భాష ఏదైనా సరే ఆ ఇండస్ట్రీ టాప్ స్టార్లలో ఒకడైన హీరో సినిమా షూటింగ్ అంటే ఉండే హంగామానే వేరుగా ఉంటుంది. పెద్ద ఎత్తున కాస్ట్ అండ్ క్రూ ఇన్వాల్వ్ అవుతుంది. లొకేషన్లు, సెట్లు, ఇతర ప్రాపర్టీస్ అంతా కూడా ఒక రేంజిలో ఉంటుంది. జూనియర్ ఆర్టిస్టుల హంగామాకూ కొదవుండదు. ఇంతమందితో డీల్ చేస్తూ చిత్రీకరణ సాగించాలంటే మామూలు విషయం కాదు.
కథ పరంగా కూడా భారీతనం ఉంటుంది కాబట్టి వర్కింగ్ డేస్ చాలా అవుతాయి. ఎంత వేగంగా చేసినా మూణ్నాలుగు నెలల పాటు చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది. అలాంటిది మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ను హీరోగా పెట్టి కరోనా షరతుల మధ్య షూటింగ్ చేస్తూ కేవలం 40 రోజుల్లో ఒక సినిమాను పూర్తి చేశారంటే షాకవ్వాల్సిందే.
ఏడేళ్ల కిందట వచ్చిన మలయాళ బ్లాక్బస్టర్ మూవీ దృశ్యంకు సీక్వెల్గా దృశ్యం-2ను సెప్టెంబరు 25న ఆరంభించింది చిత్ర బృందం. మధ్యలో ఎన్ని రోజులు విరామం తీసుకున్నారో ఏమో కానీ.. నవంబరు 6వ తారీఖున టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసింది దృశ్యం టీం. కరోనా టైంలో ఒక పెద్ద స్టార్ సినిమా ఇంత వేగంగా పూర్తి కావడం అనూహ్యం. వివిధ భాషలకు చెందిన స్టార్లందరూ మోహన్ లాల్ అండ్ టీంను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.
దృశ్యంతో సంచలనం సృష్టించిన యే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లాల్కు జోడీగా ఇందులోనూ మీనానే భార్య పాత్ర పోషించింది. దృశ్యంలో చేసిన చిన్నమ్మాయి ఇందులోనూ నటించింది. పెద్దమ్మాయి పాత్రను వేరే నటి పోషించింది. మరి మలయాళంలో బ్లాక్బస్టర్ అయి దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రీమేక్ అక్కడా సంచలనం రేపిన దృశ్యంకు కొనసాగింపుగా వస్తున్న సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
This post was last modified on November 7, 2020 8:50 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…