సాహో సినిమా విడుదలకు ముందే రాధే శ్యామ్ షూటింగ్ కొంతవరకు పూర్తి చేసారు. అయితే సాహో పరాజయం తర్వాత కథలో మార్పుచేర్పులు అవసరమని చాలా సమయం వృధా చేసారు. తీరా కొత్తగా రాసుకున్నది తీయడానికి వెళ్లేసరికి కరోనా బూచి భయపెట్టడంతో మిగిలిన సినిమాలతో పాటు దానిని కూడా ఆపేసారు.
లాక్డౌన్లో రాధేశ్యామ్ చిత్రాన్ని త్వరగా ముగించాలంటే ముందు తీసిన సీన్లు అలాగే వుంచేయాలని డిసైడ్ అయ్యారట. ఆ తర్వాత చేసిన మార్పు చేర్పులు పట్టించుకోకుండా ముందు అనుకున్న కథతో వెళ్లిపోతున్నారట. దీని వల్ల అప్పుడు తీసిన ఫుటేజీ ఏదీ వృధా అవదు కనుక షూటింగ్ త్వరగా పూర్తి చేసేయవచ్చునని భావించారట. అందుకే ఈ చిత్రం సమ్మర్ టైమ్కి రెడీ అయిపోతుందని ధీమాగా వున్నారు.
ఈ చిత్రాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్టులను ప్రభాస్ మొదలు పెట్టవచ్చు. రాధేశ్యామ్ని చెక్కడం మీద ఫోకస్ చేయకుండా ముందు షూటింగ్ పార్ట్ ఫినిష్ చేయడంపై ప్రభాస్ దృష్టి పెట్టాడు. ఇటలీ నుంచి తిరిగి వచ్చిన చిత్ర బృందం తరువాతిషెడ్యూల్ ఇక్కడే పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
This post was last modified on November 7, 2020 4:30 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…