సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ డిమాండ్ చేయడం ఎప్పుడు మొదలయ్యిందో కానీ చిన్న కార్చిచ్చులా మొదలై ఇప్పుడు మొత్తం అడవిని చుట్టేసింది. హరిహర వీరమల్లుని టార్గెట్ చేశారనే వివాదం, దానికి అల్లు అరవింద్ – దిల్ రాజులు వివరణ ఇవ్వడం, పలువురు ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్లు పెట్టి ఆసలు థియేటర్లు బంద్ చేసే ఉద్దేశమే లేదంటూ ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ ఒక కమిటీ వేయడం లాంటి పరిణామాలు చాలానే జరిగాయి. ఒకపక్క బాక్సాఫీస్ డ్రైగా ఉంటూ సరైన సినిమాలు లేక ఖాళీ సీట్లతో గగ్గోలు పెడుతున్న టైంలో ఈ సంఘటనలన్నీ గాయం మీద కారాన్ని చల్లినట్టు అయ్యింది.
తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఎంపికైన సునీల్ నారంగ్ పదవి చేపట్టిన ఒక్క రోజు లోపే రాజీనామా సమర్పించడం సంచలనంగా మారింది. రెండు పర్యాయాలు ఈ పదవిని నిర్వహించిన సీనియర్ మోస్ట్ నిర్మాత ఇలా చేయడం అందరిని విస్మయ పరుస్తోంది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో సెక్రటరీ సుధాకర్ హీరోల గురించి, ఇద్దరు దర్శక నిర్మాతల గురించి చేసిన కామెంట్లు చాలా దూరం వెళ్ళాయని, వాటితో సంబంధం లేకపోయినా తన పేరుని జోడించి ప్రచారం చేయడం పట్ల మనస్థాపం చెందడం వల్లే సునీల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. రాజీనామా లేఖను ఛాంబర్ కు పంపించేశారు.
అసలే ఐక్యత లేక ఎవరి గోల వాళ్లదే తరహాలో మారిపోయిన టాలీవుడ్ లో ఇప్పుడు జరుగుతున్నవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు గా మిగల్చబోతున్నాయి. రెంటల్, పర్సెంటెజ్ కన్నా తీవ్రమైన సమస్యలు పరిశ్రమలో ఉన్నాయని అర్థమవుతోంది. నిన్నటి దాకా అంతర్గతంగా ఉన్న ఛాంబర్ విషయాలు ఇప్పుడు సామాన్యులకు కూడా చేరిపోతున్నాయి. ఎంత దూరం వెళ్తాయనేది పక్కన పెడితే సీనియర్లు ఎవరో ఒకరు పూనుకుని వీటికి పరిష్కారం చూపాల్సిన అవసరం చాలా ఉంది. సంక్షోభం దిశగా వెళ్తున్న ఇండస్ట్రీని అందరూ కలిసి నిలబెట్టుకోవాలి. ఐకమత్యమే మహాబలమనే సామెత పాతదే అయినా ఇప్పుడు ఆచరించాల్సిన టైం వచ్చింది.
This post was last modified on June 8, 2025 8:01 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…