టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన దర్వకుల్లో వి.వి.వినాయక్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా చాలామంది పెద్ద స్టార్లతో ఆయన సినిమాలు చేశారు. పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు. కానీ ఎలాంటి దర్శకుడైనా ఒక దశ తర్వాత ఔట్ డేట్ అయిపోవడం.. సినిమాలు తగ్గిపోవడం మామూలే. తన తరం స్టార్ డైరెక్టర్లలో ఇప్పటికీ కొందరు మంచి స్థాయిలో ఉండగా.. వినాయక్ మాత్రం ఖాళీ అయిపోయారు.
చివరగా ఆయన తీసిన ‘ఇంటిలిజెంట్’ దారుణమైన ఫలితాన్నందుకుంది. తర్వాత హిందీలో ‘ఛత్రపతి’ని రీమేక్ చేస్తే అక్కడా అదే అనుభవం ఎదురైంది. దీంతో వినాయక్ లైమ్ లైట్లో లేకుండా పోయారు. మధ్యలో అనారోగ్య సమస్యలతోనూ ఆయన ఇబ్బంది పడ్డారు. ఆయన ఆరోగ్యం గురించి రకరకాల రూమర్లు కూడా వినిపించాయి. ఐతే ఇటీవలే కోలుకుని ఒక ఈవెంట్లో కనిపించడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు.
కాగా వినాయక్ ఇప్పుడు మళ్లీ సినిమా చేయాలని చూస్తున్నారట. నిర్మాతను కూడా రెడీ చేసుకున్నారట. కథలు వింటున్నారు. కానీ హీరోను సెట్ చేయడమే ఇబ్బంది అవుతోందని సమాచారం. వినాయక్ ఫామ్ దృష్ట్యా పెద్ద స్టార్లు ఆయనకు దొరికే అవకాశం లేనట్లే. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్లను గతంలో ప్రయత్నించి విఫలమయ్యారు వినాయక్. ఐతే ఇప్పుడు ఆయన దృష్టి యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ మీద పడిందని.. తనకోసం గట్టిగా ట్రై చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
కానీ ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో మాంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు.. సీనియర్ దర్శకుడైన బొమ్మరిల్లు భాస్కర్తో ‘జాక్’ సినిమా చేసి ఎదురు దెబ్బ తిన్నాడు. అది రాంగ్ డెసిషన్ అని సినిమా రిలీజయ్యాక అర్థమైంది. ఈ పరిస్థితుల్లో తనకు అస్సలు సూట్ కాని మాస్ మసాలా సినిమాలు చేసే వినాయక్తో, అది కూడా ఆయన పూర్తిగా ఫామ్ కోల్పోయిన దశలో చేతులు కలుపుతాడా అన్నది ప్రశ్నార్థకం. సిద్ధు అనే కాదు.. వేరే యంగ్ హీరోలు కూడా వినాయక్కు ప్రస్తుత పరిస్థితుల్లో దొరకడం కష్టమే. కాబట్టి ఆయన రీఎంట్రీ అంత తేలికైన విషయం కాదు.
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…