మంచు ఫ్యామిలీకి వివాదాలు కొత్త కాదు. ఇటీవల అన్నదమ్ముల వివాదం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇక సినిమాలకు సంబంధించి కూడా తరచుగా ఏదో ఒక కాంట్రవర్శీ చుట్టు ముడుతూనే ఉంటుంది. గతంలో దేనికైనా రెడీ సినిమా విషయంలో పెద్ద గొడవ జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా సన్నివేశాలున్నాయంటూ ఆ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దాని మీద పెద్ద రభస జరిగింది. ఇప్పుడు మరోసారి బ్రాహ్మణ సంఘాలు మంచు వారి సినిమా మీద దండెత్తాయి. కన్నప్ప చిత్రంలో పిలక, గిలక అంటూ బ్రహ్మానందం, సప్తగిరి చేసిన బ్రాహ్మణ పాత్రలకు పేర్లు పెట్టడాన్ని ఈ సంఘాలు తప్పుబడుతున్నాయి.
సినిమా నుంచి ఈ రెండు పాత్రలను తీసేయాలని.. లేదంటే కన్నప్పను ఆడనివ్వమని హెచ్చరిస్తున్నాయి. ఇటీవల గుంటూరు కన్నప్పకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ జరగ్గా.. అదే రోజు అక్కడే నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ వివాదంపై మంచు విష్ణు తాజాగా స్పందించాడు.
ఎవరి మనోభావాలూ దెబ్బ తీయకుండా కన్నప్ప సినిమాను తీర్చిదిద్దినట్లు మంచు విష్ణు స్పష్టం చేశాడు. సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని.. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. పరమశివుడిని భక్తితో చూపించామని విష్ణు చెప్పాడు.
ప్రతి రోజూ షూట్కు ముందు భక్తితో పూజించి.. వేద పండితుల ఆశీర్వచనం తీసుకునేవాళ్లమని.. స్క్రిప్టు దశలోనే వేదాధ్యయనం చేసిన వారితో పాటు పలువురు ఆధ్యాత్మికవేతల్ల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించామని విష్ణు తెలిపాడు. భక్తి తత్వాన్ని వ్యాప్తి చేయడానికే కన్నప్ప సినిమా తీశామని.. అంతే తప్ప వివాదాల కోసం కాదని.. విడుదలయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండాలని.. ముందే ఒక నిర్ణయానికి రావడం సరికాదని విష్ణు అభిప్రాయపడ్డాడు. కన్నప్ప సినిమాను శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన వేదపండితులకు చూపించామని.. సినిమాలో ఒక్క సన్నివేశం మీదా వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. అలాంటపుడు ఏ సన్నివేశం, పాత్ర అయినా ఎందుకు తీసేయాలని విష్ణు ప్రశ్నించాడు.
This post was last modified on June 10, 2025 6:08 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…