ప్రభాస్ సినిమా అంటే యాక్షన్ మోత మోగిపోవాల్సిందే. మొదట్నుంచి అతను యాక్షన్ ప్రధానమైన సినిమాలే చేస్తూ వస్తున్నాడు. బాహుబలితో తిరుగులేని మాస్ హీరోగా ఎదిగాక ప్రభాస్ నుంచి యాక్షన్ మోతాదు మరింత ఆశిస్తున్నారు ప్రేక్షకులు. సాహోను ప్రేక్షకుల కోరుకున్నట్లే పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా మలచగా.. కథాకథనాల్లో లోపాల వల్ల ఆ సినిమా ఆడలేదు.
ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సంగతి చూస్తే పూర్తి క్లాస్గా కనిపిస్తోంది. ముందు నుంచి ఇది పూర్తి స్థాయి ప్రేమకథ అనే సంకేతాలే ఇస్తోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో ఇందులో యాక్షన్ సంగతేంటి అన్న సందేహాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఐతే వారికి ఈ విషయంలో మరింత స్పష్టత ఇచ్చేశాడు ప్రభాస్.
కరోనా అనంతరం రాధేశ్యామ్ చిత్రీకరణ ఇటలీలో సాగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడి మీడియా ప్రభాస్ను ఇంటర్వ్యూలు చేయడం విశేషం. ఆ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రాధేశ్యామ్ జానర్ గురించి ప్రభాస్ మాట్లాడాడు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ అని చెప్పాడు. సినిమాలో ఒకే ఒక్క యాక్షన్ బ్లాక్ ఉందని కూడా అతను వెల్లడించాడు. అది మినహాయిస్తే సినిమా అంతా ప్రేమ కథ చుట్టూనే నడుస్తుందన్నాడు.
దీన్ని బట్టి సినిమాలో భావోద్వేగాలు ప్రధానం తప్ప హీరో ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలకు పెద్దగా అవకాశం లేదని స్పష్టమవుతోంది. అభిమానులు నిరాశ చెందకుండా వాళ్లను ముందు నుంచే ప్రభాస్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా టీజర్, ట్రైలర్ వచ్చాక ఈ విషయంలో మరింత స్పష్టత రావచ్చు. రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవికి విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on November 7, 2020 8:52 am
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…