అసలు విడుదల టైంలో ఫ్లాప్ గా నిలిచి ఇప్పుడు రీ రిలీజ్ సందర్భంగా రికార్డులు బద్దలు కొడుతున్న ఖలేజా నిన్న సాయంత్రం నుంచే ప్రీమియర్లు మొదలుపెట్టింది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి నగరాల్లో అభిమానుల సందడి మాములుగా లేదు. ముఖ్యంగా ఆర్టిసి క్రాస్ రోడ్స్ దగ్గర సందోహం చూసేందుకు రెండు కళ్ళు చాలవనేంత సందడి వాతావరణం నెలకొంది. ఇంత హంగామా మధ్య థియేటర్లలో అడుగు పెట్టిన ఫ్యాన్స్ కి షాక్ తగిలింది. సెకండాఫ్ లో వచ్చే సండే మండే పాట, మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఉన్న సన్నివేశాలు కొన్ని కోతకు గురవ్వడంతో ఆందోళన చెంది కొన్ని చోట్ల షోలు ఆపేశారు.
సాంకేతిక సమస్యా లేక ఎడిటింగ్ లో పోయాయో చెప్పలేదు కానీ నిజానికి ఇక్కడ థియేటర్ యాజమాన్యాల తప్పేమీ లేదు. శాటిలైట్ నుంచి వచ్చిన ప్రింట్ ని యధాతథంగా ప్రదర్శించారు తప్పించి వాళ్ళుగా కోరుకున్నా ఎలాంటి కట్స్ చేయలేరు. ఈ లాజిక్ మిస్సైన కొందరు అభిమానులు పలు చోట్ల గొడవలు చేయడం సోషల్ మీడియాలో కనిపించింది. ఇంత తీవ్ర నిరసన ఊహించని ఖలేజా టీమ్ రాత్రికి రాత్రి రిపేర్లు చేసి తొలగించిన కంటెంట్ ఇవాళ్టి నుంచి స్క్రీన్ అయ్యేలా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీంతో అందరూ హమ్మయ్యా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు షోలు చాలా కీలకం కాబోతున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సుమారు ఆరు మూడు దాకా వసూళ్లు చేసిందని చెబుతున్న ఖలేజా ఫైనల్ రన్ లోపు టాలీవుడ్ రీ రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సినిమా భైరవం దీని దెబ్బకే వెనుకబడిపోవడం ఊహించని పరిణామం. అయినా ఎప్పుడో జమానాలో వచ్చిన సినిమా అయితే రీల్స్ దొరకలేదనో నెగటివ్ మిస్సయ్యిందనో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ లోనే ఉన్న ఖలేజాకు కూడా ఇలాంటి కట్స్ ఉండటం ఖచ్చితంగా టీమ్ వైపు నుంచి జరిగిన తప్పే. ఏదైతేనేం కథ సుఖాంతమయ్యింది. ఇవాళ్టి నుంచి ఖలేజా ఫుల్ వెర్షన్ ని అభిమానులు బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చు.
This post was last modified on May 30, 2025 12:05 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…