కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన కామెంట్లకు నిరసనగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ థగ్ లైఫ్ ని బ్యాన్ చేయడంలో విజయం సాధించింది. నిరసనలకు భయపడి ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాకపోవడంతో కమల్ ఆ రాష్ట్రంలో విడుదల మానుకున్నారు. బెంగళూరు కోర్టు సైతం లోకనాయకుడికి ప్రతికూలంగా క్షమాపణ చెప్పమని సూచన చేయడం, ఆయన తప్పు చేయలేదని ప్రకటించడం తర్వాత జరిగిన పరిణామాలు. ఇప్పుడు థగ్ లైఫ్ రెండో వారంలో అడిగి పెట్టింది. దారుణమైన డిజాస్టర్ నమోదు చేసుకుని ఇండియన్ 2నే నయమనిపించే స్థాయిలో నష్టాలు తీసుకొచ్చింది. ఇక్కడితో కథ అయిపోలేదు.
ఈ వ్యవహారం మీద మహేష్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసుని జూన్ 17కి వాయిదా వేసింది. పిటీషనర్ అడిగిన ప్రశ్నలు, ప్రస్తావించిన సెక్షన్లు సమంజసంగానే ఉన్నాయి. ఒకవేళ తుది తీర్పు కమల్ కు అనుకూలంగా వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పటికే చేతులు కాలిపోయాయి. ఇప్పుడు ఆకులు ఇచ్చి ప్రయోజనం లేదు. ఎందుకంటే థగ్ లైఫ్ రిపోర్టులు, రివ్యూలు చూసిన కన్నడ జనాలు హమ్మయ్య మేం సేఫ్ అనుకున్నారు. ఇంత లేట్ గా ఒకవేళ థియేటర్లలో రిలీజ్ చేసినా ఎలాంటి ఫలితం దక్కదు. రిలీజ్ ఖర్చులు, పోస్టర్ల వ్యయం కూడా వసూలు చేయదు.
కాకపోతే ఇంత విచిత్ర పరిణామంలోనూ ఒక మంచి ఆశించవచ్చు. అదేంటంటే ఒక వ్యక్తి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని సినిమా విడుదల చేయనివ్వమని బెదిరించే పరిస్థితులు భవిష్యత్తులో వస్తే థగ్ లైఫ్ కేసు ఒక రిఫరెన్స్ గా ఉంటుంది. లేదూ జడ్జ్ మెంట్ కమల్ కు వ్యతిరేకంగా వస్తే మిగిలిన వాళ్ళు ఎక్కడైనా పబ్లిక్ స్టేజి మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందనే కమల్ హాసన్ రేపిన మంటలు ఇప్పటికైతే చల్లరాయి కానీ ఫ్యూచర్ లో ఆయన కొత్త సినిమాల మీద ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి థగ్ లైఫ్ రేపిన గాయాలు మాత్రం అన్నీఇన్నీ కావు.
This post was last modified on June 14, 2025 10:52 am
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…