ప్రభాస్ సినిమా అంటే యాక్షన్ మోత మోగిపోవాల్సిందే. మొదట్నుంచి అతను యాక్షన్ ప్రధానమైన సినిమాలే చేస్తూ వస్తున్నాడు. బాహుబలితో తిరుగులేని మాస్ హీరోగా ఎదిగాక ప్రభాస్ నుంచి యాక్షన్ మోతాదు మరింత ఆశిస్తున్నారు ప్రేక్షకులు. సాహోను ప్రేక్షకుల కోరుకున్నట్లే పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా మలచగా.. కథాకథనాల్లో లోపాల వల్ల ఆ సినిమా ఆడలేదు.
ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సంగతి చూస్తే పూర్తి క్లాస్గా కనిపిస్తోంది. ముందు నుంచి ఇది పూర్తి స్థాయి ప్రేమకథ అనే సంకేతాలే ఇస్తోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో ఇందులో యాక్షన్ సంగతేంటి అన్న సందేహాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఐతే వారికి ఈ విషయంలో మరింత స్పష్టత ఇచ్చేశాడు ప్రభాస్.
కరోనా అనంతరం రాధేశ్యామ్ చిత్రీకరణ ఇటలీలో సాగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడి మీడియా ప్రభాస్ను ఇంటర్వ్యూలు చేయడం విశేషం. ఆ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రాధేశ్యామ్ జానర్ గురించి ప్రభాస్ మాట్లాడాడు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ అని చెప్పాడు. సినిమాలో ఒకే ఒక్క యాక్షన్ బ్లాక్ ఉందని కూడా అతను వెల్లడించాడు. అది మినహాయిస్తే సినిమా అంతా ప్రేమ కథ చుట్టూనే నడుస్తుందన్నాడు.
దీన్ని బట్టి సినిమాలో భావోద్వేగాలు ప్రధానం తప్ప హీరో ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలకు పెద్దగా అవకాశం లేదని స్పష్టమవుతోంది. అభిమానులు నిరాశ చెందకుండా వాళ్లను ముందు నుంచే ప్రభాస్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా టీజర్, ట్రైలర్ వచ్చాక ఈ విషయంలో మరింత స్పష్టత రావచ్చు. రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవికి విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on November 7, 2020 8:52 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…