కరోనా విరామం తర్వాత టాలీవుడ్ స్టార్లలో అందరి కంటే లేటుగా షూటింగ్కు సిద్ధమైంది మెగాస్టార్ చిరంజీవే. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోపే మళ్లీ షూటింగ్లు మొదలుపెట్టడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల పెద్దల్ని కలిసిన చిరు.. మిగతా హీరోలంతా రంగంలోకి దిగాక కూడా పని మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
ఎట్టకేలకు ఈ సోమవారం ‘ఆచార్య’ చిత్రీకరణ పున:ప్రారంభించడం కోసం ఆయన ప్రణాళికలు రచించుకున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ తీరా చూస్తే చిరంజీవి కరోనా బారిన పడ్డారన్న వార్త బయటికి వచ్చింది. ‘ఆచార్య’ కోసమనే కరోనా టెస్టు చేయించుకుంటే ఆయనకు పాజిటివ్ వచ్చింది. పెద్దగా లక్షణాలు లేకపోవడంతో చిరు హోం క్వారంటైన్లో ఉంటున్నారు. ఐతే చిరు అందబాటులో లేకపోయినా ‘ఆచార్య’ షూటింగ్ మాత్రం ఆగకపోవడం విశేషం.
అనుకున్న ప్రకారమే సోమవారం ‘ఆచార్య’ చిత్రీకరణ పున:ప్రారంభించారు. చిరు నుంచి సమాచారం అందగానే ప్రొడక్షన్ టీం ప్రణాళికలు మార్చుకుంది. ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసుకుంది. ఈ మేరకు ఆర్టిస్టుల డేట్లు సర్దుబాటు చేసుకున్నారు. చిరు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం పడకపోవచ్చని.. ఆయన రెండు వారాల్లో కోలుకుని షూటింగ్కు వస్తారని ఆశిస్తోంది చిత్ర బృందం. ఈలోపు ఆయన లేని సన్నివేశాలన్నీ పూర్తి చేస్తారు.
చిరు వచ్చే సమయానికి అందరి డేట్లు సర్దుబాటు చేసి పక్కా ప్లాన్తో రెడీగా ఉంటారు. ఆయన రాగానే ఆ సన్నివేశాల చిత్రీకరణ సాగుతుంది. ఏదేమైనప్పటికీ వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేసి తీరాలన్న పట్టుదలతో చిత్ర బృందం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ నటించనున్న ఈ చిత్రానికి మణిరత్నం సంగీతాన్నందిస్తున్నాడు.
This post was last modified on November 10, 2020 3:11 pm
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…
ఏపీ మంత్రి నారా లోకేష్పై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏకబిగిన ఏడున్నర గంటల పాటు నిలబడి.. ప్రజలకు…