పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దుర్ఘటన అల్లు అర్జున్ ని ఎంతగా వేటాడిందో అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా అంత సులభంగా మర్చిపోలేరు. కోర్టుకు హాజరు కావడం, పోలీస్ స్టేషన్ కు వెళ్లడం, జైలు దాకా వెళ్లి బెయిలు తెచ్చుకోవడం ఇవన్నీ బన్నీ కల్లో కూడా ఊహించని పరిణామాలు. ఇవి చాలవన్నట్టు నేరుగా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఈ సంఘటనను సీరియస్ గా తీసుకోవడం కథను రకరకాల మలుపులు తిప్పింది. కోరుకుని జరిగింది కాకపోయినా బన్నీ పడిన నరకం అంతా ఇంతా కాదు. ఈ ప్రమాదం వల్ల ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం నెలల తరబడి మీడియాలో హైలైట్ అయ్యింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో దీని గురించి విరుచుకుపడిన వైనం విదితమే. ఇవాళ ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడి పురస్కారం అల్లు అర్జున్ కి ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికట్టు అయ్యింది. అందులో ప్రధానమైంది బన్నీ పట్ల రేవంత్ సర్కారుకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదనేది. ఒకవేళ అలాంటిది ఉంటే కనక లక్కీ భాస్కర్, పొట్టెల్, 35 చిన్న కథ కాదు లాంటి సినిమాల్లో నటించిన హీరోలకు ఇచ్చి ఉండొచ్చు. కానీ పుష్ప 2 పెర్ఫార్మన్స్ ముందు అవన్నీ తక్కువే. అందుకే పర్సనల్ ఎజెండా లాంటివి పెట్టుకోకుండా బన్నీనే బెస్ట్ యాక్టర్ గా ఎంచుకోవడం మంచి ఆలోచన.
పుష్పలో నటనకు జాతీయ ఆవార్డే వచ్చినప్పుడు ఇప్పుడీ గద్దర్ గౌరవం దక్కడంలో ఎలాంటి ఆశ్చర్యం, అతిశయోక్తి లేదు. జూన్ 14 జరిగే వేడుకలో స్వయంగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే అల్లు అర్జున్ అవార్డు తీసుకోవడం ఫ్యాన్స్ కి ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం కానుంది. సంధ్య థియేటర్ ఉదంతంలో జరిగిన వాదోపవాదాలు, పరస్పర కౌంటర్లకు ఈ సందర్భంగా చెక్ పడినట్టే. నష్టపోయిన బాధితులకు అల్లు ఫ్యామిలీ తరఫున, ఇటు గవర్మమెంట్ తరఫున సాయం అందుతోంది కాబట్టి ఇకపై ఈ ప్రస్తావన రాబోదనేది బన్నీ ఫ్యాన్స్ అంచనా. ఏదైతేనేం గద్దర్ అవార్డుల వల్ల కొన్ని ముఖ్యమైన సందేహాలు తీరిపోయినట్టే.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…