గత కొంత కాలంలో పాత సినిమాల రీ రిలీజులు కొత్త వాటి మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే వీటి గురించి ఎవరూ పెద్దగా నోరు విప్పిన దాఖలాలు లేవు. రెండు మూడు రోజులు ఆడి వెళ్లిపోతాయి కదా మనకెందుకు లెమ్మని అందరూ సైలెంట్ గా ఉన్నారు. తాజాగా మంచు మనోజ్ స్పందించాడు. రీ రిలీజుల వల్ల ఎఫెక్ట్ అవుతున్న మాట వాస్తవమేనని, పెద్దలు దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, అవి వీక్ డేస్ లో వచ్చిన వాటి పుల్ తగ్గదని, కానీ వీకెండ్స్ లో వదలడం వల్ల ఒక తెలుగు సినిమాని మరో తెలుగు సినిమా చంపినట్టు అవుతోందని స్పష్టంగా వివరించాడు.
సీజన్లు, పండగలు ఇలా ఎన్నో డేట్లు అందరూ తీసేసుకుంటున్న తరుణంలో దీనికి పరిష్కారంగా పాత సినిమాలకు వీక్ డేస్ ఇవ్వడం న్యాయమనే ప్రతిపాదన భైరవం సక్సెస్ మీట్ లో తీసుకొచ్చాడు. నిజానికి మంచు మనోజ్ చెప్పింది అక్షర సత్యం. నిన్న గమనిస్తే ఖలేజా వల్ల భైరవం మీద బాగా ప్రభావం పడింది. మహేష్ బాబు మూడ్ లో పడిపోయి జనాలు బెల్లకొండ సాయిశ్రీనివాస్ మూవీని లైట్ తీసుకున్నారు. ఒకవేళ అది లేకపోయి ఉంటే ఖచ్చితంగా బెటర్ ఓపెనింగ్ వచ్చేదన్న ట్రేడ్ కామెంట్ ని కొట్టిపారేయలేం. టాక్ రాక ముందే భైరవం ఫస్ట్ డే వీకవ్వడం వెనుక ప్రధాన కారణం రీ రిలీజేనన్నది బయ్యర్స్ కామెంట్.
దీని మీద ఎవరైనా చొరవ తీసుకుని ఇకపై ఆలా ప్లానింగ్ జరిగేలా చేస్తారేమో చూడాలి. అయితే ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరించే టాలీవుడ్ లో ఇలాంటి విషయాల్లో ఐక్యతని ఆశించడం కష్టమే. ఎందుకంటే రీ రిలీజ్ అయినా సరే నా కెపాసిటీ తగ్గట్టు నేను విడుదల చేసుకుంటాను, నీ రేంజ్ కు తగ్గట్టు నువ్వు చేసుకోమంటూ పాత సినిమాల నిర్మాతలంటే ఎవరు మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. పైగా డిస్ట్రిబ్యూటర్లు సైతం రీ రిలీజులకు వస్తున్న స్పందన చూసి ఎక్కువ థియేటర్లు వచ్చేలా చేస్తున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో చెప్పుకోదగ్గ రీ రిలీజులు చాలానే ఉన్నాయి. మరి మనోజ్ ప్రపోజల్ ఎవరైనా పాటిస్తారేమో చూడాలి.
This post was last modified on May 31, 2025 8:45 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…