ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో భారీ క్యాస్టింగ్ లేకుండా తీసిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు ప్రేక్షకులు థియేటర్లలో మంచి ఆదరణ అందించారు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక ప్యాన్ ఇండియా మూవీ చావాకు పోటీ ఇచ్చే స్థాయిలో ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకోవడం మాములు విషయం కాదు. దర్శకుడు రామ్ జగదీశ్ తీసుకున్న కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేసిన తీరు, న్యాయస్థానంలో జరిగే అన్యాయాన్ని విసిగించకుండా చెప్పిన విధానం ఇతర బాషల స్టార్లను సైతం మెప్పించి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించేలా చేసింది.
ఇప్పుడు రామ్ జగదీశ్ రెండో సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. నానినే రెండో మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు కోర్ట్ షూటింగ్ టైంలోనే అగ్రిమెంట్ చేసుకున్నారట. నాని ఇలా కమిట్ కావడం అరుదు. శైలేష్ కొలను తర్వాత రామ్ జగదీశ్ కే ఇలాంటి ఆఫర్ దక్కింది. దుల్కర్ సల్మాన్ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక స్టోరీ సిద్ధమైనట్టు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు కానీ ప్రాధమికంగా జరిగిన చర్చల్లో దాదాపుగా అంగీకారం జరిగినట్టు వినికిడి. ఫైనల్ స్క్రిప్ట్ లాకయ్యాక అధికారిక ప్రకటన ఇచ్చే సూచనలున్నాయి.
రెండో సినిమాకే ఇంత ప్రమోషన్ అందుకున్న రామ్ జగదీశ్ దీన్ని సరిగ్గా వాడుకుంటే టాప్ లీగ్ లోకి చేరిపోవచ్చు. ఎందుకంటే నాన్ కమర్షియల్ కంటెంట్ తోనే అంత పెద్ద హిట్టు కొట్టినప్పుడు బడ్జెట్, స్టార్ దొరికితే ఇంకే స్థాయిలో వాడుకోవాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్ణయం ఇంకో వారం పది రోజుల్లో జరగొచ్చు. ది ప్యారడైజ్ కోసం మేకోవర్ అవుతున్న నాని దాని సెట్స్ లో వచ్చే నెల నుంచి అడుగు పెట్టబోతున్నాడు. అప్పటిదాకా శ్రీకాంత్ ఓదెల చైల్డ్ హుడ్ ఎపిసోడ్ తో పాటు నాని అవసరం లేని మిగిలిన టాకీ పార్ట్ ని పూర్తి చేస్తాడు. రామ్ జగదీశ్ సైతం నానిని డైరెక్ట్ చేయాలనే టార్గెట్ తో ఉన్నాడట.
This post was last modified on May 14, 2025 3:11 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…