సినిమా ఫలితాలు ఎవరి చేతిలోనూ ఉండవు, నిజమే. కొన్నిసార్లు బాగా తీసినవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతాయి. కానీ ప్రేక్షకులు వాటిని గుర్తించి గౌరవిస్తారు. ఉదాహరణకు ఖలేజాని చెప్పుకోవచ్చు. కానీ తీసికట్టు కంటెంట్ తో వస్తే మాత్రం ఆడియన్స్ ఎంత నిర్దయగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కల్ట్ దర్శకులు ఇప్పుడు షో మధ్యలోనే లేచి వెళ్లిపోయే స్థాయికి దిగిపోయారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నిన్న విడుదలైన థగ్ లైఫ్ మీద యునానిమస్ నెగటివ్ టాక్ కనిపిస్తోంది. కనీసం పర్వాలేదని చెబుతున్న బ్యాచ్ సోషల్ మీడియాలోనూ కనిపించలేదు.
కేవలం కాంబినేషన్ క్రేజ్ మీద బిజినెస్ చేసి, లెక్కలేనంత ఖర్చుతో ప్రమోషన్లు చేసి తీరా థియేటర్లో కూర్చున్న తర్వాత దర్శకుడు మణిరత్నం చూపించిన నీరసం అంతా ఇంతా కాదు. దళపతి, నాయకుడు, రోజా, బొంబాయి తీసింది ఈయనేనా అని ఎవరికైనా సందేహం రాకపోతే ఒట్టు. జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికుడు లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన ఇండియన్ స్పిల్ బర్గ్ శంకర్ వరసగా ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రూపంలో మర్చిపోలేని పీడకలలను కానుకగా ఇచ్చారు. పాటలకు, ఫైట్లకు వందల కోట్లు ఖర్చు పెట్టించినా దానికి తగ్గ అవుట్ ఫుట్ కనీసం సగం కూడా ఇవ్వలేకపోతున్నారు.
ఇక మురుగదాస్ ది కూడా ఇదే కథ. గజిని, తుపాకీ లాంటి అల్టిమేట్ మూవీస్ ఇచ్చిన ఇతనా సల్మాన్ ఖాన్ సికందర్ తీసిందని అనుకోని వాళ్ళు లేరు. అంతకు ముందు రజనీకాంత్ పిలిచి దర్బార్ ఇచ్చినా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు. ఇప్పుడాయన చివరి ఆశ శివ కార్తికేయన్ మదరాసినే. కోలీవుడ్ లో బలమైన ప్రభావం చూపించిన ఇలాంటి దర్శకులు ఇంత నాసిరకంగా దిగిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళ పరిశ్రమకు చెందినప్పటికీ ఇతర భాషల్లోనూ భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ దిగ్గజాలు ఇప్పుడు ట్రోలింగ్ కి టార్గెట్ కావడం విచారకరం. కంబ్యాక్ అవ్వడం విధిరాతలో కాదు వాళ్ళ చేతల్లోనే ఉంది.
This post was last modified on June 6, 2025 10:45 am
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…