తెలుగులో రాబోతున్న పెద్ద సినిమాల్లో ఒకటి.. ‘కుబేర’. సమ్మర్లో బాక్సాఫీస్ వెలవెలబోయాక ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ నెల 20న ‘కుబేర’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం మీద నిర్మాత సునీల్ నారంగ్ చాలా పెద్ద పెట్టుబడే పెట్టేశారట. ఆ మొత్తం రూ.150 కోట్లు కావడం గమనార్హం. వాస్తవానికి రూ.90 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తీయాలని ప్రణాళిక వేసుకున్నారట. కానీ మేకింగ్ కొంత ఆలస్యం కావడంతో బడ్జెట్ రూ.120 కోట్లకు చేరిందట. వడ్డీల భారం కూడా తోడై బడ్జెట్ రూ.150 కోట్లకు చేరినట్లు సునీల్ నారంగ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.47 కోట్లకు అమ్మినట్లు ఆయన తెలిపారు. అంటే ‘కుబేర’ తెలుగు, తమిళ భాషల్లో కలిపి రూ.100 కోట్లకు పైగానే షేర్ రాబట్టాల్సి ఉందన్నమాట. ధనుష్ తమిళంలో మిడ్ రేంజ్ స్టార్. తెలుగులోనూ కొంచెం ఫాలోయింగ్ ఉంది. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు. గత కొన్నేళ్లలో నాగ్ మార్కెట్ కొంచెం దెబ్బ తిన్న మాట వాస్తవం. పైగా ‘కుబేర’లో ఆయనది లీడ్ రోల్ కాదు. మరి ధనుష్, నాగ్ల స్టార్ పవర్ ఈ సినిమాకు ఎంతమేర ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుంది.. రూ.100 కోట్ల టార్గెట్ను ఎలా అందుకుంటుంది అన్నది ఆసక్తికరం.
సినిమా ఆలస్యం కావడం వల్ల, ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోకపోవడం వల్ల ‘కుబేర’కు ఆశించిన హైప్ క్రియేట్ కాలేదు. ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంకా రెండు సాంగ్స్ ఇవ్వాల్సి ఉందని సునీల్ నారంగ్ చెప్పడం విశేషం. మరి ఆ పాటలు సినిమాలో ఉంటాయా లేదా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు పాటలిస్తే ఇక వాటి చిత్రీకరణ ఎప్పుడు జరపాలి? రిలీజ్ వచ్చే నెలలో చేద్దాం అనుకున్నా ఓటీటీ సంస్థ ఒప్పుకోలేదని.. అలా అయితే రేటు తగ్గిస్తామని చెప్పడంతో ఈ నెల 20కే ఫిక్సయ్యామని నారంగ్ అంటున్నారు. ఈ హడావుడి వల్లే సినిమా ప్రమోషన్లు సరిగా జరగట్లేదని తెలుస్తోంది. రిలీజ్ టైంకి రావాల్సిన హైప్ వచ్చేస్తుందా? సినిమా ఆశించిన ఓపెనింగ్స్ రాబడుతుందా? చూడాలి మరి.
This post was last modified on June 9, 2025 2:55 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…