Movie News

ఆ నలుగురిలో నేను లేను – అల్లు అరవింద్

గత వారం రోజులుగా ఇండస్ట్రీని కుదిపేసిన థియేటర్ల బంద్ వ్యవహారం నిన్న ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లేఖతో కొత్త మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. పాలనలోకి వచ్చి ఏడాదైనా కనీసం ఓసారైనా ముఖ్యమంత్రిని కలిసే చొరవ తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూనే రిటర్న్ గిఫ్ట్ కు థాంక్స్ అంటూ వ్యంగ్యంగా పరిశ్రమ తీరు పట్ల విమర్శించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ రోజు అల్లు అరవింద్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తనవైపు చెప్పాలనుకున్న విషయాలను వివరించారు. అందులో కొన్ని కీలకమైనవి ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకున్న ఆ నలుగురు గురించి.

పదిహేనేళ్లుగా ఆ నలుగురు గురించి హైలైట్ చేస్తూ వస్తున్నారని, కానీ వాళ్ళలో నేను లేనని అరవింద్ కుండ బద్దలు కొట్టేశారు. ఏపీ తెలంగాణలో తనకు థియేటర్లు లేవని, హైదరాబాద్ లో ఉన్న ఏఏఏ తప్ప దేనికీ తాను ఓనర్ ని కానని తేల్చేశారు. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లో పదిహేను కంటే తక్కువ స్క్రీన్లు తనకు లీజులో ఉన్నాయని, ఇకపై వాటిని రెన్యూవల్ చేసే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న టైంలో బంద్ పిలుపు ఇవ్వడం ద్వారా దుస్సాహసం చేశారని చెబుతున్న అరవింద్ పవన్ సూచించినట్టు ఎప్పుడో చంద్రబాబు నాయుడుని కలవాల్సిందని, చేయకపోవడం తప్పేనని అన్నారు.

పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అల్లు అరవింద్ ప్రధానంగా ఆ నలుగురిలో లేనని చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని మార్గాలు మూసుకున్నప్పుడు బంద్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఇలా హఠాత్తుగా పిలుపు ఇవ్వడం వల్లే తాను మీటింగులకు దూరంగా ఉన్నానని అరవింద్ అన్నారు. ఉపముఖ్యమంత్రి హోదా పవన్ విడుదల చేసిన లేఖలో పాయింట్లను పూర్తిగా సమర్ధిస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఇకపై ఆ నలుగురు కథనాల్లో తన ఫోటో వేయొద్దని కోరారు ఇప్పుడీ మీడియా మీట్ తాలూకు స్పందనలు ఇతర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. 

This post was last modified on May 25, 2025 6:15 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

13 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

53 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago