ఇప్పటికే పైరసీ, వీడియో లీకులతో సతమతమవుతున్న టాలీవుడ్ మరో కొత్త రకం దారుణాలు చవి చూడాల్సి వస్తోంది. జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్పకు సంబంధించి కీలక దృశ్యాలున్న హార్ట్ డిస్క్ ఒకటి మాయమయ్యిందనే వార్త అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీకి విఎఫ్ఎక్స్ చేసిన ముంబై కంపెనీ దాన్ని మంచు విష్ణు ఆఫీస్ కు పంపిస్తే, ఆ డ్రైవ్ ని ఆఫీస్ బాయ్ నుంచి చరిత అనే ఉద్యోగి తీసుకెళ్లిందని, ఇప్పటిదాకా జాడ తెలియడం లేదని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదయ్యింది. దాంట్లో ఎంత డేటా ఉంది, ఎంత నిడివి లాంటి వివరాలు కంప్లైంట్ లో పొందుపరిచారట.
సరిగ్గా ఇంకో నెల రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలా జరగడం మంచు ఫ్యామిలీని ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఇది ఆషామాషీ సినిమా కాదు. వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన ప్యాన్ ఇండియా మూవీ. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి భారీ క్యాస్టింగ్ భాగమయ్యారు. విష్ణు ఎడతెరిపి లేకుండా బయట ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే డబ్బింగ్ పనులు మొదలుపెట్టబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. ఇలాంటి టైంలో హఠాత్తుగా హార్డ్ డ్రైవ్ లాంటివి అదృశ్యం కావడం చాలా తీవ్ర పరిణామమనే చెప్పాలి.
నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరి నమ్మక ద్రోహం వల్ల ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గేమ్ చేంజర్ ఎడిటింగ్ రూమ్ నుంచే పైరసీ కాపీ బయటికి వెళ్లిపోవడం గురించి ఇప్పటిదాకా దోషులెవరో సరయిన రీతిలో బయటపడలేదు. ఆ నేరం శాటిలైట్ లో జరిగిందా లేక లోపలున్న వాళ్ళు చేశారా అనేది ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కన్నప్పకు ఇలాంటి అన్యాయం జరగడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. పోలీసులు వెంటనే రంగంలో దిగి దీనికి బాధ్యులైన వాళ్ళ కాల్ డేటా, లొకేషన్లు తదితరాలు ఆరా తీసే పనిలో ఉన్నారట. వాళ్ళు దొరికితే చాలు ఫ్యాన్స్ రిలాక్సవుతారు.
This post was last modified on May 27, 2025 9:33 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…