సినిమా ఫలితాలు ఎవరి చేతిలోనూ ఉండవు, నిజమే. కొన్నిసార్లు బాగా తీసినవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతాయి. కానీ ప్రేక్షకులు వాటిని గుర్తించి గౌరవిస్తారు. ఉదాహరణకు ఖలేజాని చెప్పుకోవచ్చు. కానీ తీసికట్టు కంటెంట్ తో వస్తే మాత్రం ఆడియన్స్ ఎంత నిర్దయగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కల్ట్ దర్శకులు ఇప్పుడు షో మధ్యలోనే లేచి వెళ్లిపోయే స్థాయికి దిగిపోయారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నిన్న విడుదలైన థగ్ లైఫ్ మీద యునానిమస్ నెగటివ్ టాక్ కనిపిస్తోంది. కనీసం పర్వాలేదని చెబుతున్న బ్యాచ్ సోషల్ మీడియాలోనూ కనిపించలేదు.
కేవలం కాంబినేషన్ క్రేజ్ మీద బిజినెస్ చేసి, లెక్కలేనంత ఖర్చుతో ప్రమోషన్లు చేసి తీరా థియేటర్లో కూర్చున్న తర్వాత దర్శకుడు మణిరత్నం చూపించిన నీరసం అంతా ఇంతా కాదు. దళపతి, నాయకుడు, రోజా, బొంబాయి తీసింది ఈయనేనా అని ఎవరికైనా సందేహం రాకపోతే ఒట్టు. జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికుడు లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన ఇండియన్ స్పిల్ బర్గ్ శంకర్ వరసగా ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రూపంలో మర్చిపోలేని పీడకలలను కానుకగా ఇచ్చారు. పాటలకు, ఫైట్లకు వందల కోట్లు ఖర్చు పెట్టించినా దానికి తగ్గ అవుట్ ఫుట్ కనీసం సగం కూడా ఇవ్వలేకపోతున్నారు.
ఇక మురుగదాస్ ది కూడా ఇదే కథ. గజిని, తుపాకీ లాంటి అల్టిమేట్ మూవీస్ ఇచ్చిన ఇతనా సల్మాన్ ఖాన్ సికందర్ తీసిందని అనుకోని వాళ్ళు లేరు. అంతకు ముందు రజనీకాంత్ పిలిచి దర్బార్ ఇచ్చినా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు. ఇప్పుడాయన చివరి ఆశ శివ కార్తికేయన్ మదరాసినే. కోలీవుడ్ లో బలమైన ప్రభావం చూపించిన ఇలాంటి దర్శకులు ఇంత నాసిరకంగా దిగిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళ పరిశ్రమకు చెందినప్పటికీ ఇతర భాషల్లోనూ భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ దిగ్గజాలు ఇప్పుడు ట్రోలింగ్ కి టార్గెట్ కావడం విచారకరం. కంబ్యాక్ అవ్వడం విధిరాతలో కాదు వాళ్ళ చేతల్లోనే ఉంది.
This post was last modified on June 6, 2025 10:45 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…