నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘వార్-2’ టీజర్. దీనికి సందర్భం.. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. కానీ టీజర్ చూశాక తారక్ ఫ్యాన్స్లో అనుకున్నంత ఉత్సాహం కనిపించలేదు. టీజర్లో తారక్ ఆశించినంతగా హైలైట్ కాలేదు. ఇది బేసిగ్గా హిందీ సినిమా కావడం, హృతిక్ మెయిన్ లీడ్గా నటించడంతో అతణ్నే హైలైట్ చేస్తూ షాట్స్ పెట్టారు టీజర్లో. తారక్ కూడా తన ఉనికిని చాటుకున్నప్పటికీ అభిమానులైతే ఇంకా ఎక్కువ ఆశించారు.
ఐతే విశేషం ఏంటంటే.. నిమిషంన్నర నిడివి ఉన్న టీజర్లో హృతిక్, తారక్లకు దాదాపుగా ఒకే స్క్రీన్ టైం ఉండగా.. వారితో పోలిస్తే నామమాత్రంగా రెండు మూడు సెకన్లు మాత్రమే కనిపించిన హీరోయిన్ కియారా అద్వానీ ఎక్కువ హైలైట్ అయిపోయింది. కెరీర్లో తొలిసారిగా స్క్రీన్ మీద టూపీస్ బికినీలో కనిపించిన కియారా.. మామూలు హాట్గా లేదు. ఆమె ఎంత ఆకర్షణీయంగా ఉందంటే.. ఆ రెండు మూడు క్షణాల క్లిప్ను స్లోమోషన్, 4కే క్లారిటీలోకి మార్చుకుని ఆ క్లిప్స్ను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. కియారా ఇంత హాట్గా, సెక్సీగా మరే సినిమాలోనూ లేదని కామెంట్లు చేస్తున్నారు.
ముందు తారక్, హృతిక్ల గురించే ఎక్కువ మాట్లాడిన నెటిజన్లు క్రమంగా కియారా వైపు మళ్లిపోయారు. ఆమె పేరు సోషల్ మీడియాలో అంతగా ట్రెండ్ అయింది. ఐతే టీజర్లో చూపించింది కియారా ఒరిజినల్ లుక్కేనా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇందులో కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ టచ్ ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ కొందరు అదంతా ఒరిజినలే అని వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ‘వార్-2’లో కియారా గ్లామర్ ట్రీట్ ఒక రేంజిలో ఉంటుందనే సంకేతాలు మాత్రం టీజర్ ఇచ్చింది. వార్-2 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…