Movie News

మోహ‌న్ లాల్‌కు సెల్యూట్ చేయాల్సిందే

భాష ఏదైనా స‌రే ఆ ఇండ‌స్ట్రీ టాప్ స్టార్ల‌లో ఒక‌డైన హీరో సినిమా షూటింగ్ అంటే ఉండే హంగామానే వేరుగా ఉంటుంది. పెద్ద ఎత్తున కాస్ట్ అండ్ క్రూ ఇన్వాల్వ్ అవుతుంది. లొకేష‌న్లు, సెట్లు, ఇత‌ర‌ ప్రాప‌ర్టీస్ అంతా కూడా ఒక రేంజిలో ఉంటుంది. జూనియ‌ర్ ఆర్టిస్టుల హంగామాకూ కొద‌వుండ‌దు. ఇంత‌మందితో డీల్ చేస్తూ చిత్రీక‌ర‌ణ సాగించాలంటే మామూలు విష‌యం కాదు.

క‌థ ప‌రంగా కూడా భారీత‌నం ఉంటుంది కాబ‌ట్టి వ‌ర్కింగ్ డేస్ చాలా అవుతాయి. ఎంత వేగంగా చేసినా మూణ్నాలుగు నెల‌ల పాటు చిత్రీక‌ర‌ణ చేయాల్సి ఉంటుంది. అలాంటిది మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్‌ను హీరోగా పెట్టి క‌రోనా ష‌ర‌తుల మ‌ధ్య షూటింగ్ చేస్తూ కేవ‌లం 40 రోజుల్లో ఒక సినిమాను పూర్తి చేశారంటే షాక‌వ్వాల్సిందే.

ఏడేళ్ల కింద‌ట వ‌చ్చిన మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ దృశ్యంకు సీక్వెల్‌గా దృశ్యం-2ను సెప్టెంబ‌రు 25న ఆరంభించింది చిత్ర బృందం. మ‌ధ్య‌లో ఎన్ని రోజులు విరామం తీసుకున్నారో ఏమో కానీ.. న‌వంబ‌రు 6వ తారీఖున టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసింది దృశ్యం టీం. క‌రోనా టైంలో ఒక పెద్ద స్టార్ సినిమా ఇంత వేగంగా పూర్తి కావ‌డం అనూహ్యం. వివిధ భాష‌ల‌కు చెందిన స్టార్లంద‌రూ మోహ‌న్ లాల్ అండ్ టీంను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

దృశ్యంతో సంచ‌ల‌నం సృష్టించిన యే ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. లాల్‌కు జోడీగా ఇందులోనూ మీనానే భార్య పాత్ర పోషించింది. దృశ్యంలో చేసిన చిన్న‌మ్మాయి ఇందులోనూ న‌టించింది. పెద్ద‌మ్మాయి పాత్ర‌ను వేరే న‌టి పోషించింది. మ‌రి మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయి దేశవ్యాప్తంగా వివిధ భాష‌ల్లో రీమేక్ అక్క‌డా సంచ‌ల‌నం రేపిన దృశ్యంకు కొన‌సాగింపుగా వ‌స్తున్న సినిమా ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.

This post was last modified on November 7, 2020 8:50 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

6 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

7 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

8 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

8 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

9 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

11 hours ago