Movie News

పవన్ సత్యాగ్రహి చేసి ఉంటే… నో పాలిటిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేశాడు. అదే.. జాని. ఆ తర్వాత ‘సత్యాగ్రహి’ పేరుతో స్వీయ దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టాడు కానీ.. ఏవో కారణాలతో అది ముందుకు కదల్లేదు. పవన్‌తో ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నంయే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సింది.  కానీ ముహూర్త వేడుక తర్వాత సినిమాకు బ్రేక్ పడింది. ఈ సినిమా గురించి ఈ మధ్య పవన్, రత్నం చర్చించుకున్నారట.

ఒకవేళ ఆ సినిమాను తాను పూర్తి చేసి ఉంటే.. దర్శకుడిగా స్థిరపడిపోయేవాడినని.. రాజకీయాల్లోకే వచ్చేవాడిని కాదని పవన్ రత్నంతో వ్యాఖ్యానించారట. ‘సత్యాగ్రహి’ చాలా మంచి కథ అని.. పవన్ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని.. కానీ పవనే ఆ సినిమాను ఆపేశాడని రత్నం తెలిపారు. ‘జాని’ ఆడకపోవడం వల్లే పవన్ ఆ నిర్ణయం తీసుకున్నాడా అన్నది తనకు తెలియదని.. కానీ పవన్ ఆసక్తిగా లేకపోవడంతో ‘సత్యాగ్రహి’ని ముందుకు తీసుకెళ్లలేకపోయామని రత్నం తెలిపారు. ఆ సినిమా పూర్తి చేద్దామని తాను పవన్ మీద ఒత్తిడి తేలేదన్నారు.

ఈ మధ్య పవన్ దగ్గర ఆ సినిమా ప్రస్తావన వస్తే.. మీరు కనుక నా దగ్గరికి వచ్చి ఆ సినిమా చేయాలని పట్టుబట్టి ఉంటే.. ఆమిర్ ఖాన్ లాగా తాను కూడా దర్శకుడిగా ఇలాంటి సినిమాలు తీసుకుంటూ బిజీ అయ్యేవాడినని.. అప్పుడు రాజకీయాల్లోకి కూడా వచ్చేవాడిని కాదేమో అని పవన్ వ్యాఖ్యానించినట్లు రత్నం వెల్లడించారు. అంటే ‘సత్యాగ్రహి’ మీద పవన్‌కు కూడా బాగానే గురి ఉందన్నమాట. అది హిట్టయి తాను దర్శకుడిగా బిజీ అయ్యేవాడినని ఆయన నమ్మారని భావించాలి. మరి అంత నమ్మకం ఉన్నపుడు పవన్ ఆ సినిమాను ఎందుకు పూర్తి చేయకుండా వదిలేశాడన్నదే అర్థం కాని విషయం.

This post was last modified on June 1, 2025 3:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

28 minutes ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

37 minutes ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

43 minutes ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

4 hours ago