లోకేష్ కనకరాజ్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. ఖైదీ, విక్రమ్ లాంటి చిత్రాలతో అతను తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అతను సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందిస్తున్న కూలీ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం.. కోలీవుడ్లో తొలి వెయ్యి కోట్ల సినిమా అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఐతే రజినీతో సినిమా ఓకే అయినపుడు లోకేష్ ఆయనకు చెప్పిన ఇది కాదట. ముందు సూపర్ స్టార్కు ఓ కథ చెబితే.. ఆయనకు చాలా నచ్చిందని.. కానీ రెండు నెలల తర్వాత వెళ్లి ఆయనకు వేరే కథ చెప్పానని లోకేష్ తెలిపాడు.
ముందు అనుకున్న కథ రజినీకి చాలా నచ్చినప్పటికీ.. ఆయనతో వేరే కథ చేస్తే బాగుంటుందని కూలీ స్క్రిప్టు రాశానని.. తాను కథ మార్చినా అభ్యంతర పెట్టకుండా రజినీ ఈ సినిమా చేశాడని లోకేష్ తెలిపాడు. కూలీ సినిమా చేస్తూ ప్రతి రోజూ రజినీ నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నట్లు లోకేష్ తెలిపాడు. తాను కూలీ లాంటి మల్టీస్టారర్ మూవీని ఆర్ఆర్ఆర్ తరహాలో మూడేళ్లు తీయలేనని.. ఎనిమిది నెలల్లోనే ఈ చిత్రం పూర్తయిందని.. ఐతే ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న ఆర్టిస్టులందరికీ వేరే సినిమా చేయకుండా అదే లుక్లో ఉండాలని మాత్రం షరతు పెట్టానని లోకేష్ తెలిపాడు.
తన తర్వాతి చిత్రం ఖైదీ-2నే అని ఖరారు చేసిన లోకేష్.. దాని తర్వాత విక్రమ్-2 ఉంటుందన్నాడు. విజయ్తో లియో-2 కూడా చేయాల్సి ఉందని, అలాగే రోలెక్స్ పాత్రతో స్టాండ్ అలోన్ మూవీకి కూడా ఐడియా రెడీ అయిందని లోకేష్ తెలిపాడు. ఇక రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరినీ పెట్టి ఒక మల్టీస్టారర్ చేయాలని ఉందని.. ఇద్దరు వయసు మీద పడ్డ గ్యాంగ్ స్టర్స్ జీవితాలను ఈ సినిమాలో చూపిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నానని.. ఆ ఐడియాను వాళ్లిద్దరికీ చెప్పడం కూడా అయిందని.. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది వారే అని.. కానీ అదంత తేలికైన విషయం కాదని లోకేష్ అన్నాడు. లియో మీద వచ్చిన విమర్శలకు తానేమీ దిగాలు పడిపోలేదని.. కానీ ఫీడ్ బ్యాక్ మాత్రం తీసుకున్నానని లోకేష్ చెప్పాడు.
This post was last modified on May 12, 2025 10:55 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…