అసలు విడుదల టైంలో ఫ్లాప్ గా నిలిచి ఇప్పుడు రీ రిలీజ్ సందర్భంగా రికార్డులు బద్దలు కొడుతున్న ఖలేజా నిన్న సాయంత్రం నుంచే ప్రీమియర్లు మొదలుపెట్టింది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి నగరాల్లో అభిమానుల సందడి మాములుగా లేదు. ముఖ్యంగా ఆర్టిసి క్రాస్ రోడ్స్ దగ్గర సందోహం చూసేందుకు రెండు కళ్ళు చాలవనేంత సందడి వాతావరణం నెలకొంది. ఇంత హంగామా మధ్య థియేటర్లలో అడుగు పెట్టిన ఫ్యాన్స్ కి షాక్ తగిలింది. సెకండాఫ్ లో వచ్చే సండే మండే పాట, మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఉన్న సన్నివేశాలు కొన్ని కోతకు గురవ్వడంతో ఆందోళన చెంది కొన్ని చోట్ల షోలు ఆపేశారు.
సాంకేతిక సమస్యా లేక ఎడిటింగ్ లో పోయాయో చెప్పలేదు కానీ నిజానికి ఇక్కడ థియేటర్ యాజమాన్యాల తప్పేమీ లేదు. శాటిలైట్ నుంచి వచ్చిన ప్రింట్ ని యధాతథంగా ప్రదర్శించారు తప్పించి వాళ్ళుగా కోరుకున్నా ఎలాంటి కట్స్ చేయలేరు. ఈ లాజిక్ మిస్సైన కొందరు అభిమానులు పలు చోట్ల గొడవలు చేయడం సోషల్ మీడియాలో కనిపించింది. ఇంత తీవ్ర నిరసన ఊహించని ఖలేజా టీమ్ రాత్రికి రాత్రి రిపేర్లు చేసి తొలగించిన కంటెంట్ ఇవాళ్టి నుంచి స్క్రీన్ అయ్యేలా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీంతో అందరూ హమ్మయ్యా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు షోలు చాలా కీలకం కాబోతున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సుమారు ఆరు మూడు దాకా వసూళ్లు చేసిందని చెబుతున్న ఖలేజా ఫైనల్ రన్ లోపు టాలీవుడ్ రీ రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సినిమా భైరవం దీని దెబ్బకే వెనుకబడిపోవడం ఊహించని పరిణామం. అయినా ఎప్పుడో జమానాలో వచ్చిన సినిమా అయితే రీల్స్ దొరకలేదనో నెగటివ్ మిస్సయ్యిందనో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ లోనే ఉన్న ఖలేజాకు కూడా ఇలాంటి కట్స్ ఉండటం ఖచ్చితంగా టీమ్ వైపు నుంచి జరిగిన తప్పే. ఏదైతేనేం కథ సుఖాంతమయ్యింది. ఇవాళ్టి నుంచి ఖలేజా ఫుల్ వెర్షన్ ని అభిమానులు బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చు.
This post was last modified on May 30, 2025 12:05 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…