లో తేలడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మంగ్లీ వివరణ ఇచ్చుకున్నప్పటికీ.. బీఆర్ఎస్, వైసీపీ మద్దతుదారుగా ముద్ర ఉన్న మంగ్లీ ఈ కేసు నుంచి ఎలా బయటపడుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఐతే ఈ కేసు వ్యవహారం ఇలా ఉండగానే.. ఆమె తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గద్దర్ అవార్డుల వేడుకలో పెర్ఫామ్ చేయబోతున్నట్లు వార్తలు రావడం విశేషం.
ఈ అవార్డుల వేడుక కోసం మంగ్లీ రిహార్సల్స్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. అంటే హైటెక్స్లో జరిగే ఈవెంట్లో మంగ్లీ మెరవబోతోందన్నమాట. అంటే ఈ కేసుకి, అవార్డుల వేడుకకు సంబంధం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనుకోవాలి.
ఇంతకుముందు పుష్ప-2 రిలీజ్ టైంలో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతణ్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్నారు. కానీ కట్ చేస్తే గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా బన్నీనే ఎంపిక చేశారు. ఇంకోవైపు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో రేవంత్ వెర్సన్ నాగార్జున అంటూ చర్చ జరిగింది. కానీ ఇటీవల మిస్ వరల్డ్ వేడుకల్లో రేవంత్, నాగ్ కలిసి కనిపించారు. గద్దర్ అవార్డుల వేడుకకు కూడా నాగ్ వస్తాడని అంటున్నారు. అంటే రాజకీయాలు వేరు, కళలు వేరు అని రేవంత్ సర్కారు స్పష్టమైన తేడాను చూపిస్తోందని భావించాలి.
This post was last modified on June 14, 2025 6:21 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…