సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన కూలి థియేటర్ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఒక్క ఓవర్సీస్ కోసమే 80 కోట్ల పైగా ఆఫర్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. ఇది నిజమైతే కొత్త రికార్డు నమోదైనట్టే. ఇంకా లాక్ చేయలేదు కానీ ఇంకేమైనా డీల్స్ వస్తాయేమోనని నిర్మాత ఎదురు చూస్తున్నట్టు చెన్నై రిపోర్ట్. తెలుగు రైట్స్ కోసం మూడు అగ్ర నిర్మాణ సంస్థలు 50 నుంచి 60 కోట్ల దాకా ఆఫర్ చేసినట్టు ఇన్ సైడ్ లీక్. కానీ సన్ పిక్చర్స్ ఇంకో పది ఇరవై ఎక్కువ కోరుకుంటున్నట్టు తెలిసింది. ఇదంతా కేవలం రెండు చిన్న టీజర్లకొచ్చిన స్పందన వల్ల జరుగుతున్న భీభత్సం.
పోటీలో జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 లాంటి మరో మల్టీస్టారర్ ఉన్నప్పటికీ కూలి మీద బజ్ అంతకంతా పెరుగుతోంది. రజనితో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ల కాంబినేషన్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. ఇతర భాషల్లోనే ఇలా ఉంటే ఇక తమిళం గురించి వేరే చెప్పాలా. తమిళనాడు వెర్షన్ ని ఎంత లేదన్నా రెండు వందల కోట్లకు క్లోజ్ చేయొచ్చని అంటున్నారు. నాన్ థియేటర్, డిజిటల్, డబ్బింగ్, ఓటిటి, ఆడియో ఇతరత్రా హక్కులన్నీ కలుపుకుంటే సన్ పిక్చర్స్ పంట మాములుగా పండేలా లేదు. అనిరుద్ రవిచందర్ సంగీతం హైప్ ని రెట్టింపు కన్నా ఎక్కువ స్థాయిలో పెంచేస్తోంది.
ఏపీ తెలంగాణ హక్కులు అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకున్నట్టు వచ్చిన వార్త ఇంకా ధృవీకరణ కాలేదు. నాగార్జున అడిగారు కానీ ప్రొడక్షన్ కంపెనీ డిమాండ్ చేసిన మొత్తానికి ఈయన కోట్ చేసిన దానికి వ్యత్యాసం ఉండటం వల్లే కొంచెం పెండింగ్ ఉందని అంటున్నారు. అయితే కూలిలో ప్రత్యేక పాత్ర చేసిన కారణంగా నాగ్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తే ఆశ్చర్యం లేదు. ఇంకో రెండు నెలలు ఉండగానే కూలి ఈ స్థాయిలో సంచలనాలు నమోదు చేయడం చూస్తే రిలీజ్ దగ్గరయ్యే కొద్దీ మూవీ లవర్స్ ఫీవర్ అమాంతం పెరిగేలా ఉంది. వచ్చే నెల చెన్నై, ఆగస్ట్ మొదటి వారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారట.
This post was last modified on June 3, 2025 10:59 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…