ఇవాళ శుక్రవారం కొత్త రిలీజులున్నా బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించడం లేదు. మే నెలలో శ్రీవిష్ణు సింగిల్ తర్వాత ఇంకే సినిమా చెప్పుకోదగ్గ సౌండ్ చేయలేకపోయింది. జగదేకవీరుడు అతిలోకసుందరి కొంత మేర వర్కౌట్ చేసుకోగా అద్భుతం చేస్తుందనుకున్న యమదొంగ పెద్దగా వసూళ్లు తేలేదు. ఈ నేపథ్యంలో ఇదే నిర్లిప్తత ఇవాళ కూడా కొనసాగేలా ఉంది. విజయ్ సేతుపతి – రుక్మిణి వసంత్ ‘ఏస్’ మీద పెద్దగా అంచనాలు లేకపోవడంతో ప్రమోషన్లు కూడా అంతంత మాత్రంగా చేయడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. మహారాజాలాగా ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తేనే ఆడియన్స్ ని థియేటర్లకు రాబట్టగలదు.
హిందీ బ్లాక్ బస్టర్ ‘కేసరి చాప్టర్ 2’ ఒరిజినల్ వెర్షన్ ఎంత హిట్టయినా తెలుగు అనువాదం చాలా ఆలస్యం చేయడంతో మన ఆడియన్స్ ఏమంత ఆసక్తి కనబరచడం లేదు. అందులోనూ పబ్లిసిటీ మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం కలెక్షన్లను ప్రభావితం చేయనుంది. చావా తరహాలో దీని మీద టాలీవుడ్ జనాలకు ఇంటరెస్ట్ లేదనే విషయం తేటతెల్లమవుతోంది. ఇవి కాకుండా వీరరాజు, నిశ్శబ్ద ప్రేమ, వైభవం అంటూ మరికొన్ని చిన్న సినిమాలు రేస్ లో ఉన్నాయి కానీ వీటికి మార్నింగ్ షోల్లో జనాలు కనిపించినా గొప్పే. ఐపీఎల్ ప్రభావం లేకపోయినా థియేటర్ల దగ్గర నిశ్శబ్ద వాతావరణం తాండవిస్తోంది.
ట్విస్ట్ ఏంటంటే ‘వర్షం’ రీ రిలీజ్ ట్రెండింగ్ లో ఉంది. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో 15 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చూస్తే ప్రభాస్ డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షం రీ రిలీజ్ కావడం ఇది మొదటిసారి కాదు. అయినా సరే ఇంత స్పందన రావడం అనూహ్యం. కరెంట్ బుకింగ్స్ కలుపుకుంటే భారీ నెంబర్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. బాలీవుడ్ రిలీజులు భూల్ ఛుక్ మాఫ్, కేసరి వీర్ లకు రెస్పాన్స్ అంతంత మాత్రంగా ఉంది. మే 30 బెల్లంకొండ సాయిశ్రీనివాస్ భైరవం దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…