నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘వార్-2’ టీజర్. దీనికి సందర్భం.. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. కానీ టీజర్ చూశాక తారక్ ఫ్యాన్స్లో అనుకున్నంత ఉత్సాహం కనిపించలేదు. టీజర్లో తారక్ ఆశించినంతగా హైలైట్ కాలేదు. ఇది బేసిగ్గా హిందీ సినిమా కావడం, హృతిక్ మెయిన్ లీడ్గా నటించడంతో అతణ్నే హైలైట్ చేస్తూ షాట్స్ పెట్టారు టీజర్లో. తారక్ కూడా తన ఉనికిని చాటుకున్నప్పటికీ అభిమానులైతే ఇంకా ఎక్కువ ఆశించారు.
ఐతే విశేషం ఏంటంటే.. నిమిషంన్నర నిడివి ఉన్న టీజర్లో హృతిక్, తారక్లకు దాదాపుగా ఒకే స్క్రీన్ టైం ఉండగా.. వారితో పోలిస్తే నామమాత్రంగా రెండు మూడు సెకన్లు మాత్రమే కనిపించిన హీరోయిన్ కియారా అద్వానీ ఎక్కువ హైలైట్ అయిపోయింది. కెరీర్లో తొలిసారిగా స్క్రీన్ మీద టూపీస్ బికినీలో కనిపించిన కియారా.. మామూలు హాట్గా లేదు. ఆమె ఎంత ఆకర్షణీయంగా ఉందంటే.. ఆ రెండు మూడు క్షణాల క్లిప్ను స్లోమోషన్, 4కే క్లారిటీలోకి మార్చుకుని ఆ క్లిప్స్ను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. కియారా ఇంత హాట్గా, సెక్సీగా మరే సినిమాలోనూ లేదని కామెంట్లు చేస్తున్నారు.
ముందు తారక్, హృతిక్ల గురించే ఎక్కువ మాట్లాడిన నెటిజన్లు క్రమంగా కియారా వైపు మళ్లిపోయారు. ఆమె పేరు సోషల్ మీడియాలో అంతగా ట్రెండ్ అయింది. ఐతే టీజర్లో చూపించింది కియారా ఒరిజినల్ లుక్కేనా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇందులో కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ టచ్ ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ కొందరు అదంతా ఒరిజినలే అని వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ‘వార్-2’లో కియారా గ్లామర్ ట్రీట్ ఒక రేంజిలో ఉంటుందనే సంకేతాలు మాత్రం టీజర్ ఇచ్చింది. వార్-2 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 21, 2025 2:56 pm
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…