Movie News

మల్టీప్లెక్సుల్లో 50 రూపాయలకే సినిమా


గత నెల 15 నుంచే దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాకపోతే 50 శాతం కెపాసిటీ సహా ఎన్నో షరతులు పెట్టింది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల నామమాత్రంగా తెరుచుకున్నాయి థియేటర్లు. ఐతే కొత్త సినిమాలు లేకపోవడం వల్ల, కరోనా భయంతో జనాలు థియేటర్లకు అయితే రావట్లేదు.

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే సినిమాలు వస్తే థియేటర్లు కాస్తో కూస్తో నిండుతాయి కానీ.. సరైన సినిమాలే లేనపుడు అవెక్కడ కళకళలాడతాయి? ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో తెరకెక్కిన క్లాసిక్ సినిమాలను ప్రధాన మల్టీప్లెక్సులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.

దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే, వీర్ జారా, కబీ కబీ, సిల్ సిలా, దిల్‌తో పాగల్ హై, బంటీ ఔర్ బబ్లీ, సుల్తాన్, మర్దాని సినిమాలను పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్ మల్టీప్లెక్స్ ఛైన్స్ కోసం ఉచితంగా అందిస్తోంది యశ్ రాజ్ ఫిలిమ్స్. ఈ సంస్థ నెలకొల్పి 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దీపావళి కానుకగా ఈ సినిమాలను మల్టీప్లెక్సులకు అందించాడు యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా.

నవంబరు 12 నుంచి 19 వరకు ఈ సినిమాలను పై మల్టీప్లెక్సుల్లో ప్రదర్శిస్తారు. మామూలుగా ఈ మల్టీప్లెక్సుల్లో రూ.150 నుంచి రూ.400 వరకు టికెట్ల రేట్లు ఉంటాయి. కానీ యశ్ రాజ్ వాళ్లు ఉచితంగా ఈ సినిమాలను తమకు అందిస్తున్న నేపథ్యంలో తాము కూడా లాభం చూసుకోకుండా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే ఉద్దేశంతో కేవలం 50 రూపాయల కామన్ టికెట్ రేటుతో ఈ సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ మొత్తం కూడా థియేటర్ల మెయింటెనెన్స్ కోసం వసూలు చేస్తున్నదే.

This post was last modified on November 10, 2020 5:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మల్టీస్టారర్ సినిమాకు షేరింగ్ కష్టాలు

మన దగ్గర చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం వరకే పరిమితమయ్యింది కానీ, నాలుగు దశాబ్దాలు దాటినా…

58 minutes ago

ప్రీమియర్ల ప్లానింగులో ఉస్తాద్ సతమతం

మార్చి 18 రాత్రి ప్రీమియర్ షోల అప్డేట్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు,…

3 hours ago

ఎన్టీఆర్ డ్రాగన్ లుక్ వైరల్

స్టార్ హీరోలు పెద్ద సినిమాల్లో స్పెషల్ లుక్‌లో కనిపిస్తున్నడు.. ఆ లుక్ బయట పడకుండా జాగ్రత్త వహిస్తుంటారు. నెలల తరబడి…

3 hours ago

టాక్సిక్… భలే తెలివైన ఎస్కేప్

దురంధర్ 2తో ఫేస్ టు ఫేస్ తలపడదామని డిసైడైపోయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టుకున్న యష్ టాక్సిక్ కొద్దిరోజుల ముందు…

4 hours ago

మూలిగే బాక్సాఫీస్ మీద క్రికెట్ మ్యాచ్ దెబ్బ

అసలే బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. శ్రీవిష్ణు 'మృత్యుంజయ్'కు డీసెంట్ టాక్ ఉన్నప్పటికీ బిసి సెంటర్లలో ఆశించిన స్థాయిలో పికప్,…

5 hours ago

రాజుగారిపై అవిశ్వాసం.. జనసేన అడ్డు చెప్పిందా?

శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, ఆయనకు ఆ పదవిలో ఉండేందుకు అర్హత లేదని…

7 hours ago