థగ్ లైఫ్.. కమల్ హాసన్-మణిరత్నంల లెజెండరీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం. ‘నాయకుడు’ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ నుంచి ఇన్నేళ్ల తర్వాత వస్తున్న సినిమా అయినా సరే.. దీనికి కొన్ని రోజుల ముందు వరకు పెద్దగా హైప్ లేదు. కమల్ సినిమాలు బాగా తగ్గించేయడం.. మణిరత్నం ఫామ్లో లేకపోవడం.. సినిమాను సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్ల బజ్ క్రియేట్ కాలేదు. తమిళంలో అయినా పర్వాలేదు కానీ.. తెలుగులో ఈ సినిమా పట్ల ఆసక్తి అంతంతమాత్రంగానే కనిపించింది.
కానీ నిన్న పెద్ద అంచనాలు లేకుండా విడుదలైన ‘థగ్ లైఫ్’ ట్రైలర్ మొత్తం కథను మార్చేసింది. ఇప్పటిదాకా ఈ సినిమా కథేంటో చిన్న ఐడియా కూడా లేని ప్రేక్షకులకు.. అనేక సర్ప్రైజింగ్ అంశాలతో మంచి ట్రీట్ ఇవ్వబోతున్న సంకేతాలు ఇచ్చింది మణిరత్నం టీం. కమల్ హాసన్-శింబుల ఫేసాఫే సినిమాకు మేజర్ హైలైట్గా నిలిచేలా ఉంది. జోజు జార్జ్, నాజర్ లాంటి మేటి నటుల పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా అనిపించాయి. మన ప్రేక్షకులకు పరిచయమున్న గ్యాంగ్స్టర్ డ్రామాకే మణిరత్నం తన మార్కు ట్రీట్మెంట్ ఇచ్చినట్లున్నాడు. ట్రైలర్లో ప్రతి షాట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది.
అన్నింటికీ మించి కమల్ హాసన్.. అభిరామి, త్రిషలతో చేసిన రొమాన్స్ ట్రైలర్ వైరల్ కావడానికి దోహదం చేసింది. దీని గురించి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. వీటి మీద వస్తున్న నెగెటివ్ కామెంట్లు కూడా సినిమా ప్రచారానికి బాగానే ఉపయోగపడుతున్నాయి. చాలా ఏళ్ల నుంచి జనరంజకమైన సినిమాలు తీయట్లేదని విమర్శలు ఎదుర్కొంటున్న మణిరత్నం.. ఈ చిత్రంతో పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంటాడనే అంచనాలు ఏర్పడుతున్నాయి. వేసవిలో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో వస్తున్న చిత్రం కావడంతో అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి.
This post was last modified on May 19, 2025 12:07 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…