దగ్ లైఫ్ ట్రైలర్ చూశాక షాక్ కి గురి చేసిన అంశాల్లో ప్రధానమైంది త్రిష పాత్ర. కమల్ హాసన్ తనతో రొమాన్స్ చేసినట్టుగా చూపించడం అభిమానులు ఉహించలేదు. ఎందుకంటే వినైతండి వరువాయ (ఏ మాయ చేసావే తమిళ వెర్షన్) లో శింబుతో త్రిష చూపించిన కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా పండిందో ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. గత పదిహేనేళ్లుగా చెన్నైలో డైలీ సింగల్ షోతో ఇప్పటికీ ఈ సినిమా ప్రదర్శింపబడటం సౌత్ ఇండియాలో కొత్త రికార్డు. అలాంటి క్లాసిక్ లో భాగం పంచుకున్న త్రిష ఇప్పుడు దగ్ లైఫ్ లో శింబు పక్కన కాకుండా కమల్ హాసన్ తో జంట కట్టడం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.
దీంతో సోషల్ మీడియాలో కొందరు త్రిషని ద్రోహిగా వర్ణించడం మొదలుపెట్టారు. ఇది తన దాకా వెళ్ళింది. ఒక తమిళ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను ద్రోహి అనడం చూశానని, అయితే సినిమాలో అంతకన్నా పెద్ద షాక్ ఉంటుందని, దానికి సిద్ధం కమ్మని చెప్పడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ తిన్నారు. అది చూశాకే శింబుకి జోడి ఉంటుందో లేదో అర్థమవుతుందని చెప్పింది. దీంతో ఏదో పెద్ద సస్పెన్స్ సినిమాలో ఉందని అర్థమైపోయింది. ట్విస్ట్ ఏంటంటే మెయిన్ హీరోయిన్లు అభిరామి, త్రిష ఇద్దరూ కమల్ తో ఆడిపాడారు కానీ శింబుకి జోడి ఎవరో ఎక్కడా రివీల్ చేయకపోవడం అసలు ట్విస్ట్.
ఈ లెక్కన దగ లైఫ్ లో మలుపులు చాలా ఉండబోతున్నాయేది అర్థమవుతోంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ చాలా కబుర్లు పంచుకున్నారు. సుహాసినిని పెళ్లి చేసుకోకముందే తాను మణిరత్నం నాయకుడుతో ఒక్కటయ్యామని చెప్పి నవ్వులు పూయించారు. ఇంద్రుడు చంద్రుడుకి తనికెళ్ళ భరణితో రచన చేయించాలనుకోవడం దగ్గరి నుంచి నాయకుడు కన్నా దగ్ లైఫ్ ఏ రకంగా గొప్పగా ఉంటుందనే దాకా చాలానే చెప్పుకొచ్చారు. జూన్ 5 విడుదల కాబోతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు టాప్ టెక్నీషియన్స్ రవి కె చంద్రన్ ఛాయాగ్రహణం, ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.
This post was last modified on May 23, 2025 10:40 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…