ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో అందరి దృష్టి భైరవం, ఖలేజా మీద ఉండిపోయింది కానీ నరివెట్ట అనే మల్లువుడ్ డబ్బింగ్ రిలీజైన సంగతి చాలా మందికి తెలియదు. మైత్రి లాంటి ప్రముఖ సంస్థ పంపిణి చేసినా సరే కనీస ప్రమోషన్లు లేక ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. హైదరాబాద్ జనాలకు అవగాహన ఉంది కాబట్టి కాసిన్ని టికెట్లు తెగుతున్నాయి కానీ ఏపీ తెలంగాణలో చాలా చోట్ల అసలీ మూవీకి స్క్రీన్లు దొరకలేదన్నది వాస్తవం. ఒక్క అక్షరం అర్థం కాకుండా యధాతథంగా మళయాళం టైటిల్ నే పెట్టడం ఇంకాస్త దూరాన్ని పెంచింది. కనీసం తెలుగు పేరు పెట్టేంత ఓపిక, సమయం మన నిర్మాతలకు లేకుండా పోతోంది.
నరివెట్ట హీరో టోవినో థామస్. 2018, ఏఆర్ఎం, ఎల్2 ఎంపురాన్ లాంటి చిత్రాలతో ఇక్కడ గుర్తింపు వచ్చింది. అడవి మీద బ్రతుకుతూ అక్కడే జీవనోపాధి చూసుకుంటున్న గిరిజనులను ఖాళీ చేయించే బాధ్యత పడిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనకు మంచి స్కోపే దక్కింది. కథనం మరీ నెమ్మదిగా ఉండటం, అవసరం లేని ప్రేమకథకు ఎక్కువ నిడివి పెట్టడం లాంటి మైనస్సులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మంచి ప్రయత్నమని క్రిటిక్స్ మెచ్చుకున్నారు. కేరళలో వసూళ్లు బాగానే ఉన్నాయి. అక్కడ వారం రోజుల నుంచి బుక్ మై షో ట్రెండింగ్ లో ఉండగా మన దగ్గరే కొంత ఆలస్యంగా తీసుకొచ్చారు.
ఆ మధ్య ఆఫీసర్ ఆన్ డ్యూటీకి కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఓటిటిలో వచ్చాక చూసి మెచ్చుకున్న వాళ్ళు ఇది థియేటర్ రిలీజ్ కూడా అయ్యిందనే సంగతి తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ మాత్రం సంబరానికి ఇంత కష్టపడి థియేటర్లలో తేవడం ఎందుకనే కామెంట్లు అప్పుడూ వచ్చాయి. నరివెట్ట సంగతలా ఉంచితే ఇకపై టాలీవుడ్ ప్రొడ్యూసర్లు డబ్బింగ్ టైటిల్స్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాను రాను తమిళ, మలయాళ, కన్నడ పేర్లను అర్థం కావని తెలిసినా సరే అలాగే పెట్టేస్తున్నారు. కారణాలు ఏవైనా ఇది మాత్రం సమర్ధనీయం కాదు. నరివెట్టకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.
This post was last modified on May 31, 2025 9:46 pm
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…