‘‘బుమ్రా, బౌల్ట్ వేసిన యార్కర్లను అయ్యర్ థర్డ్ మ్యాన్ బౌండరీకి తరలించిన తీరు అత్యద్భుతం….ఢిల్లీని ఫైనల్ తీసుకువెళ్లిన అయ్యర్, ఆ తర్వాత కోల్ కతాకు కప్ అందించాడు..అయినా ఆ తర్వాత టీమ్ నుంచి డ్రాప్ చేశారు…పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్ ను ఫైనల్ కు చేర్చాడు…’’అంటూ టాలీవుడ్ కు చెందిన ప్రముఖుడు ఒకరు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్ ను హీరో వెంకటేష్ లా రెగ్యులర్ గా క్రికెట్ మ్యాచ్ లు, ఐపీఎల్ ఫాలో అయ్యే వారు పెట్టి ఉంటారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మహేష్ బాబు సినిమా షూటింగుతో బిజీగా ఉన్న టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఇంత తీరిగ్గా మ్యాచ్ చూసి విశ్లేషించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ తో తన జట్టును ఫైనల్ కు చేర్చిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ ను చూసిన జక్కన్న అయ్యర్ ను ఆకాశానికెత్తేశాడు. అయితే, అయ్యర్ ను డ్రాప్ చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్-2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీపై కూడా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు జక్కన్న.
ప్రతి ఏటా ఐపీఎల్ లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ ఈ ఏడాది కూడా అదరగొట్టాడని కితాబిచ్చాడు రాజమౌళి. ఈ ఏడాది కప్ కొట్టేందుకు కోహ్లీ కూడా అర్హుడే అని చెప్పాడు. ఈ ఇద్దరిలో ఎవరు ట్రోఫీని లిఫ్ట్ చేసినా హార్ట్ బ్రేకింగ్ తప్పదని అన్నాడు. దీంతో, రాజమౌళి పోస్ట్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
ఇంత బిజీ షెడ్యూల్ లో ఐపీఎల్ మ్యాచ్ చూడడమే కాకుండా విశ్లేషించే టైమెక్కడిది సామీ అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు. షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్ ఇస్తామన్నారు..దాని సంగతి చూడకుండా ఈ మ్యాచ్ లేంటి అంటూ మరొక నెటిజన్ ఫన్నీగా క్వచ్చన్ చేశాడు.
This post was last modified on June 2, 2025 3:24 pm
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…