తెలుగులో రాబోతున్న పెద్ద సినిమాల్లో ఒకటి.. ‘కుబేర’. సమ్మర్లో బాక్సాఫీస్ వెలవెలబోయాక ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ నెల 20న ‘కుబేర’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం మీద నిర్మాత సునీల్ నారంగ్ చాలా పెద్ద పెట్టుబడే పెట్టేశారట. ఆ మొత్తం రూ.150 కోట్లు కావడం గమనార్హం. వాస్తవానికి రూ.90 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తీయాలని ప్రణాళిక వేసుకున్నారట. కానీ మేకింగ్ కొంత ఆలస్యం కావడంతో బడ్జెట్ రూ.120 కోట్లకు చేరిందట. వడ్డీల భారం కూడా తోడై బడ్జెట్ రూ.150 కోట్లకు చేరినట్లు సునీల్ నారంగ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.47 కోట్లకు అమ్మినట్లు ఆయన తెలిపారు. అంటే ‘కుబేర’ తెలుగు, తమిళ భాషల్లో కలిపి రూ.100 కోట్లకు పైగానే షేర్ రాబట్టాల్సి ఉందన్నమాట. ధనుష్ తమిళంలో మిడ్ రేంజ్ స్టార్. తెలుగులోనూ కొంచెం ఫాలోయింగ్ ఉంది. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు. గత కొన్నేళ్లలో నాగ్ మార్కెట్ కొంచెం దెబ్బ తిన్న మాట వాస్తవం. పైగా ‘కుబేర’లో ఆయనది లీడ్ రోల్ కాదు. మరి ధనుష్, నాగ్ల స్టార్ పవర్ ఈ సినిమాకు ఎంతమేర ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుంది.. రూ.100 కోట్ల టార్గెట్ను ఎలా అందుకుంటుంది అన్నది ఆసక్తికరం.
సినిమా ఆలస్యం కావడం వల్ల, ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోకపోవడం వల్ల ‘కుబేర’కు ఆశించిన హైప్ క్రియేట్ కాలేదు. ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంకా రెండు సాంగ్స్ ఇవ్వాల్సి ఉందని సునీల్ నారంగ్ చెప్పడం విశేషం. మరి ఆ పాటలు సినిమాలో ఉంటాయా లేదా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు పాటలిస్తే ఇక వాటి చిత్రీకరణ ఎప్పుడు జరపాలి? రిలీజ్ వచ్చే నెలలో చేద్దాం అనుకున్నా ఓటీటీ సంస్థ ఒప్పుకోలేదని.. అలా అయితే రేటు తగ్గిస్తామని చెప్పడంతో ఈ నెల 20కే ఫిక్సయ్యామని నారంగ్ అంటున్నారు. ఈ హడావుడి వల్లే సినిమా ప్రమోషన్లు సరిగా జరగట్లేదని తెలుస్తోంది. రిలీజ్ టైంకి రావాల్సిన హైప్ వచ్చేస్తుందా? సినిమా ఆశించిన ఓపెనింగ్స్ రాబడుతుందా? చూడాలి మరి.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…