Movie News

తారక్ పుట్టినరోజు వైపు బాలీవుడ్ చూపు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. సంబరాలకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. యమదొంగ రీ రిలీజ్ తో పాటు కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి బాలీవుడ్ చూపు తారక్ బర్త్ డే మీద ఉంది. కారణం వార్ 2. ఇప్పటిదాకా ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రమోషన్ జరగలేదు. వీడియో మాట దేవుడెరుగు కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ ఎలా ఉంటాయనే క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో వార్ 2 బృందం మొదటి పబ్లిసిటీ కంటెంట్ ని వదలబోతోంది. అందుకే అందరి దృష్టి దీని మీదే ఉంది.

ప్రత్యేకంగా బాలీవుడ్ గురించి ప్రస్తావించడానికి కారణముంది. యానిమల్, జవాన్, పఠాన్, చావా తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అయిదు వందల కోట్ల వసూళ్లు దాటించిన సినిమా హిందీలో రాలేదు. అందులోనూ ఈ ఏడాదిలో ఒకటి రెండు తప్ప బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ అయిన బాలీవుడ్ మూవీస్ లేవు. కనీసం రెండు మూడు వారాలు థియేటర్లు కిక్కిరిసిపోయేలా చేసిన సినిమా కనీసం నెలకొకటి రాకపోవడం ట్రేడ్ మీద ప్రభావం చూపిస్తోంది. అందుకే వార్ 2 మీద ఈ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. టీజర్ వస్తుందా పోస్టర్ వదులుతారా క్లారిటీ ఇంకా లేదు కానీ ఏదో ఒకటి సెన్సేషనవ్వాలనేది ఫ్యాన్స్ కోరిక.

ఒకవైపు ఆగస్ట్ 14నే వార్ 2కి పోటీగా వస్తున్న కూలి ప్రమోషన్లు ఊపందుకున్నాయి. చిన్న చిన్న వీడియోలతోనే దర్శకుడు లోకేష్ కనగరాజ్ పెంచుతున్న బజ్ అంతా ఇంతా కాదు. ఉదాహరణకు వెనుక నుంచి వదిలిన నాగార్జున బ్యాక్ షాట్ సోషల్ మీడియాని రెండు రోజులు ఊపేసింది. ఒక పాట ప్రోమో వదిలారు. అందరి లుక్స్ కి సంబంధించిన పోస్టర్స్ వచ్చేశాయి. ట్రైలర్ కూడా త్వరలోనే రానుంది. ఇలా పోల్చుకుంటే మార్కెటింగ్ ప్లాన్ లో వార్ 2 వెనుకబడిన మాట వాస్తవం. దానికి చెక్ పెట్టేలా మే 20 వచ్చేది ఏదైనా సింప్లి సూపర్బ్ అనిపించుకోవాలి. దర్శకుడు అయాన్ ముఖర్జీ అలాంటిదే ఇస్తాడని అభిమానుల నమ్మకం.

This post was last modified on May 16, 2025 12:09 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jr NTRWar 2

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago