ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో అందరి దృష్టి భైరవం, ఖలేజా మీద ఉండిపోయింది కానీ నరివెట్ట అనే మల్లువుడ్ డబ్బింగ్ రిలీజైన సంగతి చాలా మందికి తెలియదు. మైత్రి లాంటి ప్రముఖ సంస్థ పంపిణి చేసినా సరే కనీస ప్రమోషన్లు లేక ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. హైదరాబాద్ జనాలకు అవగాహన ఉంది కాబట్టి కాసిన్ని టికెట్లు తెగుతున్నాయి కానీ ఏపీ తెలంగాణలో చాలా చోట్ల అసలీ మూవీకి స్క్రీన్లు దొరకలేదన్నది వాస్తవం. ఒక్క అక్షరం అర్థం కాకుండా యధాతథంగా మళయాళం టైటిల్ నే పెట్టడం ఇంకాస్త దూరాన్ని పెంచింది. కనీసం తెలుగు పేరు పెట్టేంత ఓపిక, సమయం మన నిర్మాతలకు లేకుండా పోతోంది.
నరివెట్ట హీరో టోవినో థామస్. 2018, ఏఆర్ఎం, ఎల్2 ఎంపురాన్ లాంటి చిత్రాలతో ఇక్కడ గుర్తింపు వచ్చింది. అడవి మీద బ్రతుకుతూ అక్కడే జీవనోపాధి చూసుకుంటున్న గిరిజనులను ఖాళీ చేయించే బాధ్యత పడిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనకు మంచి స్కోపే దక్కింది. కథనం మరీ నెమ్మదిగా ఉండటం, అవసరం లేని ప్రేమకథకు ఎక్కువ నిడివి పెట్టడం లాంటి మైనస్సులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మంచి ప్రయత్నమని క్రిటిక్స్ మెచ్చుకున్నారు. కేరళలో వసూళ్లు బాగానే ఉన్నాయి. అక్కడ వారం రోజుల నుంచి బుక్ మై షో ట్రెండింగ్ లో ఉండగా మన దగ్గరే కొంత ఆలస్యంగా తీసుకొచ్చారు.
ఆ మధ్య ఆఫీసర్ ఆన్ డ్యూటీకి కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఓటిటిలో వచ్చాక చూసి మెచ్చుకున్న వాళ్ళు ఇది థియేటర్ రిలీజ్ కూడా అయ్యిందనే సంగతి తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ మాత్రం సంబరానికి ఇంత కష్టపడి థియేటర్లలో తేవడం ఎందుకనే కామెంట్లు అప్పుడూ వచ్చాయి. నరివెట్ట సంగతలా ఉంచితే ఇకపై టాలీవుడ్ ప్రొడ్యూసర్లు డబ్బింగ్ టైటిల్స్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాను రాను తమిళ, మలయాళ, కన్నడ పేర్లను అర్థం కావని తెలిసినా సరే అలాగే పెట్టేస్తున్నారు. కారణాలు ఏవైనా ఇది మాత్రం సమర్ధనీయం కాదు. నరివెట్టకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.
This post was last modified on May 31, 2025 9:46 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…