అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో రూపొందబోయే ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హీరోయిన్లుగా దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ దాదాపు లాకైనట్టేనని ఇన్ సైడ్ టాక్. ఇంకో ఇద్దరు ఉంటారనే న్యూస్ ఉంది కానీ వాళ్ళ పేర్లు నిర్ధారణగా తెలియలేదు. భాగ్యశ్రీ బోర్సేని అడిగినట్టుగా లీక్ ఉంది. ఇదిలా ఉండగా దీనికి టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో అట్లీ ఉన్నాడట. ఐకాన్, సూపర్ హీరో లాంటి పలు ఆప్షన్లు బన్నీ ముందు పెడితే ఎలాగూ మొదటిది బిరుదుగా ఉంది కనక దానివైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఈ ఐకాన్ వెనుకో చిన్న స్టోరీ ఉంది. పుష్ప టైంలో నిర్మాత దిల్ రాజు ఐకాన్ టైటిల్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారు. రోడ్ జర్నీ నేపథ్యంలో డిఫరెంట్ గా ఉంటుందని ప్రైవేట్ టాక్స్ లో అనేవారు. కానీ పుష్ప బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ మనసు మారిపోయింది. దీంతో దిల్ రాజు తనను నమ్ముకున్న వేణు శ్రీరామ్ కి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు నితిన్ తమ్ముడు ఇచ్చి ఆ లోటుని భర్తీ చేశారు. ఐకాన్ టైటిల్ ఇప్పటికీ సేఫ్ గా ఉంది. అల్లు అర్జున్ అడిగితే రాజుగారు కాదనలేరు. సో అన్ని భాషలకు సూటయ్యేలా దీన్నే లాక్ చేయొచ్చని బలంగా వినిపిస్తోంది.
పుష్ప 2 ఆల్ ఇండియా రికార్డులు సాధించాక బన్నీ మరింత జాగ్రత్త పడుతున్నాడు. తన ప్రతి సినిమాకు డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో ముందే అంచనా వేసుకుని దానికి తగ్గట్టు బడ్జెట్ లు, కాంబోలు సెట్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక కారణం కూడా అదే. ఎంత ఖర్చయినా పర్వాలేదనే నిర్మాత కళానిధి మారన్ తో వ్యవహారం ఎలా ఉంటుందో తనకు తెలుసు. అయిదు వందల కోట్లు కాదు అంతకు డబుల్ అయినా ఆయన లెక్క చేయరు. ఏడాదిలోగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి తగినంత సమయం పెట్టుకుని 2027 సంక్రాంతి రిలీజ్ ని లక్ష్యంగా పెట్టుకున్నారట.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…