భాష ఏదైనా సరే ఆ ఇండస్ట్రీ టాప్ స్టార్లలో ఒకడైన హీరో సినిమా షూటింగ్ అంటే ఉండే హంగామానే వేరుగా ఉంటుంది. పెద్ద ఎత్తున కాస్ట్ అండ్ క్రూ ఇన్వాల్వ్ అవుతుంది. లొకేషన్లు, సెట్లు, ఇతర ప్రాపర్టీస్ అంతా కూడా ఒక రేంజిలో ఉంటుంది. జూనియర్ ఆర్టిస్టుల హంగామాకూ కొదవుండదు. ఇంతమందితో డీల్ చేస్తూ చిత్రీకరణ సాగించాలంటే మామూలు విషయం కాదు.
కథ పరంగా కూడా భారీతనం ఉంటుంది కాబట్టి వర్కింగ్ డేస్ చాలా అవుతాయి. ఎంత వేగంగా చేసినా మూణ్నాలుగు నెలల పాటు చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది. అలాంటిది మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ను హీరోగా పెట్టి కరోనా షరతుల మధ్య షూటింగ్ చేస్తూ కేవలం 40 రోజుల్లో ఒక సినిమాను పూర్తి చేశారంటే షాకవ్వాల్సిందే.
ఏడేళ్ల కిందట వచ్చిన మలయాళ బ్లాక్బస్టర్ మూవీ దృశ్యంకు సీక్వెల్గా దృశ్యం-2ను సెప్టెంబరు 25న ఆరంభించింది చిత్ర బృందం. మధ్యలో ఎన్ని రోజులు విరామం తీసుకున్నారో ఏమో కానీ.. నవంబరు 6వ తారీఖున టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసింది దృశ్యం టీం. కరోనా టైంలో ఒక పెద్ద స్టార్ సినిమా ఇంత వేగంగా పూర్తి కావడం అనూహ్యం. వివిధ భాషలకు చెందిన స్టార్లందరూ మోహన్ లాల్ అండ్ టీంను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.
దృశ్యంతో సంచలనం సృష్టించిన యే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లాల్కు జోడీగా ఇందులోనూ మీనానే భార్య పాత్ర పోషించింది. దృశ్యంలో చేసిన చిన్నమ్మాయి ఇందులోనూ నటించింది. పెద్దమ్మాయి పాత్రను వేరే నటి పోషించింది. మరి మలయాళంలో బ్లాక్బస్టర్ అయి దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రీమేక్ అక్కడా సంచలనం రేపిన దృశ్యంకు కొనసాగింపుగా వస్తున్న సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
This post was last modified on November 7, 2020 8:50 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…