‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తాడనే అంతా అనుకున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్లు.. అలవైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్లో ఈసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రం తీయడానికి కొన్నేళ్ల ముందే సన్నాహాలు మొదలయ్యాయి. దీని గురించి నిర్మాతలు బన్నీ వాసు, నాగవంశీ ఎప్పటికప్పుడు ఊరిస్తూనే వచ్చారు.
తీరా చూస్తే బన్నీ త్రివిక్రమ్ సినిమాను కాకుండా.. అట్లీ చిత్రాన్ని టేకప్ చేసి పెద్ద షాకిచ్చాడు. అయినా సరే అట్లీ మూవీ తర్వాత త్రివిక్రమ్ చిత్రం ఉంటుందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఆ కథను బన్నీతో కాకుడా జూనియర్ ఎన్టీఆర్తో చేయడానికి త్రివిక్రమ్ రెడీ అయిపోయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ను పూర్తి చేశాక తారక్.. మాటల మాంత్రికుడితో ఈ భారీ చిత్రం కోసం జట్టు కడతాడని వార్తలు వస్తున్నాయి. ఈలోపు త్రివిక్రమ్ వేరే సినిమా చేసుకుని రెడీగా ఉంటాడు. బన్నీ చేయాల్సిన సినిమా స్థానంలోకి తారక్ చిత్రం రావడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు కొరటాల శివ సైతం బన్నీతో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ తర్వాత దాని స్థానంలోకి తారక్ సినిమా వచ్చింది. అదే దేవర.
నిజానికి ఈ చిత్రాన్ని నిర్మించిన తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ను ముందు కొరటాల ప్రొడ్యూసర్గా పరిచయం చేయాలనుకున్నది తారక్ మూవీతోనే. కానీ అది సాధ్యపడక బన్నీతో సినిమాను అనౌన్స్ చేశాడు కొరటాల. కానీ తర్వాత మళ్లీ కథ మలుపు తిరిగి ‘దేవర’ చేశాడు.
ఇక ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్.. తారక్తో ‘అయిననా పోయి రావలె హస్తినకు’ అనే వర్కింగ్ టైటిల్తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. ‘గుంటూరు కారం’ తీశాడు. తర్వాత బన్నీ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ అది ఇప్పుడు పక్కకు వెళ్లిపోయి తారక్తో అదే కథను తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తారక్- బన్నీ మధ్య కథలు చేతులు మారడం.. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తారకే ఆయా దర్శకులతో జట్టు కడుతుండడం విశేషం.
This post was last modified on June 11, 2025 1:11 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…