Movie News

ట్రోల్ మెటీరియల్‌గా మారిన కలెక్షన్ల పోస్టర్

ఈ రోజుల్లో చిత్ర బృందాలు ఒరిజినల్ కలెక్షన్లను పోస్టర్ మీద వేయడం అన్నది చాలా చాలా అరుదు. పోస్టర్ల మీద కనిపించే ఫిగర్లను 20-30 శాతం తగ్గించుకుని లెక్కలు వేసుకుంటూ ఉంటారు అభిమానులు. కొన్ని సందర్భాల్లో 40-50 శాతం కలెక్షన్లను పెంచి పోస్టర్ల మీద వేస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఈ సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ సినిమాకు తొలి రోజు ప్రకటించిన వసూళ్ల లెక్కలపై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. మొత్తం థియేట్రికల్ రన్ అయ్యేసరికి కూడా అంత వసూళ్లు రాలేదనే విమర్శలు వచ్చాయి.

ఇంకా చాలా సినిమాల కలెక్షన్ల పోస్టర్ల మీద గొడవ జరిగింది. అభిమానుల కోసం కలెక్షన్లను పెంచి చూపిస్తామని స్వయంగా నిర్మాతలే ప్రకటిస్తున్నపుడు ఈ వసూళ్ల లెక్కలను ఎలా నమ్ముతారు ఎవరైనా? రోజు రోజుకూ ఈ విషయంలో క్రెడిబిలిటీ దెబ్బ తింటున్నా సరే.. నిర్మాతలు మారట్లేదు. తాజాగా తమిళ స్టార్ సూర్య కొత్త చిత్రం ‘రెట్రో’కు సంబంధించి అతడి సొంత నిర్మాణ సంస్థ ‘2డీ ఎంటర్టైన్మెంట్స్’ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.235 కోట్ల ఆదాయం రాబట్టినట్లు ప్రకటించేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ మెటీరియల్‌గా మారిపోయింది.

‘రెట్రో’ థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయింది. ఆ సినిమా వంద కోట్ల వసూళ్లు కూడా సాధించలేదన్నది ట్రేడ్ వర్గాల మాట. మరి రూ.235 కోట్లేంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఐతే పోస్టర్ మీద చిన్న అక్షరాల్లో నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చిన ఆదాయం కూడా కలిపితే ఈ నంబర్ అని డిస్క్లైమర్ వేశారు. కానీ పెద్ద అక్షరాల్లో కలెక్షన్ల ఫిగర్ వేసి.. షరతులు వర్తించును అన్నట్లుగా ఓ మూల చిన్న అక్షరాల్లో పెట్టడం ఏంటి అంటూ సూర్య అండ్ కోను విమర్శిస్తున్నారు నెటిజన్లు. నాన్ థియేట్రికల్ ఆదాయం కలిపినా కూడా ఈ సినిమా అంత ఆదాయం రాబట్టింది అనడం ఎగ్జాజరేషనే అని.. థియేట్రికల్ రన్ ముగిసిన దశలో ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేసి పరువు పోగొట్టుకోవడం తప్ప సాధించేదీ ఏమీ లేదని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

This post was last modified on May 19, 2025 2:09 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 minute ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

6 hours ago