విడుదలకు ముందు కమల్ హాసన్ చాలా కాన్ఫిడెంట్ గా సినిమా అద్భుతంగా ఉందని, అందుకే నెట్ ఫ్లిక్స్ తో మాట్లాడి ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పించామని మహా గొప్పగా చెప్పుకున్నారు. ఈ కారణంగానే హిందీ మల్టీప్లెక్సుల్లో షోలు పడ్డాయి. తీరా చూస్తే బొమ్మ అల్ట్రా డిజాస్టర్ అయ్యింది. ఈ దశాబ్దంలో వచ్చిన అతి పెద్ద ఫ్లాప్స్ గా చెప్పుకుంటున్న ఇండియన్ 2, కంగువాని దాటిపోయేలా వసూళ్లను నమోదు చేస్తోంది. సక్సెస్ అయితే విజయ యాత్రలు ప్లాన్ చేసుకున్న కమల్ బృందానికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాటవరసకైనా ఆడియన్స్ కి థాంక్స్ చెప్పే ప్రయత్నం చేయలేదు.
సరే ఇప్పుడు ఫలితం తేలిపోయింది కాబట్టి థగ్ లైఫ్ బృందం నెట్ ఫ్లిక్స్ తో తిరిగి బేరాలు మొదలుపెట్టిందని చెన్నై టాక్. ఎనిమిది వారాలకు బదులు నెలకే స్ట్రీమింగ్ అయితే అదనపు మొత్తం వచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అయితే రెవిన్యూ, పబ్లిక్ టాక్స్, రివ్యూస్ అన్నీ గమనిస్తున్న నెట్ ఫ్లిక్స్ అంత మొత్తం ఇవ్వకపోవచ్చని అంటున్నారు. కాకపోతే ముందు ఒప్పుకున్న దానికన్నా ఎక్కువే దక్కొచ్చు. ఎందుకంటే ఇలాంటి డిజాస్టర్లు థియేటర్లలో ఆడకపోయినా ఓటిటిలో భారీ వ్యూస్ తెచ్చుకుంటాయి. కంగువా, విడాముయార్చి, రెట్రో లాంటివి దీన్ని ఋజువు చేశాయి.
అందుకే థగ్ లైఫ్ కూడా అదే దారిలో వెళ్లాలనే ఆలోచనలో ఉందట. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఊరికే ఇలాంటి గాసిప్పులు రావుగా. మణిరత్నం కెరీర్ లోనే అత్యంత బ్యాడ్ మూవీగా విమర్శకులు తలంటిన థగ్ లైఫ్ రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే ఫైనల్ రన్ కు వచ్చేలా ఉంది. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల మల్టీప్లెక్సుల్లో కొద్దిగా జనం కనిపిస్తున్నప్పటికీ బిసి సెంటర్స్ లో మాత్రం చాలా చోట్ల వాషౌట్ అయిపోయింది. షోలు క్యాన్సిలవుతున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా కమల్ హాసన్ ఇప్పట్లో మర్చిపోలేని పీడకలగా థగ్ లైఫ్ నిలుస్తోంది. కోట్లు ఖర్చు పెట్టిన ప్రమోషన్లు వృథా అయ్యాయి.
This post was last modified on June 10, 2025 4:53 am
ఇంకా అధికారికంగా ప్రకటించడం, ప్రమోషన్లు చేయడం లాంటివి జరగకపోయినా రేపటి నుంచి దురంధర్ ఓటిటి స్ట్రీమింగ్ జరగడం దాదాపు ఖాయమే.…
థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…
రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండదని చెబుతూ, ప్రభాస్ అభిమానులకు భరోసానిస్తూ, తేడా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…