ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో భారీ క్యాస్టింగ్ లేకుండా తీసిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు ప్రేక్షకులు థియేటర్లలో మంచి ఆదరణ అందించారు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక ప్యాన్ ఇండియా మూవీ చావాకు పోటీ ఇచ్చే స్థాయిలో ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకోవడం మాములు విషయం కాదు. దర్శకుడు రామ్ జగదీశ్ తీసుకున్న కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేసిన తీరు, న్యాయస్థానంలో జరిగే అన్యాయాన్ని విసిగించకుండా చెప్పిన విధానం ఇతర బాషల స్టార్లను సైతం మెప్పించి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించేలా చేసింది.
ఇప్పుడు రామ్ జగదీశ్ రెండో సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. నానినే రెండో మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు కోర్ట్ షూటింగ్ టైంలోనే అగ్రిమెంట్ చేసుకున్నారట. నాని ఇలా కమిట్ కావడం అరుదు. శైలేష్ కొలను తర్వాత రామ్ జగదీశ్ కే ఇలాంటి ఆఫర్ దక్కింది. దుల్కర్ సల్మాన్ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక స్టోరీ సిద్ధమైనట్టు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు కానీ ప్రాధమికంగా జరిగిన చర్చల్లో దాదాపుగా అంగీకారం జరిగినట్టు వినికిడి. ఫైనల్ స్క్రిప్ట్ లాకయ్యాక అధికారిక ప్రకటన ఇచ్చే సూచనలున్నాయి.
రెండో సినిమాకే ఇంత ప్రమోషన్ అందుకున్న రామ్ జగదీశ్ దీన్ని సరిగ్గా వాడుకుంటే టాప్ లీగ్ లోకి చేరిపోవచ్చు. ఎందుకంటే నాన్ కమర్షియల్ కంటెంట్ తోనే అంత పెద్ద హిట్టు కొట్టినప్పుడు బడ్జెట్, స్టార్ దొరికితే ఇంకే స్థాయిలో వాడుకోవాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్ణయం ఇంకో వారం పది రోజుల్లో జరగొచ్చు. ది ప్యారడైజ్ కోసం మేకోవర్ అవుతున్న నాని దాని సెట్స్ లో వచ్చే నెల నుంచి అడుగు పెట్టబోతున్నాడు. అప్పటిదాకా శ్రీకాంత్ ఓదెల చైల్డ్ హుడ్ ఎపిసోడ్ తో పాటు నాని అవసరం లేని మిగిలిన టాకీ పార్ట్ ని పూర్తి చేస్తాడు. రామ్ జగదీశ్ సైతం నానిని డైరెక్ట్ చేయాలనే టార్గెట్ తో ఉన్నాడట.
This post was last modified on May 14, 2025 3:11 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…