‘‘బుమ్రా, బౌల్ట్ వేసిన యార్కర్లను అయ్యర్ థర్డ్ మ్యాన్ బౌండరీకి తరలించిన తీరు అత్యద్భుతం….ఢిల్లీని ఫైనల్ తీసుకువెళ్లిన అయ్యర్, ఆ తర్వాత కోల్ కతాకు కప్ అందించాడు..అయినా ఆ తర్వాత టీమ్ నుంచి డ్రాప్ చేశారు…పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్ ను ఫైనల్ కు చేర్చాడు…’’అంటూ టాలీవుడ్ కు చెందిన ప్రముఖుడు ఒకరు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్ ను హీరో వెంకటేష్ లా రెగ్యులర్ గా క్రికెట్ మ్యాచ్ లు, ఐపీఎల్ ఫాలో అయ్యే వారు పెట్టి ఉంటారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మహేష్ బాబు సినిమా షూటింగుతో బిజీగా ఉన్న టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఇంత తీరిగ్గా మ్యాచ్ చూసి విశ్లేషించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ తో తన జట్టును ఫైనల్ కు చేర్చిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ ను చూసిన జక్కన్న అయ్యర్ ను ఆకాశానికెత్తేశాడు. అయితే, అయ్యర్ ను డ్రాప్ చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్-2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీపై కూడా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు జక్కన్న.
ప్రతి ఏటా ఐపీఎల్ లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ ఈ ఏడాది కూడా అదరగొట్టాడని కితాబిచ్చాడు రాజమౌళి. ఈ ఏడాది కప్ కొట్టేందుకు కోహ్లీ కూడా అర్హుడే అని చెప్పాడు. ఈ ఇద్దరిలో ఎవరు ట్రోఫీని లిఫ్ట్ చేసినా హార్ట్ బ్రేకింగ్ తప్పదని అన్నాడు. దీంతో, రాజమౌళి పోస్ట్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
ఇంత బిజీ షెడ్యూల్ లో ఐపీఎల్ మ్యాచ్ చూడడమే కాకుండా విశ్లేషించే టైమెక్కడిది సామీ అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు. షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్ ఇస్తామన్నారు..దాని సంగతి చూడకుండా ఈ మ్యాచ్ లేంటి అంటూ మరొక నెటిజన్ ఫన్నీగా క్వచ్చన్ చేశాడు.
This post was last modified on June 2, 2025 3:24 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…