Movie News

ఆ నలుగురిలో నేను లేను – అల్లు అరవింద్

గత వారం రోజులుగా ఇండస్ట్రీని కుదిపేసిన థియేటర్ల బంద్ వ్యవహారం నిన్న ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లేఖతో కొత్త మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. పాలనలోకి వచ్చి ఏడాదైనా కనీసం ఓసారైనా ముఖ్యమంత్రిని కలిసే చొరవ తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూనే రిటర్న్ గిఫ్ట్ కు థాంక్స్ అంటూ వ్యంగ్యంగా పరిశ్రమ తీరు పట్ల విమర్శించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ రోజు అల్లు అరవింద్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తనవైపు చెప్పాలనుకున్న విషయాలను వివరించారు. అందులో కొన్ని కీలకమైనవి ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకున్న ఆ నలుగురు గురించి.

పదిహేనేళ్లుగా ఆ నలుగురు గురించి హైలైట్ చేస్తూ వస్తున్నారని, కానీ వాళ్ళలో నేను లేనని అరవింద్ కుండ బద్దలు కొట్టేశారు. ఏపీ తెలంగాణలో తనకు థియేటర్లు లేవని, హైదరాబాద్ లో ఉన్న ఏఏఏ తప్ప దేనికీ తాను ఓనర్ ని కానని తేల్చేశారు. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లో పదిహేను కంటే తక్కువ స్క్రీన్లు తనకు లీజులో ఉన్నాయని, ఇకపై వాటిని రెన్యూవల్ చేసే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న టైంలో బంద్ పిలుపు ఇవ్వడం ద్వారా దుస్సాహసం చేశారని చెబుతున్న అరవింద్ పవన్ సూచించినట్టు ఎప్పుడో చంద్రబాబు నాయుడుని కలవాల్సిందని, చేయకపోవడం తప్పేనని అన్నారు.

పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అల్లు అరవింద్ ప్రధానంగా ఆ నలుగురిలో లేనని చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని మార్గాలు మూసుకున్నప్పుడు బంద్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఇలా హఠాత్తుగా పిలుపు ఇవ్వడం వల్లే తాను మీటింగులకు దూరంగా ఉన్నానని అరవింద్ అన్నారు. ఉపముఖ్యమంత్రి హోదా పవన్ విడుదల చేసిన లేఖలో పాయింట్లను పూర్తిగా సమర్ధిస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఇకపై ఆ నలుగురు కథనాల్లో తన ఫోటో వేయొద్దని కోరారు ఇప్పుడీ మీడియా మీట్ తాలూకు స్పందనలు ఇతర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. 

This post was last modified on May 25, 2025 6:15 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago