Movie News

చిరు లేడు.. అయినా ‘ఆచార్య’ ఆగలేదు

కరోనా విరామం తర్వాత టాలీవుడ్ స్టార్లలో అందరి కంటే లేటుగా షూటింగ్‌కు సిద్ధమైంది మెగాస్టార్ చిరంజీవే. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోపే మళ్లీ షూటింగ్‌లు మొదలుపెట్టడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల పెద్దల్ని కలిసిన చిరు.. మిగతా హీరోలంతా రంగంలోకి దిగాక కూడా పని మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

ఎట్టకేలకు ఈ సోమవారం ‘ఆచార్య’ చిత్రీకరణ పున:ప్రారంభించడం కోసం ఆయన ప్రణాళికలు రచించుకున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ తీరా చూస్తే చిరంజీవి కరోనా బారిన పడ్డారన్న వార్త బయటికి వచ్చింది. ‘ఆచార్య’ కోసమనే కరోనా టెస్టు చేయించుకుంటే ఆయనకు పాజిటివ్ వచ్చింది. పెద్దగా లక్షణాలు లేకపోవడంతో చిరు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఐతే చిరు అందబాటులో లేకపోయినా ‘ఆచార్య’ షూటింగ్ మాత్రం ఆగకపోవడం విశేషం.

అనుకున్న ప్రకారమే సోమవారం ‘ఆచార్య’ చిత్రీకరణ పున:ప్రారంభించారు. చిరు నుంచి సమాచారం అందగానే ప్రొడక్షన్ టీం ప్రణాళికలు మార్చుకుంది. ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసుకుంది. ఈ మేరకు ఆర్టిస్టుల డేట్లు సర్దుబాటు చేసుకున్నారు. చిరు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం పడకపోవచ్చని.. ఆయన రెండు వారాల్లో కోలుకుని షూటింగ్‌కు వస్తారని ఆశిస్తోంది చిత్ర బృందం. ఈలోపు ఆయన లేని సన్నివేశాలన్నీ పూర్తి చేస్తారు.

చిరు వచ్చే సమయానికి అందరి డేట్లు సర్దుబాటు చేసి పక్కా ప్లాన్‌తో రెడీగా ఉంటారు. ఆయన రాగానే ఆ సన్నివేశాల చిత్రీకరణ సాగుతుంది. ఏదేమైనప్పటికీ వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేసి తీరాలన్న పట్టుదలతో చిత్ర బృందం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ నటించనున్న ఈ చిత్రానికి మణిరత్నం సంగీతాన్నందిస్తున్నాడు.

This post was last modified on November 10, 2020 3:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

5 minutes ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

13 minutes ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

4 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

6 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

7 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

9 hours ago