అసలు విడుదల టైంలో ఫ్లాప్ గా నిలిచి ఇప్పుడు రీ రిలీజ్ సందర్భంగా రికార్డులు బద్దలు కొడుతున్న ఖలేజా నిన్న సాయంత్రం నుంచే ప్రీమియర్లు మొదలుపెట్టింది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి నగరాల్లో అభిమానుల సందడి మాములుగా లేదు. ముఖ్యంగా ఆర్టిసి క్రాస్ రోడ్స్ దగ్గర సందోహం చూసేందుకు రెండు కళ్ళు చాలవనేంత సందడి వాతావరణం నెలకొంది. ఇంత హంగామా మధ్య థియేటర్లలో అడుగు పెట్టిన ఫ్యాన్స్ కి షాక్ తగిలింది. సెకండాఫ్ లో వచ్చే సండే మండే పాట, మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఉన్న సన్నివేశాలు కొన్ని కోతకు గురవ్వడంతో ఆందోళన చెంది కొన్ని చోట్ల షోలు ఆపేశారు.
సాంకేతిక సమస్యా లేక ఎడిటింగ్ లో పోయాయో చెప్పలేదు కానీ నిజానికి ఇక్కడ థియేటర్ యాజమాన్యాల తప్పేమీ లేదు. శాటిలైట్ నుంచి వచ్చిన ప్రింట్ ని యధాతథంగా ప్రదర్శించారు తప్పించి వాళ్ళుగా కోరుకున్నా ఎలాంటి కట్స్ చేయలేరు. ఈ లాజిక్ మిస్సైన కొందరు అభిమానులు పలు చోట్ల గొడవలు చేయడం సోషల్ మీడియాలో కనిపించింది. ఇంత తీవ్ర నిరసన ఊహించని ఖలేజా టీమ్ రాత్రికి రాత్రి రిపేర్లు చేసి తొలగించిన కంటెంట్ ఇవాళ్టి నుంచి స్క్రీన్ అయ్యేలా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీంతో అందరూ హమ్మయ్యా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు షోలు చాలా కీలకం కాబోతున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సుమారు ఆరు మూడు దాకా వసూళ్లు చేసిందని చెబుతున్న ఖలేజా ఫైనల్ రన్ లోపు టాలీవుడ్ రీ రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సినిమా భైరవం దీని దెబ్బకే వెనుకబడిపోవడం ఊహించని పరిణామం. అయినా ఎప్పుడో జమానాలో వచ్చిన సినిమా అయితే రీల్స్ దొరకలేదనో నెగటివ్ మిస్సయ్యిందనో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ లోనే ఉన్న ఖలేజాకు కూడా ఇలాంటి కట్స్ ఉండటం ఖచ్చితంగా టీమ్ వైపు నుంచి జరిగిన తప్పే. ఏదైతేనేం కథ సుఖాంతమయ్యింది. ఇవాళ్టి నుంచి ఖలేజా ఫుల్ వెర్షన్ ని అభిమానులు బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చు.
This post was last modified on May 30, 2025 12:05 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…