ఇప్పటికే పైరసీ, వీడియో లీకులతో సతమతమవుతున్న టాలీవుడ్ మరో కొత్త రకం దారుణాలు చవి చూడాల్సి వస్తోంది. జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్పకు సంబంధించి కీలక దృశ్యాలున్న హార్ట్ డిస్క్ ఒకటి మాయమయ్యిందనే వార్త అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీకి విఎఫ్ఎక్స్ చేసిన ముంబై కంపెనీ దాన్ని మంచు విష్ణు ఆఫీస్ కు పంపిస్తే, ఆ డ్రైవ్ ని ఆఫీస్ బాయ్ నుంచి చరిత అనే ఉద్యోగి తీసుకెళ్లిందని, ఇప్పటిదాకా జాడ తెలియడం లేదని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదయ్యింది. దాంట్లో ఎంత డేటా ఉంది, ఎంత నిడివి లాంటి వివరాలు కంప్లైంట్ లో పొందుపరిచారట.
సరిగ్గా ఇంకో నెల రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలా జరగడం మంచు ఫ్యామిలీని ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఇది ఆషామాషీ సినిమా కాదు. వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన ప్యాన్ ఇండియా మూవీ. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి భారీ క్యాస్టింగ్ భాగమయ్యారు. విష్ణు ఎడతెరిపి లేకుండా బయట ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే డబ్బింగ్ పనులు మొదలుపెట్టబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. ఇలాంటి టైంలో హఠాత్తుగా హార్డ్ డ్రైవ్ లాంటివి అదృశ్యం కావడం చాలా తీవ్ర పరిణామమనే చెప్పాలి.
నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరి నమ్మక ద్రోహం వల్ల ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గేమ్ చేంజర్ ఎడిటింగ్ రూమ్ నుంచే పైరసీ కాపీ బయటికి వెళ్లిపోవడం గురించి ఇప్పటిదాకా దోషులెవరో సరయిన రీతిలో బయటపడలేదు. ఆ నేరం శాటిలైట్ లో జరిగిందా లేక లోపలున్న వాళ్ళు చేశారా అనేది ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కన్నప్పకు ఇలాంటి అన్యాయం జరగడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. పోలీసులు వెంటనే రంగంలో దిగి దీనికి బాధ్యులైన వాళ్ళ కాల్ డేటా, లొకేషన్లు తదితరాలు ఆరా తీసే పనిలో ఉన్నారట. వాళ్ళు దొరికితే చాలు ఫ్యాన్స్ రిలాక్సవుతారు.
This post was last modified on May 27, 2025 9:33 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…