Movie News

చిరంజీవి మెచ్చుకున్న అర్జున్ కథ

చాలా గ్యాప్ తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడి అవతారం ఎత్తారు. ఆయన డైరెక్షన్ లో రూపొందిన సీత పయనం విడుదలకు రెడీ అవుతోంది. కూతురు ఐశ్వర్యతో పాటు ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఇది నిజానికి విశ్వక్ సేన్ తో ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టు. తర్వాత ఏవో విభేదాలు వచ్చి ఇద్దరూ మీడియాకెక్కి కొంత వివాదం రేగడం ప్రేక్షకులకు గుర్తే. అర్జున్ ఈ వ్యవహారంలో చాలా హర్ట్ అయ్యాడు. అలాని ప్రయత్నం ఆపలేదు. నిరంజన్ ని తీసుకొచ్చి పూర్తి చేశాడు. ఇవాళ హైదరాబాద్ లో సుకుమార్ ముఖ్య అతిథిగా ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఈ సందర్భంగానే మెగా ముచ్చట  వచ్చింది.

షూటింగ్ స్టార్ట్ కాక ముందు అర్జున్ ఈ స్టోరీని ముందు మెగాస్టార్ చిరంజీవికి వినిపించారు. ఎవరికి సూటవుతుందో అడగాలనే ఉద్దేశంతో. అయితే ఫుల్ నెరేషన్ వింటానని చిరు చెప్పడంతో రెండు గంటల పాటు పాటు మొత్తం చెప్పారు అర్జున్. తర్వాత అదనంగా మరో రెండు గంటలు మార్పులు చేర్పులు, ముఖ్యమైన అంశాల గురించి డిస్కషన్ జరిగింది. అలా మెగా ఇన్ పుట్స్ సీత పయనంకి చాలా ఉపయోగపడ్డాయి. ఇదంతా స్టేజి మీద అర్జునే చెప్పుకొచ్చారు. వీళ్లకు ఈ బాండింగ్ ఇప్పటిది కాదు. దశాబ్దాల నుంచి ఉన్నదే. శ్రీ మంజునాథలో తొలిసారి దేవుడు భక్తుడుగా కలిసి పోటీపడి నటించారు.

సో చిరంజీవి మెచ్చుకున్నారంటే సీత పయనంలో ఏదో బలమైన మ్యాటర్ ఉన్నట్టే అనిపిస్తోంది. ట్రైలర్ లో చూపించిన విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ధృవ సర్జ, అర్జున్ లు క్యామియోలు కూడా చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ లవ్ ఆండ్ యాక్షన్ డ్రామాని పూర్తిగా తెలుగులోనే తీయడం గమనార్హం. టాలీవుడ్ లో అడుగు పెడుతున్న నిరంజన్, ఐశ్యర్యలకు ఇది ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. జై హింద్ లాటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన అర్జున్ ఈసారి ప్రేమకథను ఎంచుకున్నారు. కాకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించారు లెండి. మరి ఈసారి ఎలాంటి విజయం సాధిస్తారో.

This post was last modified on May 29, 2025 8:46 am

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

8 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

21 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

32 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago