Movie News

పవన్ కళ్యాణ్ ధర్మాగ్రహం –  పరిశ్రమ అంతర్మథనం

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రెస్ నోట్ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగు పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలుపడమనే వ్యంగ్యాస్త్రంతో మొదలుపెట్టి రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం అనుసరించబోయే ధోరణి గురించి సవివరంగా చెప్పడం నిర్మాతల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. కూటమి ఏర్పడి ఏడాది కావొస్తున్నా ఇప్పటిదాకా టాలీవుడ్ సంఘాలు, ప్రతినిధులు ఎవరూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కనీసం మర్యాదపూర్వకంగా అయినా కలవకపోవడం పట్ల ధర్మాగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ ప్రస్తావించిన విషయాలు చాలా సీరియస్ గా ఉన్నాయి.

కొత్త రిలీజులు దగ్గర ఉన్నప్పుడు డిప్యూటీ సిఎంని వ్యక్తిగతంగా కలవడం, టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు తెచ్చుకోవడం మినహా ఎలాంటి స్పందన లేదని, ఇకపై సమస్యలైనా విన్నపాలైనా పర్సనల్ మీట్స్ ఉండవని చెబుతున్న పవన్ కేవలం అసోసియేషన్ల ద్వారా మాత్రం సంప్రదింపులు చేయాలని గట్టిగా చెప్పేశారు. అంటే ఇకపై ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరైనా సరే వ్యక్తిగత కారణాల మీద అపాయింట్మెంట్స్ ఉండవన్న మాట. కొందరు నిర్మాతలు గతంలో కలవడం గురించి పేర్లతో సహా ఉటంకించిన లేఖలో అలాంటి సంఘటిత వాతావరణం ఎప్పుడూ ఉండే సూచనలు కనిపించడం లేదని పేర్కొన్నారు.

థియేటర్ల ఆదాయాలు, పన్నుల రాబడి, వాటిలో సౌకర్యాలు, మల్టీప్లెక్సుల పేరిట జరుగుతున్న వ్యాపారంలోని లొసుగులు, టికెట్ రేట్ల విషయంలో ఏర్పడుతున్న సానుకూలత వ్యతిరేకత ఇలా అన్నింటి పైనా సమీక్షలు, రిపోర్టులు తీయబోతున్నారు. ముఖ్యంగా పరిశ్రమలో గుత్తాధిపత్యం మీద దృష్టి పెడతామని లేఖలో చెప్పడం కొందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ హర్టవ్వడం చాలా దూరం వెళ్లేలా ఉంది. పదవిలో ఉన్నది మన హీరోనే, మన మంత్రినే కదా, అన్నీ జరిగిపోతాయనే నిర్లక్ష్య భావనకు తగిన మూల్యం చెల్లించే టైం దగ్గర్లోనే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడీ నోట్ తాలూకు పరిణామాల తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతోందో ఇప్పుడే ఊహించడం కష్టం. ఎందుకంటే నిన్నటి దాకా సాఫ్ట్ గా ఉన్న పవన్ ఒక్కసారిగా ఇంత స్థాయిలో స్పందించడం వెనుక జూన్ 1 థియేటర్ల బంద్ ప్రచారం ఒక కారణం కాగా, హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర్లోనే ఇలాంటి పిలుపులకు ఆస్కారం ఎవరిచ్చారనే దాని గురించి విచారణ కూడా తీవ్రంగానే జరిగేలా ఉంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు అందరూ కలిసి సిఎం, డిసిఎంని కలిసినా పవన్ వెంటనే చల్లారకపోవచ్చని జనసేన వర్గాలంటున్నాయి. కూర్చున్న చెట్టుని నరుక్కున్న చందంగా కొందరి నిర్లిప్త వైఖరి ఇక్కడిదాకా తెచ్చిందన్నది వాస్తవం. 

This post was last modified on May 24, 2025 7:05 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

27 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago