ఎంత పెద్ద స్టార్ హీరో నటించినా సరే కొన్ని డిజాస్టర్లు ఫ్యాన్స్ సైతం కలలో తలుచుకోవడానికి కూడా ఇష్టపడరు. ఉదాహరణకు అఖిల్ ఏజెంట్, చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ రూలర్ లాంటివి చెప్పుకోవచ్చు. రజనీకాంత్ కు అలాంటి మర్చిపోలేని కళాఖండం లాల్ సలామ్. థియేటర్లలో ఇది రిలీజై 1 సంవత్సరం 4 నెలలు గడిచిపోయాయి. కానీ డిజిటల్ మోక్షం దక్కలేదు. లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మించిన ఈ ప్యాన్ ఇండియా మూవీ ప్రేక్షకుల నుంచి దారుణ తిరస్కారానికి గురయ్యింది. రజని కూతురు ఐశ్వర్య దర్శకత్వం మీద క్రిటిక్స్ విరుచుకుపడ్డారు. తండ్రి అవమానంగా ఫీలయ్యే సినిమా తీశావంటూ తలంటారు.
చెన్నై టాక్ ప్రకారం గతంలో లాల్ సలామ్ ఓటిటి హక్కులు తొలుత కొన్నది నెట్ ఫ్లిక్స్. డిజిటల్ వెర్షన్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలున్న హార్డ్ డిస్క్ మాయమయ్యిందని ఐశ్యర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాక ఓటిటి విడుదల ఆగిపోయింది. అది ఇస్తే తప్ప తమ ప్లాట్ ఫార్మ్ మీద స్ట్రీమింగ్ చేయమని నెట్ ఫ్లిక్స్ చెప్పిందట. పైగా తమకు చెప్పింది ఒకటి తీసింది ఒకటని, ఆ మేరకు అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనను సాకుగా చూపించి డీల్ క్యాన్సిల్ చేసుకున్నారట. పలు చర్చలు, ప్రయత్నాల తర్వాత చివరికి సన్ నెక్స్ట్ కు చేరుకుంది. జూన్ 7 బక్రీద్ సందర్భంగా అందుబాటులోకి తేబోతున్నారు.
ట్విస్ట్ ఏంటంటే లాల్ సలామ్ చూడని ఆడియన్స్ కోట్లలో ఉన్నారు. రిలీజ్ టైంలో రివ్యూలు, పబ్లిక్ టాక్, సోషల్ మీడియా ట్రోలింగ్ చూసి భయపడి ఎవరూ దాని జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఓటిటి అంటే వ్యూస్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఏజెంట్ కూడా ఇదే తరహాలో విపరీతమైన ఆలస్యానికి గురైన సంగతి తెలిసిందే. ఫైనల్ గా డిజిటల్ లోకి వచ్చాక ఎవరూ పట్టించుకోలేదు. లాల్ సలామ్ కి దీనికి భిన్నమైన స్పందన వస్తే మంచిదే. జైలర్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా లాల్ సలామ్ కొచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద తుస్సుమని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
This post was last modified on May 31, 2025 10:07 am
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…