అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో రూపొందబోయే ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హీరోయిన్లుగా దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ దాదాపు లాకైనట్టేనని ఇన్ సైడ్ టాక్. ఇంకో ఇద్దరు ఉంటారనే న్యూస్ ఉంది కానీ వాళ్ళ పేర్లు నిర్ధారణగా తెలియలేదు. భాగ్యశ్రీ బోర్సేని అడిగినట్టుగా లీక్ ఉంది. ఇదిలా ఉండగా దీనికి టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో అట్లీ ఉన్నాడట. ఐకాన్, సూపర్ హీరో లాంటి పలు ఆప్షన్లు బన్నీ ముందు పెడితే ఎలాగూ మొదటిది బిరుదుగా ఉంది కనక దానివైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఈ ఐకాన్ వెనుకో చిన్న స్టోరీ ఉంది. పుష్ప టైంలో నిర్మాత దిల్ రాజు ఐకాన్ టైటిల్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారు. రోడ్ జర్నీ నేపథ్యంలో డిఫరెంట్ గా ఉంటుందని ప్రైవేట్ టాక్స్ లో అనేవారు. కానీ పుష్ప బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ మనసు మారిపోయింది. దీంతో దిల్ రాజు తనను నమ్ముకున్న వేణు శ్రీరామ్ కి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు నితిన్ తమ్ముడు ఇచ్చి ఆ లోటుని భర్తీ చేశారు. ఐకాన్ టైటిల్ ఇప్పటికీ సేఫ్ గా ఉంది. అల్లు అర్జున్ అడిగితే రాజుగారు కాదనలేరు. సో అన్ని భాషలకు సూటయ్యేలా దీన్నే లాక్ చేయొచ్చని బలంగా వినిపిస్తోంది.
పుష్ప 2 ఆల్ ఇండియా రికార్డులు సాధించాక బన్నీ మరింత జాగ్రత్త పడుతున్నాడు. తన ప్రతి సినిమాకు డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో ముందే అంచనా వేసుకుని దానికి తగ్గట్టు బడ్జెట్ లు, కాంబోలు సెట్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక కారణం కూడా అదే. ఎంత ఖర్చయినా పర్వాలేదనే నిర్మాత కళానిధి మారన్ తో వ్యవహారం ఎలా ఉంటుందో తనకు తెలుసు. అయిదు వందల కోట్లు కాదు అంతకు డబుల్ అయినా ఆయన లెక్క చేయరు. ఏడాదిలోగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి తగినంత సమయం పెట్టుకుని 2027 సంక్రాంతి రిలీజ్ ని లక్ష్యంగా పెట్టుకున్నారట.
This post was last modified on May 28, 2025 10:10 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…