Movie News

ఆయ్ హీరో మొదటి సినిమా ఇప్పుడొస్తోంది

జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీకి వచ్చినా బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్లతో బాగానే దూసుకుపోతున్న హీరో నితిన్ నార్నె ఇటీవలే శ్రీవిష్ణు సింగిల్ లో చిన్న క్యామియో చేశాడు. అయితే ఇప్పటిదాకా నితిన్ నార్నె డెబ్యూ మూవీ రిలీజ్ కాలేదంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. శ్రీశ్రీశ్రీ రాజావారు పేరుతో రూపొందిన లవ్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ జూన్ రెండో వారంలో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందట. దీని ట్రైలర్ చాలా కాలం క్రితమే వచ్చింది. కొంచెం అటుఇటుగా రెండేళ్ల ముందే షూటింగ్ అయిపోయింది. కానీ రకరకాల కారణాల వాయిదా పడుతూ చివరికి మోక్షం దక్కించుకోనుందట.

అలాని ఇదేదో అనుభవం లేని డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమా కాదు. శతమానం భవతి లాంటి నేషనల్ అవార్డు ఫ్యామిలీ మూవీ ఇచ్చిన సతీష్ వేగ్నేశ దర్శకుడు. ఇంత బ్రాండింగ్ ఉండి కూడా శ్రీశ్రీశ్రీ రాజావారు లేట్ కావడం ఆశ్చర్యమే. మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ మూడు విజయవంతమయ్యాక నితిన్ నార్నెకు బాగానే మార్కెట్ పెరిగింది. వాటి సక్సెస్ లో తనది సోలో క్రెడిట్ కాకపోయినా ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు. కాకపోతే డెబ్యూ మూవీ ఇంత ఆలస్యం రావడం బిజినెస్ పరంగా నిర్మాతకు ఉపయోగపడుతుందేమో కానీ హీరోగా నితిన్ నార్నెకు దక్కే అడ్వాంటేజ్ తక్కువేనని చెప్పాలి టాక్ ఎక్స్ ట్రాడినరిగా వస్తే తప్ప.

గతంలో విజయ్ దేవరకొండ, నిఖిల్ లాంటి యూత్ హీరోలు సైతం ఈ సమస్యను ఎదురుకున్నారు. ఒక బ్లాక్ బస్టర్ రాగానే ల్యాబ్ లో రిలీజ్ ఆగిపోయిన సినిమాలు తీసుకొచ్చి రిలీజ్ చేయడం జరిగింది. అవి ఆడకపోవడం వేరే సంగతి. ఇప్పుడు నితిన్ నార్నెకి గుర్తింపు వచ్చింది కాబట్టి థియేటర్ బిజినెస్ జరగొచ్చు కానీ మారిన ఇమేజ్ దృష్ట్యా ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అసలే మాస్ టచ్ జోడించిన సినిమా. నార్నె చేసినవాటిలో ఇప్పటిదాకా అన్నీ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లే. పైగా మూడు శ్రీలతో రాజావారు అని టైటిల్ పెట్టడం కూడా మాస్ ని టార్గెట్ చేసినట్టు ఉంది. చూడాలి ఏమవుతుందో.

This post was last modified on May 18, 2025 4:24 pm

Share
Show comments
Published by
Kumar
Tags: narne nithin

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

4 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

7 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

7 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

8 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

8 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

10 hours ago