తెలుగులో ఉప్పెన, విడుదలతో మనకూ దగ్గరైన విజయ్ సేతుపతి కొత్త సినిమా ఏస్ ఎల్లుండి విడుదల కానుంది. కానీ కనీస స్థాయిలో బజ్ లేకపోవడం బయ్యర్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే మహారాజా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ అంటే ఎంత లేదన్నా ఓ మాదిరి అంచనాలుంటాయి. కానీ దానికి భిన్నంగా ఏస్ చాలా సైలెంట్ గా వస్తోంది. సప్తసాగరాలు దాటి సైడ్ ఏబి హీరోయిన్, జూనియర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్ చేస్తున్న రుక్మిణి వసంత్ హీరోయిన్ కావడం ఎలాంటి ప్లస్ కాలేకపోతోంది. ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో ఆయనే స్వంతంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ట్రైలర్ కంటెంట్ చూస్తే ఆసక్తికరంగానే అనిపించింది. బోల్ట్ కాశి అనే వ్యక్తి జీవితంలో చాలా పెద్ద గతం ఉంటుంది. అదేంటో తెలుసుకోవడానికి చుట్టుపక్కల వాళ్ళు ఎంత ప్రయత్నించినా సాధ్యపడదు. అయితే కాశి ఒక పెద్ద ప్లాన్ తో ఉంటాడు. దేశవిదేశాలు తిరిగి దాన్ని నెరవేర్చుకునే క్రమంలో జూదం ఆడే మాఫియా ప్రపంచంలో అడుగు పెడతాడు. ఈ పాయింట్ మీద ఏస్ నడుస్తుంది. బ్యాక్ డ్రాప్ సీరియస్ గా అనిపిస్తున్నా యోగిబాబుతో కావాల్సిన ఫన్ చేయించడంతో పాటు యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే జొప్పించినట్టు అనిపిస్తోంది. డియర్ కామ్రేడ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు.
ఏస్ కు బాక్సాఫీస్ దగ్గర పోటీలేని వాతావరణం కలిసి వచ్చేలా ఉంది. కాకపోతే హైప్ ఇంత తక్కువగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ తేవడం అనుమానంగానే ఉంది. మహారాజా లాగా యునానిమాస్ టాక్ వస్తే మెల్లగా పికప్ కావొచ్చు. మే 30 భైరవం వచ్చే దాకా ఎలాంటి కాంపిటీషన్ లేదు కాబట్టి వసూళ్లు రాబట్టుకోవచ్చు. శ్రీవిష్ణు సింగిల్ మూడో వారంలో అడుగుపెడుతూ ఇప్పటికే నెమ్మదించేసింది. ఇతర సినిమాల ప్రభావం సున్నానే. సో ఏస్ ఈ ఛాన్స్ ఎంత మేరకు వాడుకుంటుందో చూడాలి. ప్రమోషన్లు సరిగా చేయకపోవడం ప్రభావం చూపిస్తోంది. విజయ్ సేతుపతి కొత్తగా ట్రై చేసిన ఏస్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on May 21, 2025 8:45 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…