కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవంలో ఎక్కువ ప్రయోజనం పొందిన ఇండస్ట్రీ అంటే మాలీవుడ్ అనే చెప్పాలి. ఎప్పట్నుంచో గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నప్పటికీ.. మలయాళం ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది, అక్కడి సినిమాల విలువ అందరికీ తెలిసిందీ కరోనా తర్వాతే. భాషా భేదం లేకుండా అందరూ మలయాళ సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు మలయాళ హీరోలు ఓటీటీల ద్వారానే వేరే భాషల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు.
తెలుగులో అలా ఆదరణ పెంచుకున్న హీరోల్లో ముందు వరుసగా టొవినో థామస్ పేరు చెప్పుకోవాలి. ఆహా సహా పలు ఓటీటీల ద్వారా అతడి సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. కేవలం ఓటీటీ సినిమాలతోనే అతను ఇక్కడ మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు. 2018, ఏఆర్ఎం లాంటి సినిమాలకు థియేటర్లలోనూ ఆదరణ దక్కడానికి ఈ ఫాలోయింగే కారణం. ఐతే ఈ మధ్య టొవినో జోరు కొంచెం తగ్గింది. ఆ సమయంలో మరో మలయాళ స్టార్ తెలుగులో సూపర్ ఫాలోయింగ్ సంపాదించాడు. అతనే.. బాసిల్ జోసెఫ్.
తెలుగులో ఈ మధ్య బంపర్ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ హీరోగా బాసిల్ జోసెఫ్ పేరే చెప్పుకోవాలి. జయ జయ జయ జయహే, నూనాక్కుళి, సూక్ష్మ దర్శిని, గురువాయూర్ అంబలనదాయిల్, ప్రవిన్కుడు షాపు.. ఇలా పలు చిత్రాలతో బాసిల్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. ఈ మధ్యే వచ్చిన పొన్ మ్యాన్ అతడి ఫాలోయింగ్ను ఇంకా పెంచింది. లేటెస్ట్గా ‘మరణ మాస్’ అనే బ్లాక్ కామెడీతో అతను ఆకట్టుకుంటున్నాడు.
బాసిల్ ఎంచుకునే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు, అతడి నటన మన వాళ్లకు తెగ నచ్చేస్తున్నాయి. అతనో సినిమా చేశాడు అంటే అది చాలా స్పెషల్గా ఉంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో బలపడుతోంది. ఎక్కువగా బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలు చేసే బాసిల్తో మన వాళ్లు బాగా కనెక్ట్ అవుతున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా అతను బాగా పండిస్తున్నాడు. తన సినిమాలన్నీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటున్నాయి. తెలుగు ఓటీటీల్లో అతనో స్టార్గా ఎదిగిపోయాడు అంటే అతిశయోక్తి కాదు. విశేషం ఏంటంటే.. బాసిల్ మంచి అభిరుచి ఉన్న దర్శకుడు కూడా. ‘మిన్నల్ మురళి’ సహా మూడు సినిమాలు తీశాడు. తెలుగువాళ్లు దత్తపుత్రుడిగా భావించే సూర్యతో అతను త్వరలోనే సినిమా తీయబోతుండడం విశేషం.
This post was last modified on May 20, 2025 11:20 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…