Movie News

మల్టీప్లెక్సుల్లో 50 రూపాయలకే సినిమా


గత నెల 15 నుంచే దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాకపోతే 50 శాతం కెపాసిటీ సహా ఎన్నో షరతులు పెట్టింది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల నామమాత్రంగా తెరుచుకున్నాయి థియేటర్లు. ఐతే కొత్త సినిమాలు లేకపోవడం వల్ల, కరోనా భయంతో జనాలు థియేటర్లకు అయితే రావట్లేదు.

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే సినిమాలు వస్తే థియేటర్లు కాస్తో కూస్తో నిండుతాయి కానీ.. సరైన సినిమాలే లేనపుడు అవెక్కడ కళకళలాడతాయి? ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో తెరకెక్కిన క్లాసిక్ సినిమాలను ప్రధాన మల్టీప్లెక్సులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.

దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే, వీర్ జారా, కబీ కబీ, సిల్ సిలా, దిల్‌తో పాగల్ హై, బంటీ ఔర్ బబ్లీ, సుల్తాన్, మర్దాని సినిమాలను పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్ మల్టీప్లెక్స్ ఛైన్స్ కోసం ఉచితంగా అందిస్తోంది యశ్ రాజ్ ఫిలిమ్స్. ఈ సంస్థ నెలకొల్పి 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దీపావళి కానుకగా ఈ సినిమాలను మల్టీప్లెక్సులకు అందించాడు యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా.

నవంబరు 12 నుంచి 19 వరకు ఈ సినిమాలను పై మల్టీప్లెక్సుల్లో ప్రదర్శిస్తారు. మామూలుగా ఈ మల్టీప్లెక్సుల్లో రూ.150 నుంచి రూ.400 వరకు టికెట్ల రేట్లు ఉంటాయి. కానీ యశ్ రాజ్ వాళ్లు ఉచితంగా ఈ సినిమాలను తమకు అందిస్తున్న నేపథ్యంలో తాము కూడా లాభం చూసుకోకుండా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే ఉద్దేశంతో కేవలం 50 రూపాయల కామన్ టికెట్ రేటుతో ఈ సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ మొత్తం కూడా థియేటర్ల మెయింటెనెన్స్ కోసం వసూలు చేస్తున్నదే.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

4 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

6 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

6 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

8 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

10 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

11 hours ago