కన్నడ భాష గురించి థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు చాలా దూరం వెళ్లిపోయాయి. రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే సినిమాను నిషేధిస్తామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ హుకుం జారీ చేసి, దాని ప్రకారం బ్యాన్ ప్రకటన ఇచ్చేసింది. ఇది జరగడానికి ముందు కమల్ మాట్లాడుతూ ఒక ఎజెండా పెట్టుకుని పనిచేసే వాళ్లకు సమాధానం ఇవ్వనని, తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పే సమస్య లేదని, ఒకవేళ చేసి ఉంటే సారీ చెబుతానని, ఇది నా లైఫ్ స్టైల్ అంటూ మీడియా ముఖంగా చెప్పడంతో కాంట్రావర్సి ముదిరింది. దీంతో కన్నడనాట జూన్ 5 థగ్ లైఫ్ కి దారులు మూసుకుపోయాయి.
ఇప్పుడీ వివాదం శివరాజ్ కుమార్ ని సైతం చుట్టుకుంటోంది. కమల్ ని సమర్థిస్తూ ఇటీవలే ఆయన చేసిన కామెంట్లు అగ్ని ఆజ్యం పోసినట్టయ్యింది. లోక నాయకుడిని విమర్శించడానికి బదులు చిన్న బడ్జెట్ కన్నడ సినిమాలను మీరు ప్రోత్సహించడం లేదంటూ శాండల్ వుడ్ మీడియా, ఇతర వర్గాలకు క్లాస్ తీసుకోవడం నిరసనకారులకు కోపం తెప్పించింది, దీంతో సౌమ్యుడిగా పేరున శివన్నను సైతం కొందరు టార్గెట్ చేసుకుంటున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న శాండల్ వుడ్ పెద్దలు ఇది ఎక్కడిదాకా వెళ్తుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కమల్ సారీ చెప్పకుండా థగ్ లైఫ్ బ్యాన్ కి కారణం కావడం వల్ల భవిష్యత్తులో కన్నడ సినిమాలకు తమిళనాడులో, తమిళ చిత్రాలకు కర్ణాటకలో చిక్కులు తప్పకపోవచ్చు. దీని వల్ల కోట్ల రూపాయల వ్యాపారం పోయి నష్టం కలుగుతుంది. కమల్ ఈగోతోనే సారీ చెప్పడం లేదని ఫిలిం ఛాంబర్ పెద్దలు భావిస్తుండగా ఫ్యాన్స్ మాత్రం ఆయన మాటలను వక్రీకరించారంటూ సమర్ధన అందుకున్నారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ చెప్పడం ఈ రచ్చకు ప్రధాన కారణం. ప్రస్తుతానికి ఈ మూవీ కన్నడ డిస్ట్రిబ్యూటర్లు ఈ పరిణామాల పట్ల తీవ్ర టెన్షన్ తో ఉన్నారు. థగ్ లైఫ్ నిర్మాత కూడా కమలే కాబట్టి ఈ ఆర్థిక వ్యవహారాలను ఎలా చక్కదిద్దుతారో చూడాలి.
This post was last modified on May 30, 2025 7:17 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…