కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన కామెంట్లకు నిరసనగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ థగ్ లైఫ్ ని బ్యాన్ చేయడంలో విజయం సాధించింది. నిరసనలకు భయపడి ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాకపోవడంతో కమల్ ఆ రాష్ట్రంలో విడుదల మానుకున్నారు. బెంగళూరు కోర్టు సైతం లోకనాయకుడికి ప్రతికూలంగా క్షమాపణ చెప్పమని సూచన చేయడం, ఆయన తప్పు చేయలేదని ప్రకటించడం తర్వాత జరిగిన పరిణామాలు. ఇప్పుడు థగ్ లైఫ్ రెండో వారంలో అడిగి పెట్టింది. దారుణమైన డిజాస్టర్ నమోదు చేసుకుని ఇండియన్ 2నే నయమనిపించే స్థాయిలో నష్టాలు తీసుకొచ్చింది. ఇక్కడితో కథ అయిపోలేదు.
ఈ వ్యవహారం మీద మహేష్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసుని జూన్ 17కి వాయిదా వేసింది. పిటీషనర్ అడిగిన ప్రశ్నలు, ప్రస్తావించిన సెక్షన్లు సమంజసంగానే ఉన్నాయి. ఒకవేళ తుది తీర్పు కమల్ కు అనుకూలంగా వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పటికే చేతులు కాలిపోయాయి. ఇప్పుడు ఆకులు ఇచ్చి ప్రయోజనం లేదు. ఎందుకంటే థగ్ లైఫ్ రిపోర్టులు, రివ్యూలు చూసిన కన్నడ జనాలు హమ్మయ్య మేం సేఫ్ అనుకున్నారు. ఇంత లేట్ గా ఒకవేళ థియేటర్లలో రిలీజ్ చేసినా ఎలాంటి ఫలితం దక్కదు. రిలీజ్ ఖర్చులు, పోస్టర్ల వ్యయం కూడా వసూలు చేయదు.
కాకపోతే ఇంత విచిత్ర పరిణామంలోనూ ఒక మంచి ఆశించవచ్చు. అదేంటంటే ఒక వ్యక్తి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని సినిమా విడుదల చేయనివ్వమని బెదిరించే పరిస్థితులు భవిష్యత్తులో వస్తే థగ్ లైఫ్ కేసు ఒక రిఫరెన్స్ గా ఉంటుంది. లేదూ జడ్జ్ మెంట్ కమల్ కు వ్యతిరేకంగా వస్తే మిగిలిన వాళ్ళు ఎక్కడైనా పబ్లిక్ స్టేజి మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందనే కమల్ హాసన్ రేపిన మంటలు ఇప్పటికైతే చల్లరాయి కానీ ఫ్యూచర్ లో ఆయన కొత్త సినిమాల మీద ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి థగ్ లైఫ్ రేపిన గాయాలు మాత్రం అన్నీఇన్నీ కావు.
This post was last modified on June 14, 2025 10:52 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…