నాందితో సీరియస్ టర్నింగ్ తీసుకుని విజయం అందుకున్న అల్లరి నరేష్ కి ఆ తర్వాత అదే తరహాలో చేసిన ప్రయత్నాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం తీవ్రంగా నిరాశపరిస్తే నా సామిరంగా సక్సెస్ నాగార్జున ఖాతాలోకి వెళ్ళిపోయింది,. తిరిగి కామెడీ ట్రాక్ లో చేసిన ఆ ఒక్కటి అడక్కుతోనూ పనవ్వలేదు. రంగస్థలం రేంజ్ లో ఉంటుందని ఊరించిన బచ్చల మల్లిలో డ్రామా ఎక్కువైపోయి జనం తిరస్కరించారు. దీంతో తనెక్కడ ట్రాక్ తప్పుతున్నాడో గుర్తించిన అల్లరోడు క్రేజీ అండ్ ట్రెండీ కంటెంట్ వైపు దృష్టి సారిస్తున్నాడు. వాటిలో ఒక దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గత ఏడాది అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా ప్రారంభమయ్యింది. మెహర్ తేజ్ దర్శకుడు. దీనికి ఆల్కహాల్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. ట్విస్ట్ ఏంటంటే ఇందులో హీరోకు మందు తాగే అలవాటు ఉండదట. అలాంటప్పుడు ఆ పేరు ఎందుకు పెట్టారంటే అదే సస్పెన్స్ ఎలిమెంట్ అంటోంది టీమ్. మెహర్ తేజ్ గతంలో ఫ్యామిలీ డ్రామా తీశాడు. సుహాస్ నెగటివ్ షేడ్ లో నటించిన ఈ క్రైమ్ థ్రిలర్ ఓటిటిలో మంచి స్పందన తెచ్చుకుంది. అది చూసే అల్లరోడు ఆల్కహాల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. పేరైతే క్రేజీగానే ఉంది మరి.
షూటింగ్ సగానికి పైగానే అయిపోయిందని సమాచారం. రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అల్లరోడి మార్కు హాస్యంతో పాటు కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ ఆల్కహాల్ లో ఉంటాయట. ఇప్పటిదాకా టచ్ చేయని జానర్ లో అల్లరి నరేష్ ని చూడొచ్చని వినికిడి. ఏదైతేనేం తనను తిరిగి ఫామ్ లోకి రావడం చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సోలో హీరోగా తను సాలిడ్ హిట్టు కొట్టి దశాబ్దం దాటిపోయింది. అయినా కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రేక్షకులు ఓపెనింగ్స్ ఇస్తున్నారు. కానీ సరైన కంటెంట్ పడితే మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడు. ఆల్కహాల్ ఏమైనా తీరుస్తుందేమో చూడాలి.
This post was last modified on May 28, 2025 4:43 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…