భాష ఏదైనా సరే ఆ ఇండస్ట్రీ టాప్ స్టార్లలో ఒకడైన హీరో సినిమా షూటింగ్ అంటే ఉండే హంగామానే వేరుగా ఉంటుంది. పెద్ద ఎత్తున కాస్ట్ అండ్ క్రూ ఇన్వాల్వ్ అవుతుంది. లొకేషన్లు, సెట్లు, ఇతర ప్రాపర్టీస్ అంతా కూడా ఒక రేంజిలో ఉంటుంది. జూనియర్ ఆర్టిస్టుల హంగామాకూ కొదవుండదు. ఇంతమందితో డీల్ చేస్తూ చిత్రీకరణ సాగించాలంటే మామూలు విషయం కాదు.
కథ పరంగా కూడా భారీతనం ఉంటుంది కాబట్టి వర్కింగ్ డేస్ చాలా అవుతాయి. ఎంత వేగంగా చేసినా మూణ్నాలుగు నెలల పాటు చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది. అలాంటిది మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ను హీరోగా పెట్టి కరోనా షరతుల మధ్య షూటింగ్ చేస్తూ కేవలం 40 రోజుల్లో ఒక సినిమాను పూర్తి చేశారంటే షాకవ్వాల్సిందే.
ఏడేళ్ల కిందట వచ్చిన మలయాళ బ్లాక్బస్టర్ మూవీ దృశ్యంకు సీక్వెల్గా దృశ్యం-2ను సెప్టెంబరు 25న ఆరంభించింది చిత్ర బృందం. మధ్యలో ఎన్ని రోజులు విరామం తీసుకున్నారో ఏమో కానీ.. నవంబరు 6వ తారీఖున టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసింది దృశ్యం టీం. కరోనా టైంలో ఒక పెద్ద స్టార్ సినిమా ఇంత వేగంగా పూర్తి కావడం అనూహ్యం. వివిధ భాషలకు చెందిన స్టార్లందరూ మోహన్ లాల్ అండ్ టీంను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.
దృశ్యంతో సంచలనం సృష్టించిన యే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లాల్కు జోడీగా ఇందులోనూ మీనానే భార్య పాత్ర పోషించింది. దృశ్యంలో చేసిన చిన్నమ్మాయి ఇందులోనూ నటించింది. పెద్దమ్మాయి పాత్రను వేరే నటి పోషించింది. మరి మలయాళంలో బ్లాక్బస్టర్ అయి దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రీమేక్ అక్కడా సంచలనం రేపిన దృశ్యంకు కొనసాగింపుగా వస్తున్న సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
This post was last modified on November 7, 2020 8:50 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…