కన్నడ భాష గురించి థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు చాలా దూరం వెళ్లిపోయాయి. రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే సినిమాను నిషేధిస్తామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ హుకుం జారీ చేసి, దాని ప్రకారం బ్యాన్ ప్రకటన ఇచ్చేసింది. ఇది జరగడానికి ముందు కమల్ మాట్లాడుతూ ఒక ఎజెండా పెట్టుకుని పనిచేసే వాళ్లకు సమాధానం ఇవ్వనని, తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పే సమస్య లేదని, ఒకవేళ చేసి ఉంటే సారీ చెబుతానని, ఇది నా లైఫ్ స్టైల్ అంటూ మీడియా ముఖంగా చెప్పడంతో కాంట్రావర్సి ముదిరింది. దీంతో కన్నడనాట జూన్ 5 థగ్ లైఫ్ కి దారులు మూసుకుపోయాయి.
ఇప్పుడీ వివాదం శివరాజ్ కుమార్ ని సైతం చుట్టుకుంటోంది. కమల్ ని సమర్థిస్తూ ఇటీవలే ఆయన చేసిన కామెంట్లు అగ్ని ఆజ్యం పోసినట్టయ్యింది. లోక నాయకుడిని విమర్శించడానికి బదులు చిన్న బడ్జెట్ కన్నడ సినిమాలను మీరు ప్రోత్సహించడం లేదంటూ శాండల్ వుడ్ మీడియా, ఇతర వర్గాలకు క్లాస్ తీసుకోవడం నిరసనకారులకు కోపం తెప్పించింది, దీంతో సౌమ్యుడిగా పేరున శివన్నను సైతం కొందరు టార్గెట్ చేసుకుంటున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న శాండల్ వుడ్ పెద్దలు ఇది ఎక్కడిదాకా వెళ్తుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కమల్ సారీ చెప్పకుండా థగ్ లైఫ్ బ్యాన్ కి కారణం కావడం వల్ల భవిష్యత్తులో కన్నడ సినిమాలకు తమిళనాడులో, తమిళ చిత్రాలకు కర్ణాటకలో చిక్కులు తప్పకపోవచ్చు. దీని వల్ల కోట్ల రూపాయల వ్యాపారం పోయి నష్టం కలుగుతుంది. కమల్ ఈగోతోనే సారీ చెప్పడం లేదని ఫిలిం ఛాంబర్ పెద్దలు భావిస్తుండగా ఫ్యాన్స్ మాత్రం ఆయన మాటలను వక్రీకరించారంటూ సమర్ధన అందుకున్నారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ చెప్పడం ఈ రచ్చకు ప్రధాన కారణం. ప్రస్తుతానికి ఈ మూవీ కన్నడ డిస్ట్రిబ్యూటర్లు ఈ పరిణామాల పట్ల తీవ్ర టెన్షన్ తో ఉన్నారు. థగ్ లైఫ్ నిర్మాత కూడా కమలే కాబట్టి ఈ ఆర్థిక వ్యవహారాలను ఎలా చక్కదిద్దుతారో చూడాలి.
This post was last modified on May 30, 2025 7:17 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…