కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన కామెంట్లకు నిరసనగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ థగ్ లైఫ్ ని బ్యాన్ చేయడంలో విజయం సాధించింది. నిరసనలకు భయపడి ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాకపోవడంతో కమల్ ఆ రాష్ట్రంలో విడుదల మానుకున్నారు. బెంగళూరు కోర్టు సైతం లోకనాయకుడికి ప్రతికూలంగా క్షమాపణ చెప్పమని సూచన చేయడం, ఆయన తప్పు చేయలేదని ప్రకటించడం తర్వాత జరిగిన పరిణామాలు. ఇప్పుడు థగ్ లైఫ్ రెండో వారంలో అడిగి పెట్టింది. దారుణమైన డిజాస్టర్ నమోదు చేసుకుని ఇండియన్ 2నే నయమనిపించే స్థాయిలో నష్టాలు తీసుకొచ్చింది. ఇక్కడితో కథ అయిపోలేదు.
ఈ వ్యవహారం మీద మహేష్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసుని జూన్ 17కి వాయిదా వేసింది. పిటీషనర్ అడిగిన ప్రశ్నలు, ప్రస్తావించిన సెక్షన్లు సమంజసంగానే ఉన్నాయి. ఒకవేళ తుది తీర్పు కమల్ కు అనుకూలంగా వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పటికే చేతులు కాలిపోయాయి. ఇప్పుడు ఆకులు ఇచ్చి ప్రయోజనం లేదు. ఎందుకంటే థగ్ లైఫ్ రిపోర్టులు, రివ్యూలు చూసిన కన్నడ జనాలు హమ్మయ్య మేం సేఫ్ అనుకున్నారు. ఇంత లేట్ గా ఒకవేళ థియేటర్లలో రిలీజ్ చేసినా ఎలాంటి ఫలితం దక్కదు. రిలీజ్ ఖర్చులు, పోస్టర్ల వ్యయం కూడా వసూలు చేయదు.
కాకపోతే ఇంత విచిత్ర పరిణామంలోనూ ఒక మంచి ఆశించవచ్చు. అదేంటంటే ఒక వ్యక్తి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని సినిమా విడుదల చేయనివ్వమని బెదిరించే పరిస్థితులు భవిష్యత్తులో వస్తే థగ్ లైఫ్ కేసు ఒక రిఫరెన్స్ గా ఉంటుంది. లేదూ జడ్జ్ మెంట్ కమల్ కు వ్యతిరేకంగా వస్తే మిగిలిన వాళ్ళు ఎక్కడైనా పబ్లిక్ స్టేజి మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందనే కమల్ హాసన్ రేపిన మంటలు ఇప్పటికైతే చల్లరాయి కానీ ఫ్యూచర్ లో ఆయన కొత్త సినిమాల మీద ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి థగ్ లైఫ్ రేపిన గాయాలు మాత్రం అన్నీఇన్నీ కావు.
This post was last modified on June 14, 2025 10:52 am
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…