వచ్చే వారం మే 30 రీ రిలీజ్ కాబోతున్న ఖలేజా అడ్వాన్స్ బుకింగ్స్ మతులు పోగొట్టేలా ఉన్నాయి. వారం రోజుల ముందుగానే బుక్ మై షోలో మళ్ళీ విడుదలవుతున్న సినిమాకు గంటకు 14 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం టాలీవుడ్ హిస్టరీలో ఇదే మొదటిసారి. మాములుగా క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీస్ సైతం కొన్ని సార్లు ఇంత దూకుడు చూపించవు. అలాంటిది ఖలేజాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఎగ్జిబిటర్లు అప్పటికప్పుడు షోలు యాడ్ చేస్తున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే డేట్ దగ్గర పడేకొద్దీ ఈ అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడం కష్టం. నిజంగా ఇది ట్విస్ట్.
ఖలేజాకు ఇంత క్రేజ్ ఉండటానికి కారణాలున్నాయి. ఒరిజినల్ గా విడుదలైన టైంలో కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచిన మూవీ ఇది. త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ మీదున్న విపరీతమైన అంచనాలను మోయలేక ఫ్లాప్ అనిపించుకుంది. హీరోని దేవుడిగా క్యారెక్టర్ గా డిజైన్ చేసిన దర్శకుడు దాన్ని మాస్ కి అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా చెప్పలేకపోవడంతో పాటు ఫస్ట్ హాఫ్ ఏడారిలో నడిపించిన ఎపిసోడ్ వల్ల పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. థియేటర్ రన్ పూర్తయ్యాక క్రమంగా ఖలేజాకు కల్ట్ స్టేటస్ రావడం మొదలయ్యింది. శాటిలైట్ ఛానల్స్ లో ప్రసారం మొదలయ్యాక జనాలు ఆదరించడం మొదలుపెట్టారు.
చాలా కాలం నిర్మాతలకున్న ఆర్థిక వివాదాల వల్ల ఖలేజా టీవీ టెలికాస్ట్ కు కూడా నోచుకోలేదు. ఓటిటిలో రాలేదు. డివిడి రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు. అందుకే ఫ్యాన్స్ ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. తర్వాత హక్కులను జెమిని సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి కల్ట్ ఫాలోయింగ్ పెరుగుతూ పోయింది. టీవీలో చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఒకసారి బిగ్ స్క్రీన్ మీద చూడాలని కోరుకున్నారు. పోకిరి రీ రిలీజ్ తర్వాత నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు వాళ్ళ కోరిక ఫలించింది. ఇదంతా ముందే ఎక్స్ పెక్ట్ చేసిన అతిథి నిర్మాతలు తమ రీ రిలీజ్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం.
This post was last modified on May 23, 2025 9:33 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…