ఇప్పటికే పైరసీ, వీడియో లీకులతో సతమతమవుతున్న టాలీవుడ్ మరో కొత్త రకం దారుణాలు చవి చూడాల్సి వస్తోంది. జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్పకు సంబంధించి కీలక దృశ్యాలున్న హార్ట్ డిస్క్ ఒకటి మాయమయ్యిందనే వార్త అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీకి విఎఫ్ఎక్స్ చేసిన ముంబై కంపెనీ దాన్ని మంచు విష్ణు ఆఫీస్ కు పంపిస్తే, ఆ డ్రైవ్ ని ఆఫీస్ బాయ్ నుంచి చరిత అనే ఉద్యోగి తీసుకెళ్లిందని, ఇప్పటిదాకా జాడ తెలియడం లేదని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదయ్యింది. దాంట్లో ఎంత డేటా ఉంది, ఎంత నిడివి లాంటి వివరాలు కంప్లైంట్ లో పొందుపరిచారట.
సరిగ్గా ఇంకో నెల రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలా జరగడం మంచు ఫ్యామిలీని ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఇది ఆషామాషీ సినిమా కాదు. వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన ప్యాన్ ఇండియా మూవీ. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి భారీ క్యాస్టింగ్ భాగమయ్యారు. విష్ణు ఎడతెరిపి లేకుండా బయట ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే డబ్బింగ్ పనులు మొదలుపెట్టబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. ఇలాంటి టైంలో హఠాత్తుగా హార్డ్ డ్రైవ్ లాంటివి అదృశ్యం కావడం చాలా తీవ్ర పరిణామమనే చెప్పాలి.
నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరి నమ్మక ద్రోహం వల్ల ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గేమ్ చేంజర్ ఎడిటింగ్ రూమ్ నుంచే పైరసీ కాపీ బయటికి వెళ్లిపోవడం గురించి ఇప్పటిదాకా దోషులెవరో సరయిన రీతిలో బయటపడలేదు. ఆ నేరం శాటిలైట్ లో జరిగిందా లేక లోపలున్న వాళ్ళు చేశారా అనేది ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కన్నప్పకు ఇలాంటి అన్యాయం జరగడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. పోలీసులు వెంటనే రంగంలో దిగి దీనికి బాధ్యులైన వాళ్ళ కాల్ డేటా, లొకేషన్లు తదితరాలు ఆరా తీసే పనిలో ఉన్నారట. వాళ్ళు దొరికితే చాలు ఫ్యాన్స్ రిలాక్సవుతారు.
This post was last modified on May 27, 2025 9:33 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…