సాహో సినిమా విడుదలకు ముందే రాధే శ్యామ్ షూటింగ్ కొంతవరకు పూర్తి చేసారు. అయితే సాహో పరాజయం తర్వాత కథలో మార్పుచేర్పులు అవసరమని చాలా సమయం వృధా చేసారు. తీరా కొత్తగా రాసుకున్నది తీయడానికి వెళ్లేసరికి కరోనా బూచి భయపెట్టడంతో మిగిలిన సినిమాలతో పాటు దానిని కూడా ఆపేసారు.
లాక్డౌన్లో రాధేశ్యామ్ చిత్రాన్ని త్వరగా ముగించాలంటే ముందు తీసిన సీన్లు అలాగే వుంచేయాలని డిసైడ్ అయ్యారట. ఆ తర్వాత చేసిన మార్పు చేర్పులు పట్టించుకోకుండా ముందు అనుకున్న కథతో వెళ్లిపోతున్నారట. దీని వల్ల అప్పుడు తీసిన ఫుటేజీ ఏదీ వృధా అవదు కనుక షూటింగ్ త్వరగా పూర్తి చేసేయవచ్చునని భావించారట. అందుకే ఈ చిత్రం సమ్మర్ టైమ్కి రెడీ అయిపోతుందని ధీమాగా వున్నారు.
ఈ చిత్రాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్టులను ప్రభాస్ మొదలు పెట్టవచ్చు. రాధేశ్యామ్ని చెక్కడం మీద ఫోకస్ చేయకుండా ముందు షూటింగ్ పార్ట్ ఫినిష్ చేయడంపై ప్రభాస్ దృష్టి పెట్టాడు. ఇటలీ నుంచి తిరిగి వచ్చిన చిత్ర బృందం తరువాతిషెడ్యూల్ ఇక్కడే పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
This post was last modified on November 7, 2020 4:30 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…