మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత గ్యాప్ వచ్చేసిన నవీన్ పోలిశెట్టి త్వరలో అనగనగా ఒక రాజుగా రాబోతున్నాడు. వచ్చే ఏడాది 2026 జనవరి 14 విడుదల తేదీని ఖరారు చేస్తూ సితార సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చేసింది. పండక్కు వచ్చే సినిమాల్లో టాలీవుడ్ నుంచి ఫస్ట్ డేట్ లాక్ చేసుకున్న సినిమా ఇదే. దీని కన్నా ముందు మెగా 157 సంక్రాంతికి అన్నారు కానీ తేదీ చెప్పలేదు. షూటింగ్ అయ్యాక అప్పుడు నిర్ణయిద్దామనుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడీ పరిణామంతో త్వరలోనే డెసిషన్ తీసుకునే అవకాశం లేకపోలేదు. పండగని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకునే ఉద్దేశంలో తను ఎంత మాత్రం లేడు
ఇంత హఠాత్తుగా అనగనగా ఒక రోజు తొందరపడటం వెనుక కారణం లేకపోలేదు. అఖండ 2 ఒకవేళ రాబోయే సెప్టెంబర్ మిస్ చేసుకుంటే బాలయ్య సెంటిమెంట్ ప్రకారం జనవరికి వెళ్లే అవకాశముంది. ఆల్రెడీ విజయ్ చివరి సినిమా జన నాయగన్ ఎప్పుడో కర్చీఫ్ వేసుకుని ఉంది. అదే జరిగితే బాలకృష్ణ, చిరంజీవి, విజయ్ లతో పాటు ఇంకొక్కరికే ఛాన్స్ ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకునే ఉద్దేశంతో నవీన్ పోలిశెట్టి టీమ్ ఈ రకంగా ఎత్తుగడ వేసిందన్న మాట. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ కు మారి దర్శకత్వం వహిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
పండగ బరి నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా తప్పుకోవడం వల్ల మిగిలిన వాళ్లకు ఛాన్స్ దొరికింది. ఇక్కడ ఇంకో విషయం మర్చిపోకూడదు. ఒకవేళ ది రాజా సాబ్ కనక ఈ ఏడాది డిసెంబర్ లోగా రాకపోతే అది కూడా జనవరినే టార్గెట్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పటికిప్పుడు అది తేలేలా లేదు. మిరాయ్ కి ఏ తేదీ అనుకుంటున్నారో దాని బట్టి రాజా సాబ్ ది నిర్ణయించుకోవాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆలోచన. మిరాయ్ టీజర్ లో ఆగస్ట్ 1 కాకుండా వేరే డేట్ ఉంటే ప్లాన్ మారినట్టే లెక్క. మొత్తానికి ఏడు నెలల ముందే 2026 సంక్రాంతికి సంబంధించిన బాక్సాఫీస్ సర్కస్ మొదలైపోయింది.
This post was last modified on May 26, 2025 6:08 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…