వచ్చే వారం మే 30 రీ రిలీజ్ కాబోతున్న ఖలేజా అడ్వాన్స్ బుకింగ్స్ మతులు పోగొట్టేలా ఉన్నాయి. వారం రోజుల ముందుగానే బుక్ మై షోలో మళ్ళీ విడుదలవుతున్న సినిమాకు గంటకు 14 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం టాలీవుడ్ హిస్టరీలో ఇదే మొదటిసారి. మాములుగా క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీస్ సైతం కొన్ని సార్లు ఇంత దూకుడు చూపించవు. అలాంటిది ఖలేజాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఎగ్జిబిటర్లు అప్పటికప్పుడు షోలు యాడ్ చేస్తున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే డేట్ దగ్గర పడేకొద్దీ ఈ అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడం కష్టం. నిజంగా ఇది ట్విస్ట్.
ఖలేజాకు ఇంత క్రేజ్ ఉండటానికి కారణాలున్నాయి. ఒరిజినల్ గా విడుదలైన టైంలో కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచిన మూవీ ఇది. త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ మీదున్న విపరీతమైన అంచనాలను మోయలేక ఫ్లాప్ అనిపించుకుంది. హీరోని దేవుడిగా క్యారెక్టర్ గా డిజైన్ చేసిన దర్శకుడు దాన్ని మాస్ కి అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా చెప్పలేకపోవడంతో పాటు ఫస్ట్ హాఫ్ ఏడారిలో నడిపించిన ఎపిసోడ్ వల్ల పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. థియేటర్ రన్ పూర్తయ్యాక క్రమంగా ఖలేజాకు కల్ట్ స్టేటస్ రావడం మొదలయ్యింది. శాటిలైట్ ఛానల్స్ లో ప్రసారం మొదలయ్యాక జనాలు ఆదరించడం మొదలుపెట్టారు.
చాలా కాలం నిర్మాతలకున్న ఆర్థిక వివాదాల వల్ల ఖలేజా టీవీ టెలికాస్ట్ కు కూడా నోచుకోలేదు. ఓటిటిలో రాలేదు. డివిడి రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు. అందుకే ఫ్యాన్స్ ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. తర్వాత హక్కులను జెమిని సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి కల్ట్ ఫాలోయింగ్ పెరుగుతూ పోయింది. టీవీలో చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఒకసారి బిగ్ స్క్రీన్ మీద చూడాలని కోరుకున్నారు. పోకిరి రీ రిలీజ్ తర్వాత నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు వాళ్ళ కోరిక ఫలించింది. ఇదంతా ముందే ఎక్స్ పెక్ట్ చేసిన అతిథి నిర్మాతలు తమ రీ రిలీజ్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం.
This post was last modified on May 23, 2025 9:33 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…