నందమూరి బాలకృష్ణ కెరీర్ పాతాళానికి పడిపోయిన స్థితిలో ఆయన్ని మళ్లీ బలంగా పుంజుకునేలా చేసిన సినిమా ‘సింహా’. దాదాపు దశాబ్దం పాటు హిట్టు లేక అల్లాడిపోయిన బాలయ్య.. చివరికి 2010లో ఈ సినిమాతోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా లేకపోతే బాలయ్య కెరీర్ ఏమై ఉండేదో ఏమో. మరి ఈ సినిమాకు ఎలా పునాది పడింది.. బాలయ్యను బోయపాటి కథతో ఎలా ఒప్పించాడు.. సినిమా చేస్తున్నపుడు బాలయ్య ఫీలింగ్ ఏంటి.. ఈ విషయాల్ని బోయపాటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ‘సింహా’కు 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో బోయపాటి ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
‘భద్ర’, ‘తులసి’ సినిమాల తర్వాత మూడో సినిమా ఇంకా ఖరారు కాని సమయంలో తాను విజయవాడలో ఓ పెళ్లిలో ఉండగా బాలయ్య నుంచి కాల్ వచ్చినట్లు బోయపాటి వెల్లడించాడు. మరుసటి రోజు ఉదయానికల్లా హైదరాబాద్ చేరుకున్నానని.. ఆయన మనిద్దరం కలిసి సినిమా చేద్దాం అని చెప్పి లైన్ కోసం ఐదు రోజుల సమయం ఇచ్చారని.. ఐతే తాను రెండో రోజుకే ఆయన్ని కలిసి ‘సింహా’ లైన్ చెప్పానని బోయపాటి వెల్లడించాడు. ఐతే తాను చెప్పిన స్టోరీ కొత్తగా ఉండటంతో.. ఇదేంటి ఇలా ఉంది.. నా బాడీ లాంగ్వేజ్ గురించి మీకు తెలుసు కదా అన్నాడని.. ఐతే తాను కొంచెం కొత్తగా చేద్దామని బాలయ్యతో చెప్పానని బోయపాటి తెలిపాడు.
ఐతే ఇంతకుముందు చాలా మంది దర్శకులు కొత్తగా చేద్దాం అని చెప్పారని.. కానీ చివరికి రొటీన్గా తీశారని.. మరి నీ పరిస్థితేంటి అని బాలయ్య అన్నాడని.. ఐతే తన సినిమాలు ‘భద్ర’, ‘తులసి’ చూడమని బాలయ్యకు చెప్పానని.. కానీ ఆయన నేనా సినిమాలు చూడను, నీ మీద నమ్మకం ఉంది సినిమా చేద్దాం అన్నారని చెప్పాడు. ఇక సినిమా చేస్తుండగా.. మధ్య దశకు వచ్చేసరికే ఈ సినిమా పెద్ద రేంజికి వెళ్తుందని బాలయ్యకు నమ్మకం కలిగిందని.. మధ్యలో చిన్న బాలయ్య పాత్రకు బ్రేక్ ఇచ్చి ఫ్లాష్ బ్యాక్ సీన్లు నాన్ స్టాప్గా తీశామని.. అవి చేస్తున్నపుడే బాలయ్యకు సినిమా ఫలితం అర్థమైపోయిందని.. ఆయనకు సినిమా మీద చాలా మంచి జడ్జిమెంట్ ఉందని బోయపాటి అన్నాడు.
This post was last modified on April 30, 2020 7:40 pm
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…