మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత గ్యాప్ వచ్చేసిన నవీన్ పోలిశెట్టి త్వరలో అనగనగా ఒక రాజుగా రాబోతున్నాడు. వచ్చే ఏడాది 2026 జనవరి 14 విడుదల తేదీని ఖరారు చేస్తూ సితార సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చేసింది. పండక్కు వచ్చే సినిమాల్లో టాలీవుడ్ నుంచి ఫస్ట్ డేట్ లాక్ చేసుకున్న సినిమా ఇదే. దీని కన్నా ముందు మెగా 157 సంక్రాంతికి అన్నారు కానీ తేదీ చెప్పలేదు. షూటింగ్ అయ్యాక అప్పుడు నిర్ణయిద్దామనుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడీ పరిణామంతో త్వరలోనే డెసిషన్ తీసుకునే అవకాశం లేకపోలేదు. పండగని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకునే ఉద్దేశంలో తను ఎంత మాత్రం లేడు
ఇంత హఠాత్తుగా అనగనగా ఒక రోజు తొందరపడటం వెనుక కారణం లేకపోలేదు. అఖండ 2 ఒకవేళ రాబోయే సెప్టెంబర్ మిస్ చేసుకుంటే బాలయ్య సెంటిమెంట్ ప్రకారం జనవరికి వెళ్లే అవకాశముంది. ఆల్రెడీ విజయ్ చివరి సినిమా జన నాయగన్ ఎప్పుడో కర్చీఫ్ వేసుకుని ఉంది. అదే జరిగితే బాలకృష్ణ, చిరంజీవి, విజయ్ లతో పాటు ఇంకొక్కరికే ఛాన్స్ ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకునే ఉద్దేశంతో నవీన్ పోలిశెట్టి టీమ్ ఈ రకంగా ఎత్తుగడ వేసిందన్న మాట. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ కు మారి దర్శకత్వం వహిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
పండగ బరి నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా తప్పుకోవడం వల్ల మిగిలిన వాళ్లకు ఛాన్స్ దొరికింది. ఇక్కడ ఇంకో విషయం మర్చిపోకూడదు. ఒకవేళ ది రాజా సాబ్ కనక ఈ ఏడాది డిసెంబర్ లోగా రాకపోతే అది కూడా జనవరినే టార్గెట్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పటికిప్పుడు అది తేలేలా లేదు. మిరాయ్ కి ఏ తేదీ అనుకుంటున్నారో దాని బట్టి రాజా సాబ్ ది నిర్ణయించుకోవాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆలోచన. మిరాయ్ టీజర్ లో ఆగస్ట్ 1 కాకుండా వేరే డేట్ ఉంటే ప్లాన్ మారినట్టే లెక్క. మొత్తానికి ఏడు నెలల ముందే 2026 సంక్రాంతికి సంబంధించిన బాక్సాఫీస్ సర్కస్ మొదలైపోయింది.
This post was last modified on May 26, 2025 6:08 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…