Movie News

ఆర్ఆర్ఆర్ లండన్ : ముగ్గురు స్టార్ల కలయిక

కాంబోలు సెట్ చేయడంలో, అరుదైన కలయికలు చేసి చూపించడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. ఇవాళ లండన్ లో ఆర్ఆర్ఆర్ లైవ్ కన్సర్ట్ జరగబోతోంది. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో భారీ ప్రేక్షకుల మధ్య జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్ కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, జక్కన్నతో పాటు పలువురు కీలక సభ్యులు హాజరు కాబోతున్నారు. అసలు విశేషం ఇది కాదు. వీళ్ళతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు జట్టు కట్టనున్నాడు. ఈ మేరకు అక్కడికి చేరుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఒకే పార్టీలో ఈ ముగ్గుర్ని చూశాం కానీ బయట పబ్లిక్ స్టేజిని పంచుకోవడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పాలి. అందుకే స్పెషల్ కానుంది.

ఎస్ఎస్ఎంబి 29లో నటించడం వల్లే మహేష్ హాజరుకు కారణం కావొచ్చు కానీ నిజానికి అవసరం లేదనుకుంటే డ్రాప్ అవ్వొచ్చు. కానీ ఆర్ఆర్ఆర్ ని ఇష్టపడిన సాటి హీరోగా తన ప్రెజెన్స్ మరింత గ్లామర్ ని తీసుకొస్తుందని భావించి ఎస్ చెప్పారు. ఈవెంట్ కి సంబందించిన లైవ్ కవరేజ్ మనకు చూసే అవకాశం లేదు కానీ ఫోటోలు, వీడియోలు వచ్చేస్తాయి కాబట్టి అక్కడ చూసుకోవచ్చు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఆధ్వర్యంలో జరగబోయే ఈ మ్యూజికల్ గ్రాండియర్ గతంలో జరిగిన బాహుబలి తరహాలోనే లైవ్ ఆర్కెస్ట్రాతో ఉంటుంది. నాటు నాటు పాటను ప్రత్యక్షంగా ఎలా రికార్డింగ్ చేశారో చూడొచ్చు.

ఇలాంటి జ్ఞాపకాలు ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. మేడం టుస్సాడ్ మ్యుజియంలో తన మైనపు బొమ్మ ఆవిష్కరణ కోసం ఇప్పటికే లండన్ లో ఉన్న రామ్ చరణ్ నిన్న దాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇవాళ ఆర్ఆర్ఆర్ ఈవెంట్ లో భాగం పంచుకోబోతున్నాడు. రిలీజై మూడేళ్లు గడిచిపోయినా ట్రిపులార్ తాలూకు సెలబ్రేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మహేష్ బాబు 29 షూట్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన రాజమౌళి ఈ రకంగా మహేష్ బాబు సమయాన్ని వాడుకోవడం గమనార్హం. తారక్, చరణ్, మహేష్ ఈ ముగ్గురు అక్కడ కలుసుకోవడం సరే కానీ ఒకవేళ ఇదే కాంబోతో మల్టీస్టారర్ చేయాలంటే అది కూడా రాజమౌళికే సాధ్యం.

This post was last modified on May 11, 2025 1:53 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

4 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

4 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

6 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

7 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

8 hours ago

అనుష్క సినిమాకు మళ్ళీ మౌనవ్రతం

అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…

9 hours ago