ఒక కథ ఒక కాంపౌండ్లో అడుగు పెట్టి.. తర్వాత ఎక్కడెక్కడికో వెళ్లి చివరగా ఒక చోట పట్టాలెక్కుతుంది. ఇలా చేతులు మారిన కథలు అద్భుత ఫలితాన్నీ అందుకుంటాయి. అలాగే చేదు అనుభవాన్నీ మిగులుస్తాయి. అలా చేతులు మారిన కథల్లో ‘గీత గోవిందం’ కూడా ఒకటి. నారా రోహిత్తో ‘సోలో’ సినిమా తీసి హిట్టు కొట్టిన దర్శకుడు పరశురామ్.. తన తర్వాతి చిత్రాన్ని కూడా అతడితోనే చేయాలనుకున్నాడట.
అందుకే ‘గీత గోవిందం’ కథను ముందు రోహిత్కే చెప్పాడట. కానీ తర్వాతేమో విజయ్ దేవరకొండతో ఆ చిత్రం చేశాడు. అది ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేసింది. తాను ఈ సినిమాను మిస్సవడం గురించి ఓ ఇంటర్వ్యూలో రోహిత్ స్పందించాడు. తాను చేస్తే ‘గీత గోవిందం’ అంత పెద్ద హిట్టయ్యేది కాదని అతను నిజాయితీగా అంగీకరించడం విశేషం.
‘గీత గోవిందం’ కథ నచ్చి తన సొంత బేనర్లోనే ఆ సినిమా చేయాలని అనుకున్నట్లు రోహిత్ వెల్లడించాడు. కానీ తర్వాత ఆ కథ గీతా ఆర్ట్స్ సంస్థ వద్దకు వెళ్లిందని.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండను హీరోగా అనుకున్నారని.. పరశురామ్కు అది ఇంకా పెద్ద బ్రేక్ ఇస్తుందన్న ఉద్దేశంతో అక్కడే ఆ సినిమా చేయడానికి తాను ఓకే చెప్పానని రోహిత్ వెల్లడించాడు. తాను గనుక ఆ సినిమా చేసి ఉంటే.. మహా అయితే 15 కోట్లు వసూలు చేసేదని.. విజయ్తో అయినంత పెద్ద హిట్ అయ్యేది కాదని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
ఇక తన చివరి చిత్రం ‘ప్రతినిధి-2’ గురించి మాట్లాడుతూ.. అది మిస్ ఫైర్ అయిందన్నాడు రోహిత్. ఎన్నికల సీజన్ను క్యాష్ చేసుకుందామనే ఆ సినిమా తీశామని.. కానీ అది జనాలకు రీచ్ కాలేదని అన్నాడు. రాంగ్ టైమింగ్లో రిలీజ్ కావడం దానికి చేటు చేసిందన్నాడు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు విడుదల చేశామని.. దీంతో ఆ చిత్రం రిలీజైనట్లు కూడా జనాలకు తెలియలేదని.. అలా కాకుండా నెలా రెండు నెలల ముందు రిలీజై ఉంటే.. కనీసం తాము ఏం తీశామో జనాలకు తెలిసేదని.. ఆ సినిమా చేసిన ఉద్దేశమే నెరవేరలేదని రోహిత్ అన్నాడు.
This post was last modified on June 3, 2025 5:11 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…