Movie News

తారక్ కాదు.. హృతిక్ కాదు..

నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘వార్-2’ టీజర్. దీనికి సందర్భం.. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. కానీ టీజర్ చూశాక తారక్ ఫ్యాన్స్‌లో అనుకున్నంత ఉత్సాహం కనిపించలేదు. టీజర్లో తారక్‌ ఆశించినంతగా హైలైట్ కాలేదు. ఇది బేసిగ్గా హిందీ సినిమా కావడం, హృతిక్ మెయిన్ లీడ్‌గా నటించడంతో అతణ్నే హైలైట్ చేస్తూ షాట్స్ పెట్టారు టీజర్లో. తారక్ కూడా తన ఉనికిని చాటుకున్నప్పటికీ అభిమానులైతే ఇంకా ఎక్కువ ఆశించారు.

ఐతే విశేషం ఏంటంటే.. నిమిషంన్నర నిడివి ఉన్న టీజర్లో హృతిక్, తారక్‌లకు దాదాపుగా ఒకే స్క్రీన్ టైం ఉండగా.. వారితో పోలిస్తే నామమాత్రంగా రెండు మూడు సెకన్లు మాత్రమే కనిపించిన హీరోయిన్ కియారా అద్వానీ ఎక్కువ హైలైట్ అయిపోయింది. కెరీర్లో తొలిసారిగా స్క్రీన్ మీద టూపీస్ బికినీలో కనిపించిన కియారా.. మామూలు హాట్‌గా లేదు. ఆమె ఎంత ఆకర్షణీయంగా ఉందంటే.. ఆ రెండు మూడు క్షణాల క్లిప్‌ను స్లోమోషన్, 4కే క్లారిటీలోకి మార్చుకుని ఆ క్లిప్స్‌ను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. కియారా ఇంత హాట్‌గా, సెక్సీగా మరే సినిమాలోనూ లేదని కామెంట్లు చేస్తున్నారు.

ముందు తారక్, హృతిక్‌ల గురించే ఎక్కువ మాట్లాడిన నెటిజన్లు క్రమంగా కియారా వైపు మళ్లిపోయారు. ఆమె పేరు సోషల్ మీడియాలో అంతగా ట్రెండ్ అయింది. ఐతే టీజర్లో చూపించింది కియారా ఒరిజినల్ లుక్కేనా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇందులో కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ టచ్ ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ కొందరు అదంతా ఒరిజినలే అని వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ‘వార్-2’లో కియారా గ్లామర్ ట్రీట్ ఒక రేంజిలో ఉంటుందనే సంకేతాలు మాత్రం టీజర్ ఇచ్చింది. వార్-2 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on May 21, 2025 2:56 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

1 hour ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago