మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత గ్యాప్ వచ్చేసిన నవీన్ పోలిశెట్టి త్వరలో అనగనగా ఒక రాజుగా రాబోతున్నాడు. వచ్చే ఏడాది 2026 జనవరి 14 విడుదల తేదీని ఖరారు చేస్తూ సితార సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చేసింది. పండక్కు వచ్చే సినిమాల్లో టాలీవుడ్ నుంచి ఫస్ట్ డేట్ లాక్ చేసుకున్న సినిమా ఇదే. దీని కన్నా ముందు మెగా 157 సంక్రాంతికి అన్నారు కానీ తేదీ చెప్పలేదు. షూటింగ్ అయ్యాక అప్పుడు నిర్ణయిద్దామనుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడీ పరిణామంతో త్వరలోనే డెసిషన్ తీసుకునే అవకాశం లేకపోలేదు. పండగని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకునే ఉద్దేశంలో తను ఎంత మాత్రం లేడు
ఇంత హఠాత్తుగా అనగనగా ఒక రోజు తొందరపడటం వెనుక కారణం లేకపోలేదు. అఖండ 2 ఒకవేళ రాబోయే సెప్టెంబర్ మిస్ చేసుకుంటే బాలయ్య సెంటిమెంట్ ప్రకారం జనవరికి వెళ్లే అవకాశముంది. ఆల్రెడీ విజయ్ చివరి సినిమా జన నాయగన్ ఎప్పుడో కర్చీఫ్ వేసుకుని ఉంది. అదే జరిగితే బాలకృష్ణ, చిరంజీవి, విజయ్ లతో పాటు ఇంకొక్కరికే ఛాన్స్ ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకునే ఉద్దేశంతో నవీన్ పోలిశెట్టి టీమ్ ఈ రకంగా ఎత్తుగడ వేసిందన్న మాట. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ కు మారి దర్శకత్వం వహిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
పండగ బరి నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా తప్పుకోవడం వల్ల మిగిలిన వాళ్లకు ఛాన్స్ దొరికింది. ఇక్కడ ఇంకో విషయం మర్చిపోకూడదు. ఒకవేళ ది రాజా సాబ్ కనక ఈ ఏడాది డిసెంబర్ లోగా రాకపోతే అది కూడా జనవరినే టార్గెట్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పటికిప్పుడు అది తేలేలా లేదు. మిరాయ్ కి ఏ తేదీ అనుకుంటున్నారో దాని బట్టి రాజా సాబ్ ది నిర్ణయించుకోవాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆలోచన. మిరాయ్ టీజర్ లో ఆగస్ట్ 1 కాకుండా వేరే డేట్ ఉంటే ప్లాన్ మారినట్టే లెక్క. మొత్తానికి ఏడు నెలల ముందే 2026 సంక్రాంతికి సంబంధించిన బాక్సాఫీస్ సర్కస్ మొదలైపోయింది.
This post was last modified on May 26, 2025 6:08 pm
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…